-
పరిమిత శ్రేణిలో ట్రేడింగ్!
ముంబై: ఈ ఏడాది చివరి వారం స్టాక్ సూచీలు పరిమిత శ్రేణిలో కదలాడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. సంవత్సరం ముగింపు నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్లను ప్రభావితం చేసే పరిణామాలేవీ లేకపోవడంతో పాటు ఆయా దేశాల స్టాక్ మార్కెట్లు పనిచేయకపోవడం ఇందుకు కారణాలుగా చెబుతున్నారు. అయితే ఒమిక్రాన్ వేరియంట్ కేసుల పెరుగుదల, డిసెంబర్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు అంశాలతో అప్రమత్తత చోటు చేసుకోవచ్చని చెబుతున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులపై ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ ధరల కదలికలపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించనున్నాయి. ‘‘రక్షణాత్మక రంగాలైన ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఫార్మా షేర్లు రాణించడంతో గత వారంలో సాంకేతికంగా నిఫ్టీ 17,000 స్థాయిని నిలుపుకుంది. మార్కెట్ కరెక్షన్ కొనసాగితే దిగువ స్థాయిలో 16,700 వద్ద తక్షణ మద్దతు ఉంది. ఈ స్థాయిని కోల్పోతే 16,650 వద్ద మద్దతు లభించవచ్చు. ఒకవేళ దిగువ స్థాయిలో కొనుగోళ్ల మద్దతు లభిస్తే 17,150–17,200 శ్రేణిని పరీక్షించవచ్చు’’ అని స్వస్తిక్ ఇన్వెస్ట్మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు. గతవారం సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనైనా.., రక్షణాత్మక రంగాలకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెన్సెక్స్ 113 పాయింట్లు, నిఫ్టీ 18 పాయింట్లు స్వల్ప లాభంతో గట్టెక్కాయి. ఒమిక్రాన్ వ్యాప్తి ప్రభావం ఒమిక్రాన్ వేరియంట్ కట్టడికి ప్రభుత్వాలు విధిస్తున్న ఆంక్షలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. దేశంలో శనివారం నాటికి 150 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్తో సహా రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూలను అమలు చేస్తున్నాయి. వైరస్ కట్టడికి అనేక పలు దేశాల ప్రభుత్వాలు ప్రయాణాలపై ఆంక్షలను, కర్ఫ్యూలను విధిస్తుండటం వల్ల ఆర్థిక రివకరీకి ప్రతికూలం కావచ్చనే భయాలు వెంటాడుతున్నాయి. కేసుల సంఖ్య మరింత పెరగవచ్చనే ఆందోళనలతో ట్రేడర్లు తమ పొజిషన్లను పరిమితం చేసుకుంటున్నారు. గురువారం ఎఫ్అండ్ఓ ముగింపు ఈ గురువారం(ఈ నెల 30న) నిఫ్టీ సూచీకి చెందిన డిసెంబర్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తన పొజిషన్లను స్క్వేయర్ ఆఫ్కు ఆసక్తి చూపుతుండటంతో స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు దేశీయ మార్కెట్లో మూడు నెలల నుంచి విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు కొనసాగుతున్నాయి. ఈ డిసెంబర్లో ఇప్పటి వరకు రూ.17,825 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఏడాది ముగింపు వారంలో అమ్మకాల తీవ్రత తక్కువగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మార్కెట్లో అస్థితరత తగ్గితే ఎఫ్ఐఐల విక్రయాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందంటున్నారు. సూక్ష్మ ఆర్థిక గణాంకాలు నవంబర్ నెల ద్రవ్యలోటు, మౌలిక రంగ ఉత్పత్తి గణాంకాలతో పాటు సెప్టెంబర్ క్వార్టర్కు సంబంధించిన కరెంట్ అకౌంట్ లెక్కలు శుక్రవారం విడుదల కానున్నాయి. అదేరోజున డిసెంబర్ 17తో ముగిసిన వారం డిపాజిట్, బ్యాంక్ రుణ వృద్ధి, డిసెంబర్ 24తో ముగిసిన వారం ఫారెక్స్ నిల్వలను గణాంకాలను ఆర్బీఐ విడుదల చేయనుంది. మూడు లిస్టింగ్లు ఇటీవల ప్రాథమిక మార్కెట్ నుంచి నిధులు సమీకరించిన మూడు కంపెనీల షేర్లు ఈ వారంలో లిస్ట్ కానున్నాయి. హెచ్పీ అడెసివ్స్ షేర్లు సోమవారం(27న).., సుప్రియ లైఫ్సైన్సెన్స్ షేర్లు మంగళవారం(28న), సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ షేర్లు ఏడాది చివరిరోజున(డిసెంబర్ 31న) లిస్ట్కానున్నాయి. ఈ అంశమూ ట్రేడింగ్ను ప్రభావితం చేయవచ్చు. -
ఒడిదుడుకుల వారం
ఈవారంలోనే డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు • సెలవుల కారణంగా స్వల్పంగా విదేశీ ఇన్వెస్టర్ల లావాదేవీలు • రేంజ్బౌండ్లోనే స్టాక్ సూచీలు • నిపుణుల అంచనాలు న్యూఢిల్లీ: డిసెంబర్ సిరీస్ డెరివేటివ్ కాంట్రాక్టులు ఈ వారమే ముగియనున్నందున ఈ వారం స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులమయంగా ఉంటుందని నిపుణుల అంచనా. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల పోకడలు, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల గమనం, డాలర్తో రూపాయి మారకం కదలికలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల పోకడలు, జీఎస్టీకి అవరోధాలు తొలగించడానికి ప్రభుత్వం తీసుకునే చర్యలు...తదితర అంశాల ప్రభావం కూడా స్టాక్ మార్కెట్పై ఉంటుందని వారంటున్నారు. కొంత రికవరీ. అంతర్జాతీయంగా, దేశీయంగా ప్రధాన ఆర్థిక సంఘటనలేమీ లేకపోవడం వల్ల స్టాక్ మార్కెట్ స్వల్పకదలికలకే పరిమితం కానున్నదని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. ఈ నెల 31 తర్వాత నగదు కొరత కొంత తగ్గే అవకాశాలున్నాయని, అందుకని స్వల్పకాలంలో ఈక్విటీ మార్కెట్లు రికవరీ కావచ్చని కొందరు నిపుణులు భావిస్తున్నారు. కొత్త సంవత్సర సెలవుల సందర్భంగా విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల ఒత్తిడి ఒకింత తగ్గవచ్చని అమ్రపాలి ఆధ్య ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ డైరెక్టర్ అభ్నిష్ కుమార్ సుధాంశు అంచనా వేస్తున్నారు. అమెరికా నిరుద్యోగ గణాంకాలు, ముడిచమురు నిల్వల గణాంకాలు ఈ వారమే విడుదలవుతాయని, ఈ గణాంకాలు మన మార్కెట్ గమనానికి కీలకం కానున్నాయని క్యాపిటల్వయా గ్లోబల్ రీసెర్చ్ సీఈఓ రోహిత్ గాడియా పేర్కొన్నారు. ఎన్ఎస్ఈ నిఫ్టీ కీలకమైన 8,000 పాయింట్ల పైకి రావడానికి కష్టపడుతోందని, 8,000 పాయింట్లను మించలేకపోతే, మరింత పతనం తప్పదని పేర్కొన్నారు. ప్రస్తుతానికైతే ఇన్వెస్టర్లు ట్రేడింగ్కు ఒకింత దూరంగా ఉండడమే మంచిదని ఏంజెల్ బ్రోకింగ్ సంస్థ పేర్కొంది. షార్ట్ కవరింగ్.. సంవత్సరాంతం సందర్బంగా మిడ్క్యాప్ షేర్లలో కదలికలు ఉంటాయని కోటక్ సెక్యూరిటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దీపేన్ షా పేర్కొన్నారు. స్వల్పకాలంలో కొంత స్తబ్దత ఉన్నా, మధ్య కాలానికి, దీర్ఘకాలానికి భారత స్టాక్ మార్కెట్ ఆశావహంగానే ఉందని ఎస్ఎంసీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ అడ్వైజర్స్ సీఎండీ డి.కె. అగర్వాల్ చెప్పారు. అందుకని దీర్ఘకాలం లక్ష్యంగా ఇన్వెస్ట్చేసే ఇన్వెస్టర్లు భవిష్యత్తులో మంచి వృద్ధి సాధించే రంగాల్లోని కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయవచ్చని ఆయన సూచిస్తున్నారు. దిగువ స్థాయిల్లో షార్ట్ కవరింగ్ కారణంగా స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు ఉంటాయని ట్రేడ్బుల్స్ సీఓఓ ధ్రువ్ దేశాయ్ చెప్పారు. జోరుగా ‘విదేశీ’ నిధులు వెనక్కి... అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ల పెంపు నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెలలో మన క్యాపిటల్ మార్కెట్నుంచి 350 కోట్ల డాలర్ల మేరకు పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. వీటిల్లో అధిక భాగం డెట్మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్న పెట్టుబడులు ఉన్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు ఇప్పటిదాకా ఈ నెలలో ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ.3,744 కోట్లు, డెట్ మార్కెట్నుంచి రూ.19,027 కోట్ల చొప్పున తమ పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. వెరశి ఈ నెలలో మన క్యాపిటల్ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు రూ.22,771 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. కాగా ఈ ఏడాది ఇప్పటిదాకా విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీల్లో నికరంగా రూ.24,998 కోట్లు పెట్టుబడులు పెట్టగా, డెట్ మార్కెట్ నుంచి రూ.43,737 కోట్లు వెనక్కి తీసుకున్నాయి. -
ఒడిదుడుకుల వారం..
డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు ప్రభావం వచ్చే నెల 5న ఆర్బీఐ పాలసీ సమీక్ష రేట్ల కోతపై అంచనాలు న్యూఢిల్లీ: మార్చి డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు వారమైనందున ఈ వారం స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు తప్పవని నిపుణులంటున్నారు. హోలి, గుడ్ ప్రైడే కారణంగా గత వారంలో గురు, శుక్రవారాలు స్టాక్ మార్కెట్కు సెలవు. ఈ దీర్ఘకాల సెలవుల అనంతరం ప్రారంభం కానున్న ఈ వారం స్టాక్ మార్కెట్పై అంతర్జాతీయ సంకేతాలు, ముడి చమురు ధరల గమనం, రూపాయి కదలికలు తదితర అంశాలు కూడా ప్రభావం చూపుతాయని విశ్లేషకులంటున్నారు. ఈ నెల విక్రయాల గణాంకాలను ఈ శుక్రవారం(ఏప్రిల్ 1న) వాహన కంపెనీలు వెల్లడించనున్నందున ఆ కంపెనీ షేర్లు వెలుగులోకి రావచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి వారం కూడా ఇదే. మరోవైపు మార్చి డెరివేటివ్స్ కాంట్రాక్టులు ఈ వారంలో గురువారం నాడు(మార్చి 31న) ముగియనున్నందున ట్రేడర్లు తమ పొజిషన్లను రోల్ ఓవర్ చేయనున్న నేపధ్యంలో స్టాక్ సూచీలు ఒడిదుడుకులకు గురవుతాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. రేట్ల కోత కీలకం.. వచ్చే నెల 5న జరగనున్న ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష.. సమీప కాలంలో స్టాక్ మార్కెట్కు కీలకం కానున్నదని సింఘానియా పేర్కొన్నారు. అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్ల పోకడలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, రూపాయి కదలికలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో హెచ్చుతగ్గులు... స్టాక్ మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని క్యాపిటల్వయా గ్లోబల్ రీసెర్చ్ సీఈఓ రోహిత్ గాడియా చెప్పారు. ఆర్బీఐ ద్రవ్య సమీక్షపైననే తర్వాతి దశ స్టాక్ మార్కెట్ ర్యాలీ ఆధారపడి ఉందని జియోజిత్ బీఎన్పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్(ఫండమెంటల్ రీసెర్చ్)వినోద్ నాయర్ చెప్పారు. ఈ సమీక్షలో సానుకూల నిర్ణయం వెలువడితే స్టాక్ మార్కెట్ మరింత దూసుకుపోతుందని పేర్కొన్నారు. పరిమితశ్రేణిలో ట్రేడింగ్.. ఈ వారంలో స్టాక్ మార్కెట్ పరిమితశ్రేణిలో ట్రేడవుతుందని జైఫిన్ అడ్వైజర్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ దేవేంద్ర నేవ్గి చెప్పారు. వచ్చే నెల రెండో వారం నుంచి ప్రారంభమయ్యే కంపెనీల ఆర్థిక ఫలితాల కోసం మార్కెట్ ఆసక్తిగా ఎదురు చూస్తోందని వివరించారు. చిన్న మొత్తాల పొదుపుపై వడ్డీరేట్లను తగ్గించినందున ఆర్బీఐ కీలక రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తుందన్న అంచనాలు సర్వత్రా నెలకొన్నాయని పేర్కొన్నారు. సుదీర్ఘ సెలవుల అనంతరం మార్కెట్ ప్రారంభమవుతోందని, తాజాగా పొజిషన్లు తీసుకోవడం ద్వారా ట్రేడర్లు.. స్టాక్ మార్కెట్ పెరిగితే లాభపడతారని మోతిలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ (మిడ్క్యాప్స్ రీసెర్చ్) రవి షెనాయ్ చెప్పారు. డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు సందర్భంగా మార్కెట్ మరింత బలహీనపడవచ్చని ఏంజెల్ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్(రీసెర్చ్) వైభవ్ అగర్వాల్ చెప్పారు. ఆర్బీఐ రేట్ల కోత, కంపెనీల ఆర్థిక ఫలితాలపై అంచనాలు మార్కెట్ పెరగడానికి దోహద పడవచ్చని పేర్కొన్నారు. ఒడిదుడుకులున్నప్పటికీ, స్టాక్ సూచీలు తమ జోరును కొనసాగిస్తాయని యెస్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ నిటాషా శంకర్ చెప్పారు. వచ్చే నెలలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచే అవకాశాలున్నాయని జియోజిత్ బీఎన్పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్(టెక్నికల్ రీసెర్చ్) ఆనంద్ జేమ్స్ చెప్పారు. ఈ ప్రభావం ప్రపంచ మార్కెట్లపై తీవ్రంగానే ఉంటుందని వివరించారు. భారత్తో సహా అన్ని వర్ధమాన దేశాలకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ల పెంపు కీలకం కానున్నదని వివరించారు. మూడు రోజులే ట్రేడింగ్ జరిగిన గత వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 385 పాయింట్లు (1.54 శాతం)లాభపడి 25,338 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 112 పాయింట్లు(1.47 శాతం) లాభపడి 7,717 పాయింట్ల వద్ద ముగిశాయి. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల జోరు విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల జోరు కొనసాగుతోంది. ఈ నెలలో ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు క్యాపిటల్ మార్కెట్లో రూ.16,500 కోట్లు (250 కోట్ల డాలర్లు) పెట్టుబడులు పెట్టారు. ఆర్బీఐ కీలక రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు దీనికి ప్రధాన కారణం. డిపాజిటరీల గణాంకాల ప్రకారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐ)ఈ నెల 23 వరకూ ఈక్విటీ మార్కెట్లో రూ.15,660 కోట్లు, డెట్ మార్కెట్లో రూ.816 కోట్లు పెట్టుబడుటు పెట్టారు. అంతకు ముందటి నాలుగు నెలల్లో విదేశీ ఇన్వెస్టర్లు రూ.41,661 కోట్ల పెట్టుబడులు స్టాక్ మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్నారు. -
ఒడిదుడుకుల వారం
{పపంచ మార్కెట్లు, డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు కారణాలు మార్కెట్ ట్రెండ్పై నిపుణుల అంచనా ముంబై : బలహీనంగా వున్న ప్రపంచ మార్కెట్లు, త్వరలో ముగియనున్న ఆగస్టు డెరివేటివ్స్ కాంట్రాక్టుల కారణంగా ఈ వారం భారత్ ఈక్విటీలు ఒడిదుడుకులకు లోనవుతాయని విశ్లేషకులు అంచనావేశారు. చైనా వృద్ధి మందగించిందన్న భయాలతో ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు గతవారం భారీగా తగ్గాయి. శుక్రవారం అమెరికా మార్కెట్ సైతం అతిపెద్ద పతనాన్ని చవిచూసింది. ఈ ప్రభావం మన మార్కెట్పై కూడా వుంటుందని నిపుణులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆగస్టు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ కాంట్రాక్టులు వచ్చే గురువారం ముగియనున్నందున, భారత్ సూచీలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చని జియోజిత్ బీఎన్పీ పారిబాస్ టెక్నికల్ హెడ్ ఆనంద్ జేమ్స్ చెప్పారు. ఇదే సమయంలో రూపాయి పతనం ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బతీయవచ్చని జైఫిన్ అడ్వయిజర్స్ దేవేంద్ర నావ్గి అన్నారు. గతవారం డాలరుతో రూపాయి విలువ రెండేళ్ల కనిష్టస్థాయి 65.83 వద్దకు పడిపోయిన సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణం తగ్గిన కారణంగా రిజర్వుబ్యాంక్ వడ్డీరేట్లను తగ్గింవచ్చన్న అంచనాలు మార్కెట్కు ఊతమివ్వవచ్చని జేమ్స్ వివరించారు. అలాగే కనీస ప్రత్యామ్నాయ పన్ను(మ్యాట్)పై విదేశీ ఇన్వెస్టర్లకు ఊరట లభించడం మార్కెట్కు సానుకూలమని అన్నారు. గత వారం మార్కెట్.... గతవారం బీఎస్ఈ సెన్సెక్స్ 701 పాయింట్లు పతనమై 27,366 పాయింట్ల వద్ద ముగిసింది. వివిధ దేశాల కరెన్సీలు కుప్పకూలడంతో ప్రపంచవ్యాప్తంగా గతవారం మార్కెట్లు క్షీణించాయి. -
తీవ్ర హెచ్చుతగ్గులు!
ఫ్యూచర్స్, ఆప్షన్స్ కాంట్రాక్టుల ముగింపు ప్రభావం ఈ వారం మార్కెట్పై నిపుణుల అంచనా న్యూఢిల్లీ : జూలై డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు కారణంగా ఈ వారం స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గులకు లోనవుతుందని విశ్లేషకులు హెచ్చరించారు. ఫ్యూచర్స్, ఆప్షన్స్ జూలై కాంట్రాక్టులు వచ్చే గురువారం ముగియనున్నాయి. ఈ సందర్భంగా మార్కెట్లో ఒడిదుడుకులుంటాయని, ఈక్విటీలు పటిష్టపడేందుకు అవసరమైన మద్దతును ఇచ్చే అంశమేదీ లేదని క్యాపిటల్వయా డెరైక్టర్ వివేక్ గుప్తా చెప్పారు. పార్లమెంటు సమావేశాల్లో సంస్కరణల బిల్లులు ఆమోదం పొందుతాయని లేదా క్యూ1 కార్పొరేట్ ఫలితాలు ఉత్సాహపరుస్తాయన్న ఆశలు ఇన్వెస్టర్లలో వున్నాయని, కానీ ఇప్పుడు మార్కెట్లో విశ్వాసం కొరవడిందని జీయోజిత్ బీఎన్పీ పారిబాస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు. కొద్దికాలం దిద్దుబాటు... సంస్కరణలకు ప్రతీ స్థాయిలోనూ అడ్డంకులు ఏర్పడుతున్నందున, ఆర్థిక వ్యవస్థ వృద్ధి అవకాశాల పట్ల ఇన్వెస్టర్లకు సందేహాలు తలెత్తుతున్నాయని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ అన్నారు. ఈ కారణంగా కొద్దికాలం మార్కెట్ దిద్దుబాటు బాటలో వుండవచ్చని, విస్తృత శ్రేణిలో సూచీలు కదలవచ్చని అంచనావేశారు. వర్షపాతం మెరుగ్గాఉంటుందన్న ఆశాభావం ఇన్వెస్టర్లలో ఉందని, వర్షాలు బావుంటే ఆగస్టు 4నాటి ఆర్బీఐ పాలసీ సమీక్షలో రేట్ల కోత వుండవచ్చని ఆయన చెప్పారు. ఈ వారం కార్పొరేట్ ఫలితాలు... ఈ వారం ఐటీసీ, మారుతి సుజుకీ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, టెక్ మహీంద్రా, పీఎన్బీ, ఎన్టీపీసీ, ఎల్ అండ్ టీ తదితర బ్లూచిప్ కంపెనీలు ఆర్థిక ఫలితాల్ని వెల్లడించనున్నాయి. ఈ ఫలితాలు మార్కెట్ గమనాన్ని కొంతవరకూ నిర్దేశింప వచ్చని నిపుణులు చెప్పారు. గత శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత వెల్లడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫలితాల ప్రభావం సోమవారం మార్కెట్ ప్రారంభంలో కన్పిస్తుందని శామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమిత్ మోదీ తెలిపారు. రిఫైనింగ్, పెట్రోకెమికల్స్ మార్జిన్లు పెరగడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాండెలోన్ నికరలాభం రూ. 6,318 కోట్లకు ఎగిసింది. గతవారం మార్కెట్... గతవారం అంతర్జాతీయ మార్కెట్లలో ట్రెండ్కు అనుగుణంగా బీఎస్ఈ సెన్సెక్స్ 351 పాయింట్లు నష్టపోయి, 28,112 పాయింట్ల వద్ద ముగిసింది. ఫలితాల వెల్లడి తర్వాత ఇన్ఫోసిస్ భారీగా పెరగడంతో సెన్సెక్స్ నష్టాలు పరిమితంగా వున్నాయి. బ్యాంకులు, మెటల్, రియల్టీ షేర్లు నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు రూ. 8,400 కోట్లు జూలై నెలలో ఇప్పటివరకూ విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) భారత క్యాపిటల్ మార్కెట్లో రూ. 8,400 కోట్లు పెట్టుబడి చేశారు. ఈక్విటీల్లో రూ. 7,261 కోట్లు, రుణపత్రాల్లో రూ. 1,154 కోట్ల చొప్పున వారు నికర పెట్టుబడి చేసినట్లు సెంట్రల్ డిపాజిటరీల డేటా వెల్లడిస్తున్నది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు ఎస్వీ డిగ్రీ కళాశాలకు ముగ్గురు కమిటీ సభ్యులరాక
No Headline
ఎన్నికల భారతం పుస్తకావిష్కరణ
వృత్తిదారుల మోములో ఆనందం...
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం (ఫొటోలు)
"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
‘మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలి’
తప్పక చదవండి
- ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement