breaking news
central minister narayanasamy
-
AP: సచివాలయ సేవలు బాగున్నాయి
భీమవరం అర్బన్: ఏపీలో అందిస్తున్న గ్రామ, వార్డు సచివాలయ సేవలు బాగున్నాయని, ప్రజలందరికీ అందుబాటులో ఉన్నాయని కేంద్ర సామాజిక న్యాయ సాధికారత సహాయ మంత్రి ఎ.నారాయణస్వామి అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం కొమరాడలో కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ను, సచివాలయాన్ని శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ సెంటర్లో వ్యాక్సిన్ వేయించుకుంటున్న గ్రామస్తులను పలకరించి.. ఎన్ని డోసులు వేయించుకున్నారు.. ఈ వ్యాక్సిన్ ఎవరు ఇస్తున్నారనే విషయాలపై ఆరా తీశారు. అనంతరం సచివాలయాన్ని సందర్శించి కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్, మహిళా కానిస్టేబుల్, వ్యవసాయ శాఖ సిబ్బంది విధులను అడిగి తెలుసుకున్నారు. వలంటీర్ల సేవలు, వారికిచ్చే వేతనం గురించి ఆరా తీశారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పథకాలను సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజావసరాలను, ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ప్రజల ఇంటి ముంగిటకే తీసుకెళ్లడం అభినందనీయమని కితాబిచ్చారు. ఆయన వెంట బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పాకా సత్యనారాయణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాసవర్మ, జిల్లా అధ్యక్షుడు నారిన తాతాజీ తదితరులు ఉన్నారు. ఇది కూడా చదవండి: సీఎం కేసీఆర్ కొత్త కాన్వాయ్కు ‘ఏపీ బుల్లెట్ ప్రూఫ్’ వాహనాలు -
కేంద్ర మంత్రి నారాయణస్వామి కారు కింద బాంబు!
కేంద్ర మంత్రి వి.నారాయణసామి కారు కింద బాంబును గుర్తించారు. గుర్తుతెలియని వ్యక్తులు పెట్టిన ఈ పరికరాన్ని బాంబు సర్వీసు సిబ్బంది పరిశీలిస్తున్నారు. ఈ విషయాన్ని డీజీపీ పి. కామరాజ్ విలేకరులకు తెలిపారు. ఒక పైపు లాంటి పదార్థానికి రెండు వైర్లు కనెక్ట్ అయి ఉన్నాయని, వాటి రెండు చివర్లా సీల్ చేసి ఉంచారని అన్నారు. అయితే.. ఈ విషయంలో ఇంకా బాంబు గుర్తింపు, నిర్వీర్య దళం నివేదిక మాత్రం రావాల్సి ఉంది. ప్రస్తుతం నారాయణ సామి మాత్రం ఢిల్లీలో ఉన్నారు. పుదుచ్చేరిలోని ఆయన నివాసం వద్ద ఉన్న కారు కిందే ఈ బాంబు ఉంది. సంఘటన స్థలానికి డీజీపీ వెంటనే చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. తెల్లవారుజామున కారు కింద ఏదో వస్తువు ఉన్నట్లు డ్రైవర్ గుర్తించాడని నారాయణసామి తెలిపారు. పుదుచ్చేరిలో సంఘ వ్యతిరేక శక్తులు పెరుగుతున్నాయనడానికి ఇది నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ చర్యను నిరసిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రదర్శన నిర్వహించారు.