breaking news
comdeian
-
అప్పుడు అందరినీ నవ్వించి.. ఇప్పుడు తిండి కోసం తిప్పలు
తెలుగులో మోహన్ బాబు హీరోగా నటించిన చిత్రం అసెంబ్లీ రౌడీ మీకు గుర్తుందా? అంతే కాకుండా ఆ సినిమాలో దివ్య భారతి ఆయనకు జోడీగా నటించింది. ఈ చిత్రంలో బ్రహ్మనందం కామెడీ మామూలుగా పాపులర్ కాలేదు. ఈ చిత్రంలో అందరినీ కడుప్పబ్బా నవ్వించిన పాత్ర మరొకటుంది. బ్రహ్మనందంతో కామెడీ సీన్స్లో కనిపించిన పాకీజా రోల్. ఆ చిత్రం ద్వారానే ఆమె తెలుగులో పాపులర్ అయింది. సీనియర్ నటి పాకీజా అలియాస్ వాసుకి. తమిళ, తెలుగు ఇండస్ట్రీలలో ఎన్నో వందల సినిమాలు, స్టార్ హీరోల సినిమాలలో గుర్తింపు తెచ్చిన పాత్రల్లో నటించింది. కానీ.. ఇప్పుడు తిండిలేక తిప్పలు పడుతోంది. ఆమె చాలా ఏళ్లుగా ఇండస్ట్రీకి, సినిమాలకు దూరంగా ఉంటోంది. సినిమాల ద్వారా సంపాదించిన మొత్తాన్ని పోగొట్టుకుని చివరికి రిక్త హస్తాలతో మిగిలిపోయి దీనస్థితిలో బతుకు వెళ్లదీస్తోంది. ఆ తర్వాత పెదరాయుడు, రౌడీ ఇన్స్పెక్టర్ చిత్రాల్లోనూ నటించింది పాకీజా. అందరి స్టార్ హీరోల సినిమాల్లో తెలుగులోనే దాదాపు 50 చిత్రాల్లో నటించింది. ఒకప్పుడు అందరినీ నవ్వించినా ఆమె పరిస్థితి దారుణంగా ఉంది. ఇటీవల ఆమె ఛానెల్తో మాట్లాడుతూ తన జీవితంలో ఎదురైన అనుభవాలను, ఆమె పరిస్థితికి గల కారణాలను వివరించారు. పాకీజా రోల్లో మంచి కమెడియన్ అందరినీ నవ్వించినా పేరు తెచ్చుకున్నా.. ఆస్తులు ఏ మాత్రం లేని పరిస్థితిలో ఉన్నామని తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. 'ఎన్టీఆర్, ఏఎన్నార్, బాలయ్య, మోహన్ బాబు.. ఇలా అందరి సినిమాల్లో చేశా. తెలుగులో దాదాపు 50 సినిమాలు చేశా. ఆ తర్వాత నా స్వస్థలం తమిళనాడులోని కరైకుడికి వెళ్లా. నాకు తెలుగులో బెస్ట్ ఫ్రెండ్ జయలలిత. 150 చిత్రాల్లో నటించినా చెన్నైలో సొంత ఇల్లు లేదు. సాయం కోసం తమిళ నడిగర్ సంఘంతో పాటు హీరోలను సంప్రదించాను. సీఎం కుమారుడు ఉదయనిధి స్టాలిన్ నా పరిస్థితిని వివరించా. ఎవరూ సాయం చేయలేదు. ప్రస్తుతం హాస్టల్ ఉంటున్నా. ఎవరైనా ఆదుకుంటారేమో అని వేచి చూస్తున్నా.' అని ఎమోషనలయ్యారామె. -
హాస్యనటుడు కొండవలస ఇకలేరు
హైదరాబాద్: ప్రముఖ హాస్యనటుడు కొండవలస లక్ష్మణరావు (69) కన్నుమూశారు. నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. గతకొంత కాలంగా చెవికి సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న ఆయనకు వ్యాధి తీవ్రత ముదిరి... మెదడుకు పాకడంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. 'నేనొప్పుకోను.. అయితే ఓకే' అనే డైలాగ్తో పాపులర్ అయిన కొండవలస.. దాదాపు 300 చిత్రాలకు పైగా నటించి ప్రేక్షక్షుల హృదయాలను తన నటన శైలితో ఆకట్టుకున్నారు. నాటక రంగంలో వెయ్యికి పైగా నాటకాలు వేసిన కొండవలసకు.. మొత్తం 378 అవార్డులతో పాటు రెండు నంది అవార్డులు కూడా లభించాయి. వంశీ దర్శకత్వంలో 'ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు' అనే చిత్రంతో సినిమారంగంలోకి ప్రవేశించారు. సినిమాల్లోకి రాకముందు విశాఖ పోర్టు ట్రస్టులో కొండవలస ఉద్యోగిగా పనిచేశారు. ఆగస్టు 10, 1946వ సంవత్సరంలో శ్రీకాకుళం జిల్లా, కొండవలస గ్రామంలో లక్ష్మణరావు జన్మించారు. కొండవలస లక్ష్మణరావు కూతురు అమెరికా నుంచి రావలిసి ఉంది. ఆమె వచ్చిన తరువాత కొండవలస అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, ఆయన భౌతికకాయాన్ని నిమ్స్ మార్చురీలో భద్రపరిచారు. కొండవలస నటించిన చిత్రాలు... ⇒ కబడ్డీ, కబడ్డీ ⇒ ఎవడి గోల వాడిదే ⇒ రాధాగోపాలం ⇒ కాంచనమాల కేబుల్ టీవీ ⇒ రాఖీ ⇒ అందాల రాముడు ⇒ శ్రీరామచంద్రులు -
హాస్యనటుడు కొండవలస కన్నుమూత