-
నటుడు దామరాజు కన్నుమూత
సాక్షి, ముషీరాబాద్ : సినీ, నాటక రంగాలతో పాటు బుల్లితెరపై కూడా తనదైన ముద్రవేసి ప్రేక్షకుల మన్ననలు అందుకున్న నటుడు దామరాజు వెంకటలక్ష్మీ నర్సింహారావు (79) బుధవారం రాత్రి హైదరాబాద్లో కన్నుమూశారు. ప్రముఖ సినీ దర్శకుడు, నాటకరంగ పితామహుడు చాట్ల శ్రీరాములు శిష్యరికంలో ఎదిగిన నర్సింహారావును దర్శక నిర్మాత దాసరి నారాయణరావు కూడా ప్రోత్సాహించారు. ఈ క్రమంలో దాసరి దర్శకత్వం వహించిన తొలి చిత్రం తాతా – మనవడు ద్వారా నర్సింహారావు వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత వారసురాలు, కలవారి కుటుంబం, మేనకోడలు, పోస్టుమేన్, కోరుకున్న ప్రియుడు, రాజా,అతడు (పాత చిత్రం)లో నటించారు. అనంతరం రుతురాగాలు, ఆనందధార, చదరంగం, అన్వేషిత, సంఘర్షణ తదితర సీరియల్లలో నటించి బుల్లితెరపై ఖ్యాతిగాంచారు. రచయితగా స్త్రీ రూపం, గాంధీ మళ్లీ పుడితే, స్వామియే శరణం, బసమ్మ కథ, ఇంకా రగులుతున్న రావణకాష్టం వంటి నాటకాలను అందించి, దర్శకత్వం కూడా వహించి రాణించారు. ప్రముఖ సినీ హీరో శివాజీ గణేశణ్ చేతుల మీదుగా నాటకరంగంలో ఉత్తమ కథనాయకుడిగా అవార్డులను అందుకున్నారు.ఉత్తమ నాటక రచయిత, ఉత్తమ హాస్యనటుడు అవార్డును 2007లో అందుకున్నారు. గాంధీ మళ్లీ పుడితే నాటకానికి ఉత్తమ దర్శకుడు అవార్డు పొందారు. ఒకవైపు ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీసీ కంటోన్మెంట్ డిపోలో అక్కౌంటెంట్గా ఉద్యోగం చేస్తూనే ఇటు నటనలో కూడా తనదైన ముద్రవేశారు. పదవీ విరమణ తర్వాత వ్యవసాయ రంగంలోకి దిగి, పూర్తిగా సేంద్రియ ఎరువుల ద్వారా పంటలను పండించారు.ఇందుకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా 2018లో ఉత్తమ రైతు అవార్డు అందుకున్నారు.నర్సింహారావుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
చాట్ల శ్రీరాములు ఇకలేరు
♦ హైదరాబాద్లోని మెట్టుగూడ రైల్వే ఆస్పత్రిలో కన్నుమూత ♦ నేడు ఉదయం హైదరాబాద్లో అంత్యక్రియలు సాక్షి, హైదరాబాద్: ప్రముఖ రంగస్థల నటుడు, రచయిత చాట్ల శ్రీరాములు ఇకలేరు. కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్లోని మెట్టుగూడ రైల్వే ఆస్పత్రిలో శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఆయనకు భార్య ఆదిలక్ష్మి, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన భౌతిక కాయాన్ని హైదరాబాద్లోని మోతీనగర్లో ఉన్న స్వగృహానికి తరలించారు. శనివారం ఉదయం ఈఎస్ఐ ఆస్పత్రి పక్కన ఉన్న హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చాట్ల శ్రీరాములు మరణవార్త విని పెద్ద సంఖ్యలో కళాకారులు, అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆయన నివాసానికి చేరుకుని, భౌతికకాయం వద్ద నివాళులు అర్పించారు. నటుడు దుగ్గిరాల సోమేశ్వరరావు, దీక్షిత్, ఆచార్య మొదలి నాగభూషణశర్మ, రచయిత రావి కొండలరావు, ఆకెళ్ల, నారాయణ బాబు, నటీమణులు శివపార్వతి, హైమ, రసరంజని నాటక సంస్థ సభ్యులు నివాళులు అర్పించినవారిలో ఉన్నారు. నాటక రంగంలో తనదైన ముద్ర ఆరున్నర దశాబ్దాలుగా తెలుగు నటనా రంగానికి సేవలు అందించిన చాట్ల శ్రీరాములు.. విజయవాడలో 1931 డిసెంబర్ 15న గడ్డి అచ్చయ్య-అచ్చమ్మ దంపతులకు జన్మించారు. ఆయన 13 ఏళ్ల వయసులోనే 1944 ఏప్రిల్ 16న మేనత్త కుమార్తె ఆదిలక్ష్మితో వివాహం జరిగింది. ఆ రోజుల్లోనే ఇంటర్ వరకు చదివారు. హిందీ భాషా పరీక్షల్లోనూ ఉత్తీర్ణులయ్యారు. అనంతరం ఓ కంపెనీలో టైపిస్ట్గా, మెడికల్ రిప్రజెంటివ్గా పనిచేస్తూ.. డిగ్రీ పూర్తిచేశారు. ఆ సమయంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంటర్ కాలేజీ నాటక పోటీల్లో ఉత్తమ నటుడిగా బంగారు పతకం సాధించారు. అటు తర్వాత నాటకాలు, నటనా రంగంలో తనదైన ముద్ర వేశారు. ఆధునిక తెలుగు నాటక రంగంలో నూతన ప్రక్రియలను ప్రవేశపెట్టారు. ఆయన రచించి, ప్రదర్శించిన నాటకాలు నటుడిగా, దర్శకుడిగా ఆయన గొప్పతనాన్ని చాటుతాయి. అంతేకాదు సినీ రంగంలో ఎంతో మందికి నటనలో శిక్షణ ఇచ్చారు. రంగస్థల కళాశాల శాఖలో ఆచార్యులుగా ఎంతో మందికి మెళకువలు బోధించారు. ప్రభుత్వంతో పాటు ఎన్నో సంస్థల నుంచి ఆయన గౌరవ సత్కారాలు అందుకున్నారు. ప్రముఖుల సంతాపం చాట్ల శ్రీరాములు మృతిపట్ల ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. చాట్ల మరణం తనను కలచి వేసిందని ఏపీ శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ పేర్కొన్నారు. ఆధునిక తెలుగు నాటక రంగంలో సమున్నత శిఖరంగా చాట్ల శ్రీరాములు నిలిచారని, ఆయన మరణం బాధాకరమని ప్రముఖ రచయిత సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. చాట్ల రూపొందించి, ప్రదర్శించిన అనేక నాటకాలు కళాభిమానుల ప్రశంసలు అందుకున్నాయన్నారు. ఆధ్యాత్మిక రంగంలో గురువులుంటారు కానీ నాటక రంగంలో గురువుగా ఉన్న ఏకైక వ్యక్తి చాట్ల శ్రీరాములు అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి పేర్కొన్నారు. ఆయన మరణంతో నాటక రంగం పెద్దదిక్కును కోల్పోయిందని వ్యాఖ్యానించారు. శ్రీరాములు మృతి పట్ల తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డెరైక్టర్ మామిడి హరికృష్ణ, తెలుగు విశ్వవిద్యాలయం ఇన్చార్జి వీసీ ఎల్లూరి శివారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
చాట్ల మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపం
హైదరాబాద్: నాటక రంగ ప్రముఖుడు చాట్ల శ్రీరాములు మృతిపట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు నాటక రంగానికి ఆయన ఎనలేని కృషిచేశారని కొనియాడారు. ఆయన సేవలు ఎందరికో స్ఫూర్తిదాయకం అని అన్నారు. ఆయన సేవలను తాము ఎప్పటికీ గుర్తుంచుకుంటామని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు శుక్రవారం ఒక ప్రకటనలో వైఎస్ జగన్ తెలిపారు. తీవ్ర అనారోగ్యంతో చాట్ల శ్రీరాములు శుక్రవారం మృతి చెందారు. సికింద్రాబాద్ రైల్వే ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ ఉదయం కన్నుమూశారు. ఆయన వయస్సు 85 సంవత్సరాలు. చాట్ల శ్రీరాములు రైల్వే ఉద్యోగిగా విధులు నిర్వహిస్తూ 1976లో నాటక రంగానికి అంకితమయ్యారు. ఆయన దేశవిదేశాల్లో అనేక నాటక ప్రదర్శనలు ఇచ్చారు. కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డుతోపాటు ఎన్టీఆర్ పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. శ్రీపొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్శిటీ నుంచి గౌరవ డాక్టరేట్ను చాట్ల శ్రీరాములు అందుకున్నారు. టాలీవుడ్ ప్రముఖ నటులు వెంకటేశ్, నాగార్జున, రామ్లకు చాట్ల శ్రీరాములు నటనలో శిక్షణ ఇచ్చారు. 1931లో చాట్ల శ్రీరాములు విజయవాడలో జన్మించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement