chakri dies
-
చక్రి స్టూడియోలో అగ్ని ప్రమాదం
హైదరాబాద్: దివంగత సంగీత దర్శకుడు చక్రి స్టూడియోలో సోమవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు కమలాపురి కాలనీలో ఉన్న స్టూడియోను పెట్రోలు పోసి దహనం చేయటంతో ఆస్తి నష్టం సంభవించిందని చక్రి భార్య శ్రావణి మంగళవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు.. కమలాపురి కాలనీలో చక్రి పేరుతో సీ-స్టూడియో ఉంది. కాగా, దీనికి సంబంధించిన తాళం చెవి శ్రావణి వద్దే ఉంది. సోమవారం జూబ్లీహిల్స్ పోలీసుల అనుమతితో ఈ స్టూడియోను తెరిచి కార్యకలాపాలు నిర్వహించారు. అయితే అర్ధరాత్రి 11 గంటల సమయంలో స్టూడియోలోంచి మంటలు వస్తున్నట్లు ఇంటి యజమాని రమేష్చంద్ తమకు సమాచారం అందించారని వివరించారు. అదే రాత్రి వచ్చి చూడగా స్టూడియో మొత్తం దగ్ధమై ఉందని శ్రావణి తెలిపారు. తాను స్టూడియోను నడిపించటం కొంత మందికి నచ్చడం లేదని.. దీని వెనుక తన అత్త, మరిది ప్రమేయం ఉందని ఆరోపించారు. వారి నుంచి తనకు ప్రాణహాని ఉన్న విషయం కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. స్టూడియో దహనం వెనుక కారణాలపై దర్యాప్తు చేయాలని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, గుర్తు తెలియని దుండగులు దాడి చేసినట్లు చక్రీ సోదరుడు మహిత్ నారాయణ కూడా మంగళవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గతరాత్రి చక్రి ఆఫీస్పై దాడి చేసిన దుండగులు అక్కడ ఫర్నిచర్ను దగ్ధం చేశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. -
చక్రి మృతిపై అనుమానాస్పద కేసు నమోదు
-
చక్రి మృతిపై అనుమానాస్పద కేసు నమోదు
హైదరాబాద్: ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి మరణంపై ఐపీసీ సెక్షన్ 174 కింద అనుమానాస్పద కేసుగా జూబ్లీహిల్స్ పోలీసులు నమోదు చేశారు. తన కొడుకు మరణంపై అనుమానాలున్నాయని ఆయన తల్లి విద్యావతి, సోదరుడు మహిత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. తన కోడలు శ్రావణి వల్లనే చక్రి చనిపోయాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతే కాకుండా తన కొడుకును చంపుతున్నానంటూ రెండుసార్లు తనకు ఫోన్ కూడా చేసిందని, ఆ ఫోన్ కాల్డేటాను పరిశీలిస్తే ఎన్నో వాస్తవాలు బయటకు వస్తాయంటూ ఆమె పేర్కొన్నారు. దీంతో పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కేటీఆర్ వద్దకు చక్రి పంచాయితీ..
-
కేటీఆర్ వద్దకు చక్రి పంచాయితీ..
హైదరాబాద్ : సంగీత దర్శకుడు చక్రి కుటుంబ వివాదం తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ వద్దకు చేరింది. చక్రి తల్లి విద్యావతి, సోదరుడు మహిత్ నారాయణ్ మంగళవారం ఆయన్ని కలిశారు. చక్రి కుటుంబసభ్యులు, అతని భార్య శ్రావణి పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ పోలీస్స్టేషన్ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. తన కోడలు శ్రావణి, ఆమె తల్లిదండ్రులు సురేఖ, మధుసూదన్రావు, సోదరుడు భరద్వాజ్ కలిసి విష ప్రయోగం చేసి తన కొడుకును చంపేశారని ఆరోపిస్తూ చక్రి తల్లి విద్యావతి ఆదివారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా శ్రావణి శనివారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ తన భర్త మరణం విష ప్రయోగం వల్లే జరిగిందని, అత్త విద్యావతితో పాటు ఆడపడుచులు వారి భర్తలు, మరిది మహిత్ కారకులంటూ తొమ్మిది మందిపై ఆరోపణలు చేశారు. ఈ మేరకు చక్రి కుటుంబ సభ్యులపై క్రిమినల్ కేసు నమోదైంది. ఇది జరిగి 24 గంటలు గడవకముందే చక్రి తల్లి... శ్రావణిపై ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో చక్రి తల్లి, సోదరుడు... కేటీఆర్ను కలవటం ప్రాధాన్యత సంతరించుకుంది. -
'చక్రి మరణంపై అనుమానాలున్నాయి'
-
'చక్రి మరణంపై అనుమానాలున్నాయి'
హైదరాబాద్ : చక్రి మరణంపై తనకు అనుమానాలున్నాయని ఆయన భార్య శ్రావణి అన్నారు. 'చక్రి చనిపోయే ముందురోజు మా అత్తగారింట్లో భోజనం చేశారు. చక్రి చనిపోగానే విలువైన డాక్యుమెంట్లు, ఆభరణాలు తీసేసుకున్నారు' అని ఆమె తెలిపారు. తన భర్త చనిపోగానే ఆయన కుటుంబ సభ్యులు తనను వేధించటం మొదలు పెట్టారని శ్రావణి చెప్పారు. కుటుంబ వ్యవహారం కావటంతో తాము దాసరి నారాయణరావు గారిని కలవటం జరిగిందని, ఆయన ఏం చెబితే అలా చేసేందుకు తాను సిద్దంగా ఉన్నా... చక్రి కుటుంబ సభ్యులు మాత్రం సహకరించలేదన్నారు. ఆ తర్వాతే పోలీసుల్ని ఆశ్రయించటం జరిగిందన్నారు. తనకు న్యాయం జరగాలని శ్రావణి అన్నారు. చక్రి కుటుంబ సభ్యుల్ని కోడలుగా చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని.. అయినా వారు తనకు సహకరించటం లేదన్నారు. మనిషి బతికి ఉన్నప్పుడు ఒకలాగా...చనిపోయిన తర్వాత మరోలా ఎలా ఉంటారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాగా చక్రి కుటుంబసభ్యులపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. -
చక్రి డెత్ సర్టిఫికెట్ కూడా ఇవ్వటం లేదు: శ్రావణి
-
చక్రి డెత్ సర్టిఫికెట్ కూడా ఇవ్వటం లేదు: శ్రావణి
హైదరాబాద్ : చక్రి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని అతని భార్య శ్రావణి ఆరోపించారు. సంగీత దర్శకుడు చక్రి గుండెపోటుతో దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. చక్రి చనిపోయిన రెండోరోజే కుటుంబ సభ్యులు డెత్ సర్టిఫికెట్ తీసుకున్నారని, తన భర్త చక్రి మరణ ధృవీకరణ పత్రాన్ని కూడా తనకు ఇవ్వడం లేదన్నారు. ఆస్తులు వారి పేరు మీద రాయాలని బలవంతం చేస్తున్నారని ఆమె తెలిపారు. గతంలో చక్రి సోదరి తమ వద్దనుంచి 50 లక్షల రూపాయలు అప్పుగా తీసుకుందని, ఇప్పుడు అడిగితే వేధిస్తున్నారని, ఇంట్లోనుంచి వెళ్లిపోమంటూ బెదిరిస్తున్నారని శ్రావణి ఆరోపించారు. ఈ నేపథ్యంలో అత్త, ఆడపడుచులు మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారంటూ శ్రావణి ..జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు అత్త విద్యావతి, మరిది మహిత్ నారాయణ, ఆడపడుచు వాణిదేవి, లక్ష్మణరావు, కృష్ణప్రియ, నాగేశ్వరరావు తదితరులపై 498, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా చక్రి కుటుంబంలో వివాదాల సుడిగుండాలు ఇదే మొదటిసారి కాదు. చక్రి చనిపోయిన రెండు, మూడు రోజులకే శ్రావణి హెచ్ఆర్సీని ఆశ్రయించారు. చక్రి కుటుంబ సభ్యులనుంచి తనకు రక్షణ కల్పించాలని కోరారు. -
చక్రి కుటుంబ సభ్యులపై కేసు నమోదు
-
చక్రి కుటుంబ సభ్యులపై కేసు నమోదు
హైదరాబాద్ : దివంగత సంగీత దర్శకుడు చక్రి కుటుంబ వివాదం మరోసారి తెరమీదకి వచ్చింది. డబ్బు కోసం చక్రి కుటుంబ సభ్యులు వేధిస్తున్నారంటూ అతని భార్య శ్రావణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. శ్రావణి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు చక్రి కుటుంబసభ్యులు ఏడుగురిపై కేసు నమోదు చేశారు. గతంలో శ్రావణి అత్తింటివారు ఆస్తి కోసం తనను వేధిస్తున్నారంటూ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
చక్రి భార్యకు అత్తింటి వేధింపులు?
గుండెపోటుతో మరణించిన సంగీత దర్శకుడు చక్రి తల్లి, అక్కాచెల్లెళ్లు తనను వేధిస్తున్నట్లు ఆయన భార్య శ్రావణి ఆరోపించారు. చక్రిని చంపే ప్రయత్నం నువ్వే చేశావంటూ ఆమెను అత్తమామలు వేధించడం మొదలుపెట్టారని ఆమె అన్నారు. మానసికంగా తనను వేధిస్తున్నారని ఆమె తెలిపారు. ఆమె చెప్పిన వివరాల ప్రకారం.. చక్రి, శ్రావణిలది ప్రేమవివాహం. పదేళ్ల క్రితం వాళ్లు పెళ్లి చేసుకున్నారు. దాంతో ఇటీవలి వరకు అయినవాళ్లంతా వాళ్లకు దూరంగా ఉన్నారు. ఇప్పుడిప్పుడే అంతా దగ్గరకు వస్తున్నారు. గతంలో శ్రావణి మీద దాడులు జరిగాయి. సుమారు నెల రోజుల క్రితం ఆమె అత్త, మరిది విడిగా వెళ్లిపోయారు. చక్రి మరణించిన తర్వాత వాళ్లంతా కలిసి చక్రి ఇంట్లోనే ఉంటున్నారు. కానీ.. శ్రావణి కనీసం నీళ్లు తాగిందో లేదో కూడా చూడట్లేదని చెబుతున్నారు. చక్రికి ఎలాంటి ఆస్తులున్నాయో కూడా ఆమెకు తెలియదని అంటున్నారు. కాగా, అత్తింటి వేధింపులపై స్పందించేందుకు సంగీత దర్శకుడు చక్రి భార్య శ్రావణి నిరాకరించారు. తన భర్త మరణించి ఇప్పటికి కేవలం మూడు రోజులే అయ్యిందని, అందువల్ల ముందు ఈ 11 రోజులు ఆయన కర్మకాండలన్నీ పూర్తి కానివ్వాలని ఆమె మీడియాను వేడుకున్నారు. ఇప్పుడు తానేమీ మాట్లాడే పరిస్థితిలో లేనని, కనీసం నిలబడే స్థితిలో కూడా లేనని చెప్పారు. తనకు మాటిమాటికీ స్పృహ తప్పుతోందని, నిన్న కూడా తాను ఫిట్స్తో పడిపోయానని అన్నారు. వేధింపులు ఉన్నట్లు ఏమైనా చెబుతారా అని అడగగా.. ఆ విషయం దేవుడికే తెలియాలంటూ కళ్లనీళ్లు పెట్టుకున్నారు. ఓసారి తనను వాళ్లు తల గోడకేసి కొట్టారని, కానీ ఆ విషయం ఆయన చూడలేదని శ్రావణి చెప్పారు. చక్రి ఆరోగ్యం గురించి ఫోన్లు చేసినా ఎవ్వరూ ఫోను ఆన్సర్ చేయలేదని తెలిపారు. తాను కనీసం చెప్పులు కూడా లేకుండా చక్రిని తీసుకుని అంబులెన్సులో ఆస్పత్రికి వెళ్లానన్నారు. వాళ్లు ఎప్పుడొచ్చారో తెలియదని, మధ్యాహ్నం ఫిలిం చాంబర్లో మృతదేహం ఉన్నప్పుడు.. వాళ్ల సామాన్లన్నీ తీసుకెళ్లిపోయారని చెప్పారు. తన కప్ బోర్డులన్నీ తాళాలు వేసేశారని, చక్రి డెబిట్ కార్డులు, చెక్కు పుస్తకాలు, ఉంగరాలు, గొలుసులు అన్నీ తీసుకెళ్లిపోయారని అన్నారు. భర్తను చంపుకొనేదాన్ని కాదని, వాళ్లే ముందు ఇంట్లోంచి వెళ్లిపోయారని శ్రావణి తెలిపారు. కనీసం తనకు కట్టుబట్టలు కూడా లేవని, కప్ బోర్డుల తాళాలన్నీ తీసుకెళ్లిపోయారని చెప్పారు. తనను బయటివాళ్లు తప్ప, ఇంట్లో వాళ్లు ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు. ఫిట్స్ వచ్చినా కూడా తన మొహం చూడలేదన్నారు. తనకు డబ్బు అక్కర్లేదని, డబ్బు ఆశించేదాన్ని కాదని తెలిపారు. తామిద్దరికీ ఎప్పుడూ గొడవలు లేవని, పొద్దున్న తన మొహం చూడకుండా లేవరని, కళ్లు మూసుకుని శ్రావణీ.. ఎక్కడున్నావని పిలిచేవారని వాపోయారు.