సముద్రంతో హీరో-హీరోయిన్ కబడ్డీ!
ఉరుకుల పరుగుల జీవితంలో ఒక ఒయాసిస్సులాంటి స్వాంతన కావాలా? మిమ్మల్ని మీరు కలుసుకోవాలనుకుంటున్నారా? మిమ్మల్ని మీరు కలుసుకోవాలనుకుంటున్నారా? ఆడుతూ పాడుతూ మళ్లీ బాల్యంలోకి జారుకోవాలనుకుంటున్నారా? అయితే 'డియర్ జిందగీ'ని ఓసారి పలుకరించాల్సిందే.
శ్రీదేవి కథానాయికగా 'ఇంగ్లిష్ వింగ్లిష్' సినిమాను తీసి అందరినీ మెప్పించిన దర్శకురాలు గౌరీ షిండే ఈసారి షారుఖ్ ఖాన్, అలియాఖాన్తో జతకట్టి..'డియర్ జిందగీ' అంటోంది. ఒక అరుదైన కాంబినేషన్లో మరోసారి లేడీ ఒరియంటెడ్ సినిమాగా 'డియర్ జిందగీ'ని తెరకెక్కించింది. ఇందులో అలియా ప్రశ్నలు అడిగే అమ్మాయిగా, షారుఖ్ సమాధానాలు చెప్పే వ్యక్తిగా కనిపిస్తారు. ఈ సినిమా తొలి టీజర్ తాజాగా విడుదల చేశారు. గోవా తీరంలో హీరో-హీరోయిన్ కబడ్డీ ఆటతో టీజర్ ప్రారంభమవుతుంది. సముద్రంతో కబడ్డీ ఆడుదామా.. అంటూ ప్రారంభమయ్యే ఈ టీజర్ సినిమా ఏంటో చెప్పకనే చెపుతోంది.