breaking news
Chicken Guinea
-
చికున్ గున్యాతో బాధపడుతున్న చిరంజీవి
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చికున్ గున్యాతో ఆయన ఇబ్బంది పడుతున్నారు. సుమారు 25రోజులుగా ఈమేరకు చిరు చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఇప్పుడిప్పుడే చికున్ గున్యా నుంచి ఆయన ఉపశమనం పొందుతున్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో మెగాస్టార్ చిరంజీవికి చోటుగిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చిరంజీవికి చోటు దక్కడంతో తాజాగా హైదరాబాద్లో ఒక ఈవెంట్ జరిగింది. ఈ మేరకు గిన్నిస్ బుక్ ప్రతినిధులతో పాటు బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ సంయుక్తంగా మెగాస్టార్కు అవార్డ్ అందించారు. కొద్దిరోజులుగా చికున్ గున్యాతో చిరంజీవి బాధపడుతున్నప్పటికీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారి పిలుపు మేరకు హాజరయ్యారు. స్టేజ్ మీదకు వెళ్తున్న సమయంలో కూడా హీరో సాయి ధరమ్తేజ్ చిరుకు సాయంగా వెళ్లాడు. చికున్ గున్యా వల్ల వచ్చిన నొప్పులతోనే ఈ ప్రోగ్రామ్లో చిరంజీవి పాల్గొన్నారు. -
విజృంభిస్తున్న చికున్ గున్యా
తాడ్వాయి, న్యూస్లైన్: మండలంలోని బ్రహ్మాజీవాడి గ్రామంలో 20 మందికిపైగా చికున్ గున్యా సోకడంతో బాధితులు మం చం పట్టారు. వైద్యసిబ్బంది మాత్రం ఆ గ్రామంలోకి వెళ్లి రోగులను చూడకపోవడంతో బాధితులు తీవ్ర అవస్థ ప డుతున్నారు. 20 రోజుల క్రితం గ్రామానికి చెందిన కొం తమందికి చికున్ గున్యా సోకడంతో మోకాళ్లలో నొప్పు లు ప్రారంభమై నడవలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో బాధితులు చికిత్స నిమిత్తం కామారెడ్డిలోని పలు ప్రైవే టు ఆస్పత్రులకు వెళ్లారు. అక్కడి వైద్యులు మందులను, ఇంజక్షన్లను ఇచ్చి పంపించారు. వైద్యులు మందులు ఇ చ్చినా ఫలితంలేదని, చికున్ గున్యాతో తీవ్ర ఇబ్బంది ప డుతున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. గతంలో కొందరికి చికున్ గున్యా వచ్చిందని, వారికి నయం కాకపోగా మరో 20 మందికి చికున్ గున్యా బారిన పడ్డారని పేర్కొన్నారు. బాధితుల్లో గ్రామానికి చెందిన గాజె న ర్సింలు, గాజె మమత, నగేష్, కుర్రాల రాజవ్వ, కన్క వ్వ, కళావతి, బాల్లక్ష్మితోపాటు మరికొందరు ఉన్నా రు. గ్రామంలో రక్షిత మంచినీటి ట్యాంకుల వద్ద, డ్రైనేజీ ల వద్ద, మురుగు, చెత్త చెదారం చేరడంతోనే వ్యాధి సో కిందని గ్రామస్తులు తెలిపారు. గ్రామ పంచాయతీ సి బ్బంది, పాలకవర్గం నిర్లక్ష్యంతోనే పారిశుధ్యం లోపించి వ్యాధులు ప్రబులుతున్నాయని వివరించారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు చొరవ చూపి బ్రహ్మాజీవాడి లో వైద్యశిబిరం ఏర్పాటు చేసి వైద్య చికిత్సలు అందజేయాలని బాధితులు కోరుతున్నారు.