breaking news
deep search
-
సముద్ర అన్వేషణకు మత్స్య–6000
చెన్నై: సముద్ర అంతర్భాగంలోని రహస్యాలను ఛేదించడానికి భారత ఆక్వానాట్స్ రమేశ్ రాజు, జతీందర్పాల్ సింగ్ సిద్ధమవుతున్నారు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మిస్తున్న ‘మత్స్య–6000’సముద్రయాన వాహనంలో వచ్చే ఏడాది ఆరంభంలో సాగర మథనం చేయబోతున్నారు. 28 టన్నుల బరువైన ఈ వాహనం సముద్రంలో 6000 మీటర్ల లోతు వరకు సునాయాసంగా ప్రయాణించగలదు. చెన్నై తీరంలో ప్రయాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సముద్రంలో అత్యంత లోతునకు వెళ్లి పరిశోధనలు చేసే సామర్థ్యం ప్రస్తుతం కొన్ని దేశాలకే ఉంది. ఆ జాబితాలో భారత్ సైతం చేరబోతోంది. రమేశ్ రాజు, జతీందర్పాల్ సింగ్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషియన్ టెక్నాలజీ(ఎన్ఐఓటీ)లో శిక్షణ పొందారు. ‘మత్స్య–6000’కు వీరిద్దరూ సారథ్యం వహించబోతున్నారు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న డీప్ ఓషియన్ మిషన్లో భాగంగానే ఈ సముద్రయానం జరుగుతోంది. రిమోట్తో పనిచేసే వాహనాలు, యంత్రాలను, మర మనుషులను సముద్రం లోతుల్లోకి పంపించి, అనేక పరిశోధనలు చేశారు. కొత్త విషయాల కనిపెట్టారు. కానీ, 6 కిలోమీటర్ల లోతుకు మనుషులకు పంపిస్తుండడం మాత్రం ఇదే మొదటిసారి అని ఎన్ఐఓటీ డైరెక్టర్ బాలాజీ రామకృష్ణన్ చెప్పారు. మన ఆక్వానాట్స్ భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. కేంద్ర ఎర్త్ సైన్సెస్ శాఖ ఆధ్వర్యంలో సముద్రయాన్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. స్వయం సమృద్ధికి పెద్దపీట వేస్తూ సబ్మెర్సిబుల్ వాహనాన్ని సొంతంగానే నిర్మించడం విశేషం. ఇందుకోసం డీఆర్డీఓ, సీఎస్ఐఆర్, ఇస్రో వంటి సంస్థల సహకారం తీసుకున్నామని బాలాజీ రామకృష్ణన్ వెల్లడించారు. మనకు అవరమైన నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం మనదేశంలోనే ఉన్నాయని చెప్పారు. యంత్రాలు కాకుండా నేరుగా మానవులే వెళ్తే మరిన్ని రహస్యాలను ఛేదించడానికి వీలుంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మానవుడి కంటికి ఏ కెమెరా కూడా ప్రత్యామ్నాయం కాదని సముద్రయాన్ ప్రాజెక్టు డైరెక్టర్ సత్యనారాయణన్ పేర్కొన్నారు. సముద్ర అంతర్భాగాన్ని మరింత విస్తృతంగా శోధించడానికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని స్పష్టంచేశారు. నిమిషానికి 30 మీటర్ల వేగం సముద్రాల అంతర్బాగాల్లో ఎన్నెన్నో విశేషాలు ఉన్నాయి. అత్యంత అరుదైన ఖనిజాలు, ఇంధనాలు, జీవవైవిధ్య వనరులకు అడ్డాగా చెప్పొచ్చు. అమెరికా, రష్యా, చైనా, జపాన్, ఫ్రాన్స్ దేశాలకు మాత్రమే సముద్రాల లోతుల్లోకి వెళ్లి అన్వేíÙంచే సామర్థ్యం ఉంది. సముద్రయాన్ ప్రాజెక్టు విజయవంతమైతే ఆ ఘనత సాధించిన దేశాల జాబితాలోకి ఇండియా కూడా చేరుతుంది. భారత్కు 11,098 కిలోమీటర్ల సుదీర్ఘ సముద్రతీరం ఉంది. దేశ ప్రగతికి సముద్ర వనరులను గరిష్టంగా ఉపయోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయానికొచి్చంది. ఇందుకోసమే డీప్ సీ ఓషియన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. మత్స్య–6000 విశేషాలను గమనిస్తే ఇది 2.25 మీటర్ల వ్యాసం కలిగిన గోళాకార వాహనం. బాయిలర్ స్టీల్తో నిర్మించారు. లిథియం–పాలీమర్ బ్యాటరీలతో పనిచేస్తుంది. ఈ వాహనాన్ని తొలుత 500 మీటర్ల లోతు వరకు తీసుకెళ్తారు. 2027 నాటికి దీని సామర్థ్యాన్ని 10 రెట్లు పెంచుతారు. అంటే 6,000 మీటర్ల లోతుకు వెళ్లేలా అభివృద్ధి చేస్తారు. ఇది నిమిషానికి 30 మీటర్ల వేగంతో సముద్రంలోకి దూసుకెళ్లగలదు. ఇందులో కెమెరాలు, విద్యుత్ దీపాలతోపాటు మర చేతులు ఉంటాయి. వాటితో సముద్రంలో నమూనాలు సేకరిస్తారు. కొన్ని నెలల క్రితం ఫ్రెంచ్ సబ్మెర్సిబుల్ వాహనం నాటైల్లో ఇద్దరు సైంటిస్టులు సముద్రంలో 5000 మీటర్ల లోతు వరకు ప్రయాణించారు. ఆ ప్రయోగమే మత్స్య– 6000 అభివృద్ధికి స్ఫూర్తినిచి్చంది. -
యథేచ్ఛగా రంగురాళ్ల వేట
* పల్నాడు అటవీ ప్రాంతంలో తవ్వకాలు * అధికార పార్టీ నేతల కనుసన్నల్లో అక్రమాలు * ఆదివారం మూడు ద్విచక్ర వాహనాలు దగ్ధం * భట్రుపాలేనికి చెందిన టీడీపీ నేతలవిగా గుర్తింపు సాక్షి, గుంటూరు: పల్నాడులోని దాచేపల్లి, బెల్లంకొండ అటవీ భూముల్లో రంగు రాళ్ల కోసం తవ్వకాలు జరుపుతున్నారు. ఏడాదిగా ఈ తవ్వకాలు జరుగుతున్నప్పటికీ జూన్లో అటవీ అధికారులు దీన్ని సీరియస్గా తీసుకుని తవ్వకాలను నిలిపివేశారు. అయితే రాత్రిపూట రహస్యంగా టార్చిలైట్ల వెలుతురులో తవ్వకాలు జరిపించిన అధికార పార్టీ నేతలు పది రోజులుగా ఉధృతం చేశారు. రంగురాళ్ల తవ్వకాలు జరిగే ప్రాంతంలో మూడు ద్విచక్ర వాహనాలను గుర్తు తెలియని దుండగులు దగ్ధం చేసినట్లు స్థానికులు సోమవారం ఉదయం గుర్తించారు. ఇవి ఆదివారం అర్ధరాత్రి దగ్ధమైనట్లు తెలిసింది. ఈ ద్విచక్ర వాహనాలు దాచేపల్లి మండలం భట్రుపాలేనికి చెందిన అధికార పార్టీ నేతలవిగా చెబుతున్నారు. రంగురాళ్ళ కోసం తవ్వకాలు జరిపేది అధికార పార్టీ నేతలే అనడానికి ఇంతకంటే మరో ఉదాహరణ లేదు. స్థానిక అధికార పార్టీ నేతలు కొందరు హైదరాబాద్కు చెందిన దళారుల సహాయంతో తవ్వకాల్లో లభ్యమైన రంగురాళ్ల ముడిసరుకును నేరుగా రాజస్థాన్కు రవాణా చేస్తూ రూ. లక్షలు గడిస్తున్నారు. రంగురాళ్ల వేట అధికార పార్టీ నేతల కనుసన్నల్లో జరుగుతుండటంతో పోలీసు, రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు ఆవైపునకు తిరిగి చూడడం లేదు. పది రోజులుగా ఇక్కడ తవ్వకాలు జరిగినప్పటికీ తమకేమీ తెలియనట్లు నిద్ర నటిస్తున్నారు. దాచేపల్లి మండలం శంకరాపురం సమీపంలోని అటవీ ప్రాంతంలో పది రోజులుగా భట్రుపాలెం, కాట్రపాడు, శంకరాపురం గ్రామాలకు చెందిన కూలీలు గ్రూపులుగా ఏర్పడి తవ్వకాలు జరుపుతున్నారు. ఈ గ్రూపులన్నీ అధికార పార్టీకి చెందిన కొందరు నేతల కనుసన్నల్లోనే రంగురాళ్ల వేట సాగిస్తున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా శంకరాపురం అడవుల్లో 15 నుంచి 20 అడుగుల లోతు సొరంగాలు తవ్వుతున్నారు. ఈ ప్రాంతంలో రంగు రాళ్ల ముడి రాయి అధికంగా దొరుకుతుంది. ఇక్కడ రంగు రాళ్లతోపాటు బంగారు ఆభరణాల్లో ఉపయోగించే ఖరీదైన జాతి రాళ్లు సైతం దొరుకుతుండటంతో మాఫియాగా తయారై తవ్వకాలు సాగిస్తున్నారు. అన్నీ తెలిసినా అటువైపు చూడని అధికారులు.. అటవీ ప్రాంతాల్లోని తండాల ప్రజలు బోరు వేసుకోవాలన్నా అనుమతుల కోసం ఇబ్బందులు పెట్టే అటవీ శాఖ అధికారులు పెద్ద ఎత్తున తవ్వకాలు జరుగుతున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. తవ్వకాల్లో ఓ కూలి ప్రమాదవశాత్తు మృతి చెందినప్పటికీ దాన్ని కూడా బయటకు పొక్కనీయకుండా గప్చుప్గా అంత్యక్రియలు కానిచ్చేశారని ఆరోపణలు వినవస్తున్నాయి. తాజాగా తవ్వకాలు జరిగే ప్రాంతంలో అధికార పార్టీ నేతలకు చెందిన మూడు ద్విచక్ర వాహనాలు దగ్ధం కావడంతో ఇప్పటికైనా పోలీస్, అటవీశాఖ అధికారులు కఠినంగా వ్యవహరిస్తారా లేదా అనే చర్చనీ యాంశమైంది.


