breaking news
chili sauce
-
జస్ట్ చిల్లీసాస్తో రూ. 8 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం..!
వంటగదిలో ఉండే ఎరుపు మిరపకాయలతో వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించాడు. అదికూడా ఓ శరణార్థిగా వేరొక దేశంలోకి వచ్చి అక్కడే కోట్లకు పడగలెత్తాడు. ఎవ్వరూ ఊహించని రీతిలో వంటల్లో ఘాటు కోసం ఉపయోగించే మిరపకాయలతో అద్భుతమైన సాస్ తయారు చేశాడు. చూస్తుండగానే అతితక్కువ కాలంలోనే వ్యాపారం విస్తరించి లాభాల బాటపట్టింది. ఎలాంటి ప్రకటన, ప్రముఖుల అడ్వర్టైస్మెంట్లు లేకుండా కేవలం నోటిమాటతో వ్యాపారం ఊపందుకునేలా చేశాడు. విచిత్రమైన లోగోతోనే ఆ ప్రొడక్ట్ నాణ్యత ఏంటో అర్థమయ్యేలా చేశాడు. అలా ఆ ప్రొడక్ట్ పేరే బ్రాండ్ నేమ్గా స్థిరపడిపోయేలా ప్రజాదరణ పొందింది. ఇంతకీ ఆ వ్యాపార సామ్రాజ్యం సృష్టికర్త ఎవరు..? ఎలా ఈ సాస్ని రూపొందించాడంటే..పాశ్చాత్య దేశాల్లో ఏ నాన్వెజ్ తినాలన్నా ఈ చిల్లీసాస్ జోడించి ఆస్వాదిస్తారు. అక్కడ ప్రజలకు ఇది లేనిదే వంట పూర్తికాదు అన్నంతగా దీనిపై ఆధారపడిపోయారు. అది కూడా పచ్చగా ఉండే పచ్చిమర్చిని కాదని పండు ఎరుపు మిర్చిలనే ఎంచుకోవడానికి ప్రధాన కారణం దాని స్పైసీనెస్ అని చెప్పొచ్చు. పచ్చిమిర్చిలోని ఘాటుకంటే పండిని పచ్చిమిర్చిలో కారం ఎక్కువ. శ్రీరాచా చిల్లీసాస్ పేరుతో డేవిడ్ ట్రాన్ అనే వియత్నాం శరణార్థి దీన్ని మార్కెట్లోకి తీసుకొచ్చాడు. అతడి ప్రస్థానం మొదలైందిలా..1945లో దక్షిణ వియత్నాంలో జన్మించిన డేవిడ్ ట్రాన్ సైగాన్కు వెళ్లాడు. అక్కడ అతను దక్షిణ వియత్నామీస్ సైన్యంలో చేరడానికి ముందు రసాయనాల వ్యాపారంలో మెళుకువలు నేర్చుకున్నాడు. అక్కడే అతను చెఫ్గా కూడా పనిచేసేవాడు. ఆ టైంలోనే ట్రాన్ మిరపకాయలతో సాస్ తయారీ ప్రయోగాలు చేస్తుండేవాడు. వాటిని రీసైకిల్ చేసిన గెర్బర్ బేబీ ఫుడ్ జాడిలలో నిల్వ చేసేవాడు. అయితే ఇంతలో సైగాన్లో పరిస్థితి ఉద్రీక్తంగా మారిపోయింది. డిసెంబర్ 1978లో, కమ్యూనిస్ట్ వియత్నాం, చైనా మధ్య ఏర్పడిన శతృత్వం రీత్యా అక్కడ పరిస్థితి అధ్వాన్నంగా మారిపోయింది. దీంతో ట్రాన్కి మాతృభూమిని వీడక తప్పలేదు. అయితే అతడు అద్భుతమైన దూరదృష్టితో తన ఆస్తులను ఆ కాలంలోనే దాదాపు రూ. 85 లక్షల రూపాయలకుపైనే విక్రయించి, ఆ డబ్బుతో హుయ్ ఫాంగ్" అనే తైవానీస్ సరుకు రవాణా నౌకలో అమెరికాకు వలస వచ్చాడు. సాస్ వ్యాపారం ఆవిర్భావం..బోస్టన్లో కొంతకాలం పనిచేసిన తర్వాత, ట్రాన్ 1980లో లాస్ ఏంజిల్స్కు మకాం మార్చాడు. అక్కడే తన హాట్సాస్ తయారీ ప్రారంభించాడు. సాంప్రదాయ వియత్నాం మిరపకాయలకు బదులుగా స్థానికంగా లభించే జలపెనోల మిరపకాయలను ఉపయోగించి తయారు చేశాడు. వాటిని రీసైకిల్ చేసిన బేబీ ఫుడ్ జాడిలలో నింపి నీలిరండు వ్యాన్లో దక్షిణ కాలిఫోర్నియా అంతటా ఉన్న ఆసియా రెస్టారెంట్లకు ట్రాన్ స్వయంగా డెలివరీ చేవాడు. అలా మొదటి నెల రూ. 2 లక్షల లాభాన్ని ఆర్జించాడు దీనికి వెంచర్ క్యాపిటల నిధులు లేవు, మార్కెటింగ్ బృందం లేదు, ప్రకటను ప్రచారాలు కూడా లేవు. తన ప్రొడక్ట్కి ఉన్న శ్రీరాచా అనే పేరు, దాని లోగో..విలక్షణమైన గ్రీన్క్యాప్ అమ్మకాలను ఆకర్షించే ట్రేడ్మార్క్గా క్రియేట్ చేశాడు. ఎవ్వరైనా తన ప్రొడక్ట్ పేరుని వాడుకునే యత్నం చేస్తే..వారిని తన వ్యాపారానికి ఉచితంగా అడ్వర్టైస్మెంట్ చేసేవాళ్లుగా అభివర్ణించేవాడు. అంతేగాదు మా ప్రొడక్ట్ అత్యంత హాట్గా ఉంటుంది. ఒకవేళ వేడిచేస్తే తక్కువగా వినియోగించండి అని స్వయంగా చెప్పేవాడు. అలా అనాతికాలంలోనే లాస్ ఏంజిల్స్లోని చైనాటౌన్, రోజ్మీడ్, కాలిఫోర్నియా అంతటా వ్యాపారం జోరుగా ఊపందుకుంది. ఇక తన ప్రొడక్ట్కి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో కాలిఫోర్నియాలో 650,000 చదరపు అడుగుల ఫ్యాక్టరీ పెట్టే స్థాయికి చేరుకున్నాడు. దానికి తాను అమెరికాకు వలస వచ్చిన నౌక పేరు మీదుగా హుయ్ ఫాంగ్ ఫుడ్స్ అని పేరు పెట్టాడు.అలా 2019 నాటికి, వార్షిక అమ్మకాలు రూ. 16 వందల కోట్లకు చేరుకుంది. అంతేగాదు అమెరికన్ హాట్ సాస్ మార్కెట్లో దాదాపు 10% వాటాని సొంతం చేసుకుంది. అంతేగాదు ఈ రెడ్చిల్లీ బాటిల్పై లేబుల్ వియత్నామీస్, ఇంగ్లీష్, చైనీస్, ఫ్రెంచ్ స్పానిష్ వంటి భాషలలో టెక్స్ట్ను కలిగి ఉండటం విశేషం. తన ప్రొడక్ట్ ఇలా లాభాలతో దూసుకుపోవడానికి కారణం కేవలం "పేదవాడి ధరకు ధనవంతుడి సరిపోయే నాణ్యతలో సాస్ తయారు చేయడం" అని అంటారు ట్రాన్. ఈ ఏడాదితో ఈ వ్యాపారం 80 ఏళ్లకు చేరుకుంటోంది. పరిశ్రమ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. అతడి వ్యాపార సామ్రాజ్యం రూ. 11 వేల కోట్లు టర్నోవర్ ఉంటుదని అంచనా. నాణ్యతలో రాజీ పడకుండా, ఎలాంటి లాభదాయకమైన కొనుగోళ్లకు కక్కుర్తిపడకుండా ప్రజల నమ్మకాన్ని చూరగొంటే ఏ వ్యాపారమైన విజయపథంలో దూసుకుపోతుందంటారు డేవిడ్ ట్రాన్. కేవలం పట్టుదల, కష్టపడేతత్వం తదితరాలే వ్యాపారానికి అసలైన పెట్టుబడులని నొక్కి చెబుతున్నాడు.(చదవండి: కష్టాలు మనిషిని కనివినీ ఎరుగని రేంజ్కి చేరుస్తాయంటే ఇదే..!) -
కొరకరాని కాయ
మిర్చి బేసన్ కర్రీ కావలసినవి: పచ్చిమిర్చి - 100 గ్రా., సెనగ పిండి - టేబుల్ స్పూను, వాము - అర టీ స్పూను, కారం - అర టీ స్పూను, ఉప్పు - తగినంత, నూనె - 2 టేబుల్ స్పూన్లు. తయారీ: ముందుగా పచ్చి మిర్చిని శుభ్రంగా కడిగి తడిపోయే వరకు ఆరబెట్టాలి నిలువుగా మధ్యకు గాటు పెట్టాలి బాణలిలో నూనె కాగాక పచ్చి మిర్చి వేసి దోరగా వేయించాలి సెనగ పిండి, వాము, కారం, ఉప్పు వేసి బాగా కలిపి, సుమారు ఐదు నిమిషాలు మూత పెట్టి ఉంచాలి మూత తీసి మరోమారు బాగా కలిపి, రెండు నిమిషాలయ్యాక దింపేయాలి. మిర్చి కా సాలన్ కావలసినవి: పచ్చి మిర్చి - 100 గ్రా. (ఎక్కువ కారం ఉండకూడదు), చింతపండు గుజ్జు - టేబుల్ స్పూను (చిక్కగా ఉండాలి), నీళ్లు - 3 కప్పులు, ఆవాలు - అర టీ స్పూను, జీలకర్ర - అర టీ స్పూను, కరివేపాకు - ఏడెనిమిది రెమ్మలు, నూనె - 4 టేబుల్ స్పూన్లు, ఉప్పు - తగినంత, మసాలా పేస్ట్ కోసం, పచ్చి కొబ్బరి తురుము - పావుకప్పు, వేయించిన పల్లీలు - పావు కప్పు, వేయించిన నువ్వులు - రెండు టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ - 1 (చక్రాలుగా తరగాలి), వెల్లుల్లి రేకలు - 3, అల్లం తురుము - అర టీ స్పూను, కారం - అర టీ స్పూను, పసుపు - పావు టీ స్పూను, గరం మసాలా - అర టీ స్పూను, ఉప్పు - తగినంత తయారీ: బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఉల్లి చక్రాలు వేసి బంగారురంగులోకి వచ్చేవరకు వేయించాలి పచ్చి కొబ్బరి తురుము జత చేసి మరోమారు వేయించాలి పల్లీలు, నువ్వులు జత చేసి మరోమారు వేయించి దింపి, చల్లార్చాలి వెల్లుల్లి రేకలు, అల్లం తురుము, మసాలా పొడులు, ఉప్పు జత చేసి, మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి కొద్దిగా నీరు జత చేసి పేస్ట్లా చే స్తే మసాలా సిద్ధమవుతుంది. కూర తయారీ: పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి తడి పోయేవరకు నీడలో ఆరబెట్టాలి నిలువుగా మధ్యకు గాట్లు పెట్టాలి. (కాయ కాయలాగే ఉండాలి. ముక్కలు చేయకూడదు) బాణలిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేశాక, పచ్చి మిర్చి వేసి దోరగా వేయించి తీసేయాలి అదే బాణలిలో మరికాస్త నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించాలి తయారుచేసి ఉంచుకున్న మసాలా ముద్ద జత చేసి బాగా వేయించాలి చింతపండు గుజ్జు, రెండు కప్పుల నీళ్లు జత చేసి మరోమారు కలిపి ఐదు నిమిషాల తర్వాత పచ్చి మిర్చి వేసి బాగా కలిపి, కొద్దిసేపయాయక దింపేయాలి కొత్తిమీరతో అలంకరించి వేడివేడిగా అన్నంతో తింటే రుచిగా ఉంటుంది. పచ్చి మిర్చి ఊరగాయ కావలసినవి: పచ్చి మిర్చి - పావు కిలో, ఆవాలు - 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు - టేబుల్ స్పూను, జీలకర్ర - టీ స్పూను, మెంతులు - టీ స్పూను, ఇంగువ - పావు టీ స్పూను, పసుపు - టీ స్పూను, గరం మసాలా - అర టీ స్పూను, నిమ్మరసం - 2 టేబుల్ స్పూన్లు, నూనె - 2 టేబుల్ స్పూన్లు తయారీ: బాణలిలో ఆవాలు, జీలకర్ర, మెంతులు (నూనె లేకుండా) వేసి వేయించాలి ఇంగువ జత చేసి బాగా కలిపి స్టౌ ఆపేసి, చల్లార్చాలి మిక్సీలో... ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇంగువ వేసి మెత్తగా పొడి చేయాలి పసుపు, గరం మసాలా, ఉప్పు జత చేసి మరోమారు తిప్పి, ఒక పాత్రలోకి తీసి, టేబుల్ స్పూను నిమ్మరసం, నూనెలో సగభాగం వేసి కలపాలి పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి, తొడిమలు తీసి, తడి పోయేవరకు నీడలో ఆరబెట్టాలి తడి పోయాక, పచ్చి మిర్చిని ఒక వైపు కట్ చేసి, తయారుచేసి ఉంచుకున్న మిశ్రమాన్ని స్టఫ్ చేసి, ఒక ప్లేట్లో ఉంచాలి మిగిలిన నూనెను వాటి మీద వేసి ఎండబెట్టాలి. (ఎండ లేకపోతే ప్లేట్ను గదిలోనే ఉంచాలి) ప్రతిరోజూ రెండుసార్లు కలుపుతుండాలి నాలుగు రోజుల తర్వాత వాడుకోవచ్చు. కారం వాడనివాడు తెలుగువాడు కాడు. కూరగాయల బుట్టలో కాసిని పచ్చి మిర్చిని పడేసుకోని ఇల్లాలు తెలుగు ఇల్లాలు కాదు. చప్పిడి తిండి తింటే తెలుగు పౌరుషం ఏం కావాలి చెప్పండి. ఒకేలాంటి తిండి తినీ తినీ విసుగెత్తి పోయారా?ఇవిగో ఈ పదార్థాలతో కాసింత కారం తగిలించండి. కళ్లల్లో నోటిలో నీరు కారనీయండి. ఫ్రెష్ అయిపోతారు. మిర్చి - కొరికితే కారమే. కోసి వండి నలుగురికీ పెడితే మమకారమే. పచ్చి మిర్చి పచ్చడి కావలసినవి: పచ్చి మిర్చి - 50 గ్రా., మినప్పప్పు - టేబుల్ స్పూను, సెనగ పప్పు - టేబుల్ స్పూను, ఆవాలు - టీ స్పూను, జీలకర్ర - టీ స్పూను, మెంతులు - అర టీ స్పూను, పల్లీలు - టేబుల్ స్పూను, ఇంగువ - పావు టీ స్పూను, పసుపు - పావు టీ స్పూను, చింతపండు - నిమ్మకాయంత, ఉప్పు - తగినంత, నూనె - టేబుల్ స్పూను, కొత్తిమీర - కొద్దిగా. తయారీ: పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి తొడిమలు తీసేయాలి బాణలిలో నూనె కాగాక పచ్చి మిర్చి వేసి వేయించి తీసేయాలి అదే బాణలిలో మరి కాస్త నూనె వేసి కాగాక మినప్పప్పు, సెనగ పప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, వేసి వేయించి, చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా అయ్యేలా తిప్పాలి వేయించిన పచ్చి మిర్చి, చింతపండు, ఉప్పు వేసి మరోమారు మెత్తగా అయ్యేలా తిప్పి, చిన్న గిన్నెలోకి తీసుకోవాలి కొత్తిమీరతో అలంకరించి, వేడి వేడి అన్నంలో కమ్మటి నేతితో తింటే రుచిగా ఉంటుంది. పనీర్ చిల్లీ పకోడా కావలసినవి: పచ్చిమిర్చి - 100 గ్రా., పనీర్ తురుము - అర కప్పు, సెనగ పిండి - 100 గ్రా., బియ్యప్పిండి - టేబుల్ స్పూను, కారం - టీ స్పూను, ఉప్పు - తగినంత, నూనె - డీప్ ఫ్రైకి సరిపడా, ధనియాల పొడి - అర టీ స్పూను, బేకింగ్ సోడా - చిటికెడు. తయారీ: పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి తొడి మలు తీసేయాలి మిక్సీలో పచ్చి మిర్చి వేసి మెత్తగా ముద్ద చేయాలి ఒక పాత్రలో పచ్చి మిర్చి ముద్ద, పనీర్ తురుము వేసి బాగా కలపాలి సెనగ పిండి, బియ్యప్పిండి, ఉప్పు, కారం, ధనియాల పొడి, బేకింగ్ పౌడర్ జత చేసి మరోమారు కలపాలి. (అవసరమనుకుంటేనే నీరు జతచేయాలి) బాణలిలో నూనె కాగాక, ఈ మిశ్రమాన్ని పకోడీలుగా వేయించాలి బంగారు వ ర్ణంలోకి వచ్చాక కిచెన్ టవల్ మీదకు తీసుకోవాలి చిల్లీ సాస్తో వేడివేడి పకోడీలను అందిస్తే రుచిగా ఉంటాయి. చిల్లీ సాస్ కావలసినవి: పచ్చి మిర్చి - 100 గ్రా. (పెద్దవి), పచ్చి మిర్చి - 100 గ్రా. (చిన్నవి), వెనిగర్ - ముప్పావు కప్పు, జీలకర్ర - 2 టీ స్పూన్లు, అల్లం - చిన్న ముక్క, ఉప్పు - తగినంత, ఇంగువ - పావు టీ స్పూను, నూనె - 3 టేబుల్ స్పూన్లు తయారీ: పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి తడిపోయేవరకు ఆరబెట్టాలి తొడిమలు తీసి, పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేయాలి అల్లం ముక్కలుగా తరగాలి బాణలిలో నూనె కాగాక జీలకర్ర వేసి వేయించాలి ఇంగువ జత చేయాలి పచ్చి మిర్చి, అల్లం ముక్కలు వేసి వేయించాలి ఉప్పు జత చేసి, రెండు నిమిషాల పాటు వేయించాలి అర కప్పు నీళ్లు జత చేసి బాగా కలిపి మూత పెట్టి సుమారు ఐదు నిమిషాలు ఉంచాలి ఒకసారి కలిపి మళ్లీ మూత ఉంచి తడి పోయేవరకు ఉంచి, దింపేయాలి చల్లారాక మిక్సీలో వేసి, కొద్దిగా వెనిగర్ జత చేసి మిక్సీ తిప్పాలి ఒకపాత్రలోకి తీసుకోవాలి మిగిలిన వెనిగర్ జత చేసి బాగా కలిపితే చిల్లీ సాస్ సిద్ధమైనట్లే ఎక్కువ రోజులు నిలవ ఉండాలనుకుంటే కొద్దిగా సిట్రిక్ ఆసిడ్ జత చేయాలి. సేకరణ: డా. పురాణపండ వైజయంతి ‘సాక్షి’ ఫీచర్స్ ప్రతినిధి, విజయవాడ -
సాస్ ఇక సీసాకు అంటుకోదు...
టొమాటో సాస్, చిల్లీ సాస్ వంటివి సీసాల్లో దొరుకుతుంటాయి. పూర్తిగా వాడేసిన తర్వాత కూడా ఇవి ఎంతో కొంత మేరకు సీసా లోపలి గోడలకు అంటుకునే ఉంటాయి. వాటిని బయటకు తీయలేక ఆ సీసాలను అలాగే పారేస్తాం. చివరి చుక్క వరకు కెచప్, సాస్ సీసాలను ఖాళీ చేద్దామనుకుంటే మనకు సాధ్యం కాదు. అయితే, ఈ సమస్యకు మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) విద్యార్థులు విరుగుడు కనిపెట్టారు. సాస్, కెచప్ వంటి చిక్కని ద్రావకాలను భద్రపరచే సీసాలకు లోపలిపూతగా ఉపయోగించేందుకు వీరు ‘లిక్విగ్లైడ్’ అనే పదార్థాన్ని రూపొందించారు. ఈ పూత పూసిన సీసాలలో భద్రపరచిన సాస్, కెచప్ వంటి చిక్కని ద్రవాలు చివరి చుక్క వరకు తేలికగా జారిపోయి బయటకు వచ్చేస్తాయి. సీసా ఖాళీ అయిన తర్వాత అందులో ఎలాంటి మరకలూ కనిపించవు. అయితే, ఈ ‘లిక్విగ్లైడ్’ ఒక్కో రకమైన పదార్థానికి ఒక్కో రకంగా తయారు చేయాల్సి ఉంటుందని, సాస్, కెచప్ వంటి ఆహార పదార్థాలు భద్రపరచే సీసాల కోసం ఒకరకంగా, హెయిర్ క్రీములు వంటివి భద్రపరచే ట్యూబులు, సీసాల కోసం మరో రకంగా తయారు చేయాల్సి ఉంటుందని ఎంఐటీ విద్యార్థులు చెబుతున్నారు.