breaking news
coin box
-
అమ్మానాన్న బాగున్నారా?
న్యూశాయంపేట : పేద విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించేందుకు రాష్ట్రప్రభుత్వం గురుకులాలు ఏర్పాటుచేస్తోంది. చదువుకునే సమయంలో రోజుల తరబడి తల్లిదండ్రులకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. అయితే, తమ తల్లిదండ్రులతో మాట్లాడాలన్నా, వారి క్షేమ సమాచారాలు తెలుసుకోవాలన్నా ఫోన్ల వాడకాన్ని భద్రతా చర్యల కారణంగా ప్రిన్సిపాళ్లు అనుమతించడం లేదు. తద్వారా ఎపుడో వారం, పదిహేను రోజులకోసారి తల్లిదండ్రులు వస్తే తప్ప మాట్లాడే వెసలుబాటు కలగడం లేదు. దీనికి పరిష్కారం ఓ మార్గం అందుబాటులోకి వచ్చింది. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో... విద్యార్థులు తమ తల్లిదండ్రులతో అప్పుడప్పుడు మాట్లాడుకోవడానికి, వారియోగ క్షేమాలు తెలుసుకోవడానికి ఇటీవల అలైన్ గ్రూప్ ఓ నూతన టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. ప్రిన్సిపాళ్లు తమ క్యాంపస్ ఆవరణలో ఉండే విద్యార్థుల సంఖ్యకు తగిన సామర్థ్యంలో ఫోన్ అమరుస్తారు. ఏ విద్యార్థి అయితే తగిన రుసుము చెల్లించి స్మార్ట్ కార్డ్ తీసుకుంటారో వారి తల్లిదండ్రుల ఫోన్ నంబర్లను మాత్రమే ఆ ఫోన్లో నిక్షిప్తం చేస్తారు. తద్వారా ముందస్తు నమోదు చేసి నంబర్కు మాత్రం ఫోన్ చేసుకునే వెసలుబాటు కలుగుతుంది. దీంతో ఫోన్లు దుర్వినియోగం అవుతాయనే బాధ కూడా ఉండదు. తాజాగా ఈ ఫోన్లను వరంగల్ అర్బన్ జిల్లా హంటర్ రోడ్డులోని బాలికల మైనార్టీ గురుకులం(హన్మకొండ) పాఠశాలలలో ఏర్పాటు చేశారు. సురక్షితం స్మార్డ్ కార్డ్ ఫోన్తో విద్యార్థులు తమ తల్లిదండ్రులకు మాత్రమే ఫోన్ చేసుకునేందుకు వీలుంటుంది. ఈ ఫోన్లో ఔట్గోయింగ్ కాల్స్ మాత్రమే చేసుకోవచ్చు. తగిన రుసుము చెల్లించి కార్డు కొనుగోలు చేసిన విద్యార్థి పేరెంట్స్ అందించిన మూడు ఫోన్ నంబర్లు నిక్షిప్తం చేస్తారు. బిగించిన ఫోన్లో మూడు బటన్లు ఉంటాయి. ఓ విద్యార్థి తన కార్డును స్వైప్ చేశాక ఏదో ఒక నంబర్ నొక్కితే అందులో ముందే ఫీడ్ చేసిన సెల్ఫోన్ నంబర్కు కాల్ వెళ్తుంది. ప్రిన్సిపాళ్లు నిర్ణయించిన సమయంలో ఫోన్ చేసేలా నిబంధన విధించారు. హాస్టళ్లలో ఉచితంగా బిగింపు హాస్టళ్లలో ఈ ఫోన్లను ఎలాంటి రుసుము తీసుకోకుండానే ‘అలైన్’ సంస్థ బాధ్యులు ఏర్పాటు చేస్తారు. ప్రతినెల ప్రతినిధి వచ్చి ఫోన్ బాగోగులు చూసి వెళ్తాడు. లోకల్ అండ్ ఎస్టీడీ కాల్స్ ప్రతీ నిమిషానికి 60 పైసలు కట్ అవుతాయి. స్మార్ట్ కార్డ్ కొనుగోలు చేసినప్పుడు రూ.200 చెల్లించాలి. అందులో రూ.వంద టాక్టైమ్ వస్తుంది. టాక్టైమ్స్ అయిపోయాక తిరిగి తగిన రుసుము చెల్లించి రీచార్జ్ చేసుకోవచ్చు. విద్యార్థులకు ఎంతో ఉపయోగం ఈ ఫోన్తో విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంది. గతంలో స్కూల్ ఫోన్ ఒకటే ఉండటంతో విద్యార్థులను వారి తల్లిదండ్రులతో మాట్లాడించాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేవి. ఇప్పుడు కొత్త ఫోన్తో వారికి కేటాయించిన సమయాల్లో ఫోన్ చేసుకొని సంతోషంగా ఉంటున్నారు.– వాసవి, పిన్సిపాల్, బాలికల మైనార్టీ గురుకులం -
కాయిన్బాక్స్లో తాచుపాము!
-
ఆత్మీయ స్పర్శ... కష్టాల్లో భరోసా
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘హలో.. హరీషా!.. నేను బిడ్డా.. నాసర్పుర మల్లవ్వను మాట్లాడుతన్నా.. మూడు దినాల సంది సుక్క నీళ్లు రావట్లేదు.. సారోళ్లకు జరజెప్పు కొడుకా’. ‘ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావమ్మా.. ’అనుమాండ్ల గుడి ముందర నిలబడి మాట్లాడుతున్న బిడ్డా.. ‘సరే అక్కడే ఉండమ్మా...’ 10 నిమిషాల్లో ఎవరో ఒక వ్యక్తి రెండు క్యాన్లతో నీళ్లు పట్టుకొచ్చి మల్లవ్వ చేతిలో పెట్టారు. ఇంకో మూడు నిమిషాల తరువాత మల్లవ్వ చేసిన కాయిన్ బాక్స్ రింగ్ అయ్యింది. రిసీవర్ చెవి దగ్గర పెట్టుకుంటే ‘నేను మున్సిపాల్టీ ఇంజనీర్ను మాట్లాడుతున్నా.. పైపు లైన్ పగిలిపోయింది. బాగు చేశాం.. ఇంకో గంటలో మీకు నీళ్లు వదులుతామమ్మా’ అంటూ సమాధానం. ఒక్క మల్లవ్వే కాదు సిద్దిపేటలో ప్రతి అవ్వకు ఆయన కొడుకే. కష్టమొచ్చినా.. కన్నీళ్లొచ్చినా సిద్దిపేట ప్రజలకు టక్కున గుర్తుకొచ్చేది ఆయన ఫోన్ నంబర్. రూపాయి ఖర్చు చేస్తే చాలు వాళ్ల కష్టాలు గట్టున పడ్డట్టే. ప్రతి వ్యక్తి మనన్నలు పొందిన హరీష్ రావు రాజకీయ లైఫ్ స్టైల్లోకి తొంగి చూస్తే.. ప్రతి గ్రామంలో కనీసం 20 మందినైనా పేర్లు పెట్టి మరీ పిలుస్తారు. స్థాయి, భేదం మరిచిపోయి పల్లె జనంతో కలిసిపోతారు. వాళ్లతో మాట కలుపుతాడు.. ‘ఏం జరుగుతుందే..! వెంకటాపూర్ల బట్టోళ్ల బాల్రాజన్న నీళ్ల కోసం 10 బోర్లు ఏసిండట గదనే.. గన్ని బోర్లు ఎసుకుంటారే... ఎంత అప్పయితదే..!’ ఈ మాటతో రైతులు, కూలీలు, సాధారణ జనం గుండె లోతుల్లోంచి మాట్లాడుతారు. వాళ్ల కడుపులో దాచుకున్న కష్టాలను, కన్నీళ్లను విడమరిచి చెప్తారు. కష్టాల్లో ఉన్న రైతాంగానికి మానసిక ధైర్యం ఇవ్వడంతో హరీష్ సిద్ధంగా ఉంటారు. ఆయన నియోజకవర్గం ప్రజలు ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా కచ్చితంగా ఫోన్ లిఫ్టు చేస్తారు. అందులో జిల్లాలో రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగినా... సిద్దిపేట నియోజకవర్గంలో ఆత్మహత్యలు స్వల్పంగా నమోదయ్యాయి. జనం చెప్పిన సమస్యలనే అసెంబ్లీలో లేవనెత్తుతారు. ఉదాహరణలు చెప్తూ అధికార పక్షానికి ముచ్చెమటలు పట్టిస్తారు. అధికారులను పరుగులు పెట్టిస్తారు. ఇదీ హరీష్రావు స్టైల్. పచ్చడి మెతుకులు తింటూ... నియోజకవర్గంలో హరీష్రావుకు కార్యకర్తల మధ్య మధ్యవర్తులు ఉండరు. ప్రతి కార్యకర్తను ఆయన నేరుగా కలుస్తారు. ప్రధాన అనుచరులు నియోజకవర్గంలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు హరీష్రావుకు చేరవేస్తారు. ప్రతి విషయాన్ని ఆయన ఆసక్తితో తెలుసుకుంటారు. ఇక పార్టీ కార్యకర్తలు అలిగితే ఆ ట్రీట్మెంటు వేరే ఉంటుంది. ఎవరు ఎందుకు అలిగారు? అనే విషయాన్ని కూలంకషంగా తెలుసుకుని మనుసులో పెట్టుకుంటారు. ఆయా కార్యకర్తల గ్రామానికి వెళ్లినప్పుడు, గ్రామంలో సమస్యలు వింటారు.. సరిగ్గా భోజన సమయానికి అలిగిన కార్యకర్త ఇంటికి పోయి మంచం వేసుకుని కూర్చుంటారు. ‘అన్నా... ఆకలైతందే, ఇంట్లో ఏముందే ’అని ఆప్యాయంగా, ఆర్థ్రతతో అడుగుతారు. ఇంట్లో ఏమున్నా తింటారు... ఏమి లేకుంటే పచ్చడి మెతుకుల్లో పచ్చి నూనె పోసుకొనైనా తింటారు. కార్యకర్తతో మాట కలిపి భోజనం ముగించేలోపు కార్యకర్త కడుపులో బాధను పోగొడతారు. ఆయనకు భరోసా ఇవ్వడమే కాదు, ఇచ్చిన హామీ నెరవేరిందా? లేదా? అని ఆయన నేరుగా సదరు వ్యక్తికే ఫోన్ చేసి తెలుసుకుంటారు. కాయిన్ బాక్స్ మంత్రి.. కార్యకర్తలకు అందుబాటులో లేని సందర్భంలో వారు ఫోన్ చేయగానే విషయం విని సంబంధిత అధికారులకు వారి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించడం ద్వారా అతన్ని కాయిన్ బాక్స్ ఎమ్మెల్యే అని పిలిచేవాళ్లు... ఇప్పుడు కాయిన్ బాక్స్ మంత్రి అయ్యారు. పేద కార్యకర్తలు పెళ్లి కార్డు ఇస్తే భోజనం కోసం బియ్యం పంపడం అతని సంప్రదాయం. సభలు జరిగినప్పుడు కార్యకర్తల మధ్య కూర్చోవడం ద్వారా వారికి క్రమశిక్షణ పాఠాలను పరోక్షంగా చెప్పేస్తారు. ఎవరు శుభకార్యానికి పిలిచినా వెళతారు.