breaking news
comeo
-
కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న రాజ్ తరుణ్
ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాజ్ తరుణ్, సెలెక్టివ్గా సినిమాలు చేస్తూ మినిమమ్ గ్యారెంటీ హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఇటీవల కిట్టూ ఉన్నాడు జాగ్రత్త సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్న రాజ్ తరుణ్, త్వరలోనే కోలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. జర్నీ సినిమాతో హిట్ పెయిర్గా పేరు తెచ్చుకున్న జై, అంజలిల కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనుంది. కొత్త దర్శకుడు సినీష్ దర్శకత్వంలో బెలూన్ పేరుతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. హర్రర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను తమిళ్తో పాటు తెలుగులోనూ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకే సినిమాలో కీలకమైన అతిథి పాత్రలో రాజ్ తరుణ్ నటిస్తే సినిమాకు ప్లస్ అవుతుందని భావించిన చిత్రయూనిట్, వెంటనే ఈ యంగ్ హీరోను సంప్రదించారు. ఇప్పటికే పలు చిత్రాల్లో గెస్ట్ అపియరెన్స్లు ఇచ్చిన రాజ్ తరుణ్, బెలూన్ చిత్రానికి కూడా ఓకె చెప్పాడట. ఇప్పటికే రాజ్ తరుణ్ షూటింగ్ కూడా ఫినిష్ చేసాడన్న టాక్ వినిపిస్తోంది. మరి డబ్బింగ్ సినిమాగా రిలీజ్ కానున్న బెలూన్కు రాజ్ తరుణ్ ఎంత వరకు ప్లస్ అవుతాడో చూడాలి. -
మరోసారి అతిథి పాత్రలో రాజ్ తరుణ్
యంగ్ హీరో రాజ్ తరుణ్ సినిమాల ఎంపికలో తన మార్క్ చూపిస్తున్నాడు. ఇప్పటికే మంచి సక్సెస్ రేట్తో వరుస సక్సెస్ లతో ఆకట్టుకుంటున్న రాజ్ తరుణ్, వరుసగా అతిథి పాత్రలకు ఓకె చెప్పేస్తున్నాడు. ఇటీవల విడుదలైన నాని మజ్ను సినిమాలో గెస్ట్ అపియరెన్స్ ఇచ్చాడు రాజ్ తరుణ్. తాజాగా మరో సినిమాలో అతిథి పాత్రకు ఓకె చెప్పాడు ఈ యంగ్ హీరో. తనతో సినిమా చూపిస్తా మామ లాంటి సక్సెస్ ఫుల్ సినిమా రూపొందించిన బెక్కం వేణుగోపాల్ తొలిసారిగా నిర్మిస్తున్న 'నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్' సినిమాలో గెస్ట్ రోల్లో కనిపించనున్నాడు. దిల్ రాజు సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడు.