breaking news
cricket boards
-
ప్రపంచంలో ధనిక క్రికెట్ బోర్డులు ఇవే.. చివరి స్థానంలో ఊహించని పేరు
ప్రస్తుత జమానాలో క్రికెట్ కేవలం క్రీడ మాత్రమే కాదు. ఇదో పెద్ద వ్యాపారం. ఇందులో ఆయా దేశ క్రికెట్ బోర్డులు లెక్కలేనంతగా సంపాదిస్తున్నాయి. స్పాన్సర్లు, ప్రసార ఒప్పందాలు, ఇతరత్రా మార్గాల ద్వారా కోట్లకు పడగలెత్తుతున్నాయి. గత దశాబ్దకాలంలో ఈ ధోరణి మరింత పెరిగింది. ఐపీఎల్ లాంటి లీగ్ల వల్ల క్రికెట్ బోర్డుల రూపురేఖలే మారిపోయాయి. ఎంతలా అంటే, క్రికెట్ బోర్డులు దేశ అర్దిక వ్యవస్థలను శాశించేంతలా మారాయి. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఇందుకు ప్రధాన ఉదాహరణ.బీసీసీఐ ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు కావడమే కాక ప్రపంచ క్రికెట్ మొత్తాన్నే శాశిస్తుంది. ఐపీఎల్ బీసీసీఐ దశ దిశనే మార్చేసింది. 2008లో ఐపీఎల్ ప్రారంభమయ్యాక బీసీసీఐ రెవెన్యూ అమాంతం పెరిగింది. ధనార్జన విషయంలో ఇతర దేశ క్రికెట్ బోర్డులు బీసీసీఐ దరిదాపుల్లోకి కూడా రాలేపోతున్నాయి. తాజా లెక్కల ప్రకారం బీసీసీఐ నికర విలువ రూ. 19052 కోట్లని తెలుస్తుంది. ఈ సంఖ్యతో పోలిస్తే మిగతా క్రికెట్ బోర్డుల ఆదాయం కనీసం పది శాతం కూడా లేదు. తాజా నివేదికల ప్రకారం.. బీసీసీఐ అత్యంత సంపన్న క్రికెట్ బోర్డుగా ఉంటే, టెస్ట్ హోదా కలిగిన దేశాల్లో న్యూజిలాండ్ అతి పేద క్రికెట్ బోర్డుగా ఉంది. న్యూజిలాండ్ 1926 నుంచి అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నా ఆ దేశ క్రికెట్ బోర్డు క్రికెట్ను కేవలం క్రీడగానే చూస్తుంది. దీన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఏ నాడు ఆదాయ వనరుగా పరిగణించలేదు.కడు పేదరికాన్ని అనుభవిస్తున్న మన దాయాది దేశం పాకిస్తాన్ కూడా క్రికెట్ ద్వారా కోట్లు సంపాదిస్తుంటే న్యూజిలాండ్ మాత్రం క్రీడలో విలువలకు ప్రాధాన్యత ఇస్తూ చాలీచాలని ఆదాయంతో సరిపెట్టుకుంటుంది.బీసీసీఐ విషయానికొస్తే.. భారత్లో క్రికెట్ ప్రతి పౌరుడి జీవితంలో ఓ భాగం. ఇదే బీసీసీఐకి అతి పెద్ద పెట్టుబడి. బీసీసీఐ బలమంతా భారత క్రికెట్ మార్కెట్లోనే ఉంది. అంతర్జాతీయంగా ప్రముఖ కంపెనీలు భారత అభిమానుల ముందుకు రావడానికి వందల కోట్లు ఖర్చు పెడతాయి. ఐపీఎల్ పరిచమయ్యాక బీసీసీఐ తలరాతే మారిపోయింది. ఈ లీగ్ మీడియా హక్కులు చిన్న దేశ క్రికెట్ బోర్డుల ఆదాయం కంటే చాల ఎక్కువ. భారత పురుషుల సీనియర్ క్రికెట్ జట్టు స్పాన్సర్షిప్లు బీసీసీఐకి మరో ప్రధాన ఆదాయ వనరు. భారత్లోనే జరిగే మ్యాచ్ల టిక్కెట్ల అమ్మకాలు మరియు ఆ మ్యాచ్ల ద్వారా జరిగే వ్యాపారం బీసీసీఐకి అదనపు ఆదాయం. డిజిటల్ ఒప్పందాలు, ఐసీసీ ఆదాయ వాటాలు బీసీసీఐకి మరో భారీ ఆదాయ వనరు. ఇలా బీసీసీఐ నాలుగు చేతులా సంపాదిస్తూ ప్రపంచంలో అత్యంత ధనిక బోర్డుగా చలామణి అవుతుంది.తాజా నివేదికల ప్రకారం ప్రపంచంలోని టాప్ 10 ధనిక క్రికెట్ బోర్డుల వివరాలు ఇలా ఉన్నాయి.భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు-రూ. 19052 కోట్లుక్రికెట్ ఆస్ట్రేలియా- రూ. 684 కోట్లుఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు- రూ. 510 కోట్లుపాకిస్తాన్ క్రికెట్ బోర్డు- రూ. 476 కోట్లుబంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు- రూ. 441 కోట్లుక్రికెట్ సౌతాఫ్రికా- రూ. 406 కోట్లుజింబాబ్వే క్రికెట్ బోర్డు- రూ. 329 కోట్లుశ్రీలంక క్రికెట్ బోరు- రూ. 173 కోట్లువెస్టిండీస్ క్రికెట్ బోర్డు- రూ. 129 కోట్లున్యూజిలాండ్ క్రికెట్ బోర్డు- రూ. 77 కోట్లు -
జనవరి నుంచి బకాయిలు
న్యూఢిల్లీ: కరోనాతో అన్ని దేశాల క్రికెట్ బోర్డులు ఆర్థిక సంక్షోభంలోకి దిగజారాయి. మరీ ముఖ్యంగా క్రికెట్ వెస్టిండీస్ (సీడబ్ల్యూఐ) తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. తమ ఆటగాళ్లకు జీతాలు చెల్లించేందుకు నిధులు లేక విలవిల్లాడుతోంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెటర్లతో పాటు, దేశవాళీ ఆటగాళ్లకు నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వలేకపోయామని వెస్టిండీస్ బోర్డు గురువారం అంగీకరించింది. దీని గురించి వెస్టిండీస్ ఆటగాళ్ల సంఘం కార్యదర్శి వేన్ లూయిస్ మాట్లాడుతూ ‘జనవరిలో స్వదేశంలో ఐర్లాండ్తో జరిగిన 3 వన్డేలు, 3 టి20ల సిరీస్లతో పాటు... ఫిబ్రవరి–మార్చిలో శ్రీలంకలో పర్యటించిన పురుషుల జట్టుకు మ్యాచ్ ఫీజులివ్వలేదు. ఆసీస్ వేదిక గా మహిళల టి20 వరల్డ్ కప్లో తలపడిన జట్టుకు కూడా 4 మ్యాచ్ల ఫీజు చెల్లించాల్సి ఉంది. -
కరోనా దెబ్బకు విలవిలలాడుతోన్న క్రికెట్ బోర్డులు