breaking news
Business rules
-
‘వ్యాపార స్వాతంత్య్రం’ ఎలా వచ్చిందంటే..
ఒకప్పుడు భారత్లో వ్యాపారం అంటే అనుమతులు, పన్నులు, ప్రభుత్వ నియంత్రణల మధ్య సాగేది. స్వాతంత్య్రం తర్వాత దేశ నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం పరిశ్రమలపై మరింత నియంత్రణ సాధించింది. 1991 ఆర్థిక సంస్కరణలతో పరిస్థితి పూర్తిగా మారింది. నేడు డిజిటల్ సింగిల్ విండో, డీరెగ్యులేషన్, లేబర్ కోడ్లతో వ్యాపారం ప్రారంభించే విధానం మరో దశలోకి వెళ్లింది.స్వాతంత్యానికి ముందు.. వ్యాపారం అంటే?1947కు ముందు ‘బిజినెస్ ప్రారంభించడానికి ఒకే చట్టం’ అంటూ ఏదీ లేదు. కంపెనీలు, కర్మాగారాలు, గనులు, ఉప్పు, మద్యం, బ్యాంకింగ్, దిగుమతులు-ఎగుమతులకు వేర్వేరు చట్టాలు, నిబంధనలు ఉండేవి. బ్రిటిష్ ఇండియా, సంస్థాన ప్రాంతాల్లోనూ విధానాలు భిన్నంగా ఉండేవి.కంపెనీల ఏర్పాటుకు 19వ శతాబ్దంలోనే చట్టపరమైన వ్యవస్థ మొదలై, చివరకు కంపెనీల చట్టం, 1913 అమల్లోకి వచ్చింది. కంపెనీల ఏర్పాటు, నిర్వహణ, మూసివేతకు ఇది ప్రాతిపదికగా నిలిచింది. అయితే నేటి ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’తో దీన్ని పోల్చలేం. వలస పాలనలో ఆర్థిక విధానాలు ప్రధానంగా బ్రిటిష్ పాలన అవసరాలకు అనుగుణంగా ఉండేవి.ఉప్పుపై ప్రభుత్వ నియంత్రణ ఇందుకు ఉదాహరణ. 1882 ఉప్పు చట్టం ద్వారా ఉప్పు తయారీ, సేకరణ, నిర్వహణపై నియంత్రణ ఉండేది. ప్రజలు స్వయంగా ఉప్పు తయారు చేయడం, విక్రయించడం స్వేచ్ఛగా చేయలేకపోయారు. ఈ పరిస్థితి మహాత్మాగాంధీ నేతృత్వంలోని ఉప్పు సత్యాగ్రహానికి కీలక నేపథ్యంగా మారింది.కర్మాగారం పెట్టాలంటే కార్మిక చట్టాలుపరిశ్రమలపై నియంత్రణతో పాటు కార్మిక చట్టాలు కూడా వచ్చాయి. 1881లో తొలి ఫ్యాక్టరీ చట్టం అమల్లోకి వచ్చింది. పిల్లల పనివేళలు, కొన్ని భద్రతా అంశాలపై పరిమితులు విధించింది. 1891, 1911, 1922, 1934లో చట్టాలు మరింత విస్తరించాయి. పని గంటలు, కార్మిక సంక్షేమం, భద్రత వంటి అంశాలు కూడా నియంత్రణలోకి వచ్చాయి.1947 తర్వాత.. ప్రభుత్వ ఆధిపత్యంస్వాతంత్య్రం తర్వాత భారత్ స్వయం సమృద్ధి కలిగిన పారిశ్రామిక దేశంగా ఎదగడంపై దృష్టి పెట్టింది. 1948 పారిశ్రామిక విధానంతో పరిశ్రమల్లో ప్రభుత్వ పాత్రకు రూపం వచ్చింది. కొన్ని కీలక రంగాలను ప్రభుత్వ ఆధీనంలో ఉంచి, మరికొన్నింటిలో ప్రైవేటు రంగానికి అవకాశం ఇచ్చారు. 1951లో వచ్చిన పరిశ్రమల (Development and Regulation) చట్టం ద్వారా కొన్ని పరిశ్రమల స్థాపన, విస్తరణపై కేంద్రానికి లైసెన్సింగ్ అధికారం లభించింది.1956 పారిశ్రామిక విధానంతో ప్రభుత్వ పాత్ర మరింత పెరిగింది. పరిశ్రమలను ప్రభుత్వ రంగానికి కేటాయించినవి, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యానికి అనువైనవి, ప్రైవేటు రంగానికి చెందినవిగా విభజించారు. దీంతో పరిశ్రమ ప్రారంభించడం, ఉత్పత్తి సామర్థ్యం పెంచడం, విస్తరించడం వంటి వాటికి ప్రభుత్వ అనుమతులు కీలకమయ్యాయి. ఇదే ‘లైసెన్స్ రాజ్’కు బలం చేకూర్చింది.1991.. అతిపెద్ద మలుపు1991 ఆర్థిక సంక్షోభం తర్వాత భారత్ పారిశ్రామిక విధానాన్ని పూర్తిగా మార్చుకుంది. జూలై 24, 1991న ప్రకటించిన కొత్త పారిశ్రామిక విధానంలో చాలా పరిశ్రమలకు లైసెన్సింగ్ను రద్దు చేశారు. వ్యూహాత్మక, భద్రత, పర్యావరణ, ప్రమాదకర ఉత్పత్తులకు సంబంధించిన కొన్ని రంగాలను మాత్రం మినహాయించారు.సామర్థ్య నియంత్రణలు కూడా గణనీయంగా తొలగడంతో కంపెనీలకు ఉత్పత్తి, విస్తరణ నిర్ణయాల్లో స్వేచ్ఛ పెరిగింది. ప్రైవేటు రంగానికి మరిన్ని అవకాశాలు, విదేశీ పెట్టుబడులకు తలుపులు తెరుచుకున్నాయి. అంటే 1950–80లలో ‘ముందు ప్రభుత్వ అనుమతి.. తర్వాత పెట్టుబడి’ విధానం ఉంటే, 1991 తర్వాత మార్కెట్ ఆధారిత నిర్ణయాలకు ప్రాధాన్యం పెరిగింది.కంపెనీల చట్టంలోనూ మార్పులు1913 కంపెనీల చట్టం స్థానంలో స్వాతంత్య్రం తర్వాత కంపెనీల చట్టం, 1956 వచ్చింది. ఆ తర్వాత పారదర్శకత, పెట్టుబడిదారుల రక్షణ, కార్పొరేట్ పాలనకు ప్రాధాన్యం పెరగడంతో కంపెనీల చట్టం, 2013 అమల్లోకి వచ్చింది.ఇప్పుడు.. డిజిటల్గా వ్యాపారం2026 నాటికి వ్యాపారం ప్రారంభించే విధానం మరింత డిజిటల్గా మారింది. నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ (NSWS) ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవసరమైన అనుమతులను గుర్తించి దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం NSWS 32 కేంద్ర విభాగాల మార్గదర్శకత్వాన్ని, 34 రాష్ట్ర ప్రభుత్వాల అనుమతుల కోసం అప్లికేషన్ సదుపాయాలను అందిస్తోంది. కొత్త ఇండస్ట్రియల్ లైసెన్స్, ఇండస్ట్రియల్ ఎంట్రాప్రెన్యూర్ మెమొరాండం (IEM) దరఖాస్తుల ప్రక్రియ కూడా ఇందులోకి మారింది.2025లో మరో కీలక సంస్కరణ2025 నవంబర్ 21 నుంచి నాలుగు లేబర్ కోడ్లు అమల్లోకి వచ్చాయి. వీటి ద్వారా 29 కేంద్ర కార్మిక చట్టాలను నాలుగు సమగ్ర కోడ్లుగా ఏకీకృతం చేశారు. వేతనాలు, పారిశ్రామిక సంబంధాలు, సామాజిక భద్రత, ఉద్యోగుల భద్రత-ఆరోగ్యానికి సంబంధించిన నిబంధనలను ఒకే విస్తృత చట్టపరమైన ఫ్రేమ్వర్క్లోకి తీసుకురావడం వీటి లక్ష్యం.మొత్తంగా చూస్తే.. బ్రిటిష్ కాలంలో పరిమితులు, పన్నులు, ఏకాధికారాల నుంచి స్వాతంత్య్రం తర్వాత ప్రభుత్వ ఆధిపత్యం, ఆపై 1991లో మార్కెట్ సంస్కరణలు.. ఇప్పుడు డిజిటల్ అనుమతులు, సరళీకృత నిబంధనల వరకు భారత్లో వ్యాపార వ్యవస్థ ఎన్నో దశలను దాటింది. -
బిజినెస్ రూల్స్ మార్చేద్దాం!
- రాయితీల అంశాలు - ఆర్థిక శాఖకు వెళ్లకుండా మార్పులు - కేబినెట్ నిర్ణయం తర్వాత మూడు రోజుల్లోనే ఉత్తర్వులు - ప్రభుత్వ పెద్దల ప్రతిపాదనలు.. ఉన్నతాధికారుల ఆందోళన సాక్షి, హైదరాబాద్: ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఆర్థిక శాఖ చికాకులు సృష్టిస్తోంది.. ఆర్థిక ఫైళ్లపై నిబంధనల పేరుతో అడ్డంగా రాస్తోంది.. దీంతో కావాల్సిన వారికి రాయితీలు ఇవ్వడానికి స్వేచ్ఛ ఉండటం లేదని ప్రభుత్వ పెద్దల అభిప్రాయం. అందుకే ఏకంగా సచివాలయ బిజినెస్ రూల్స్నే మార్చేందుకు సిద్ధమయ్యారు. సచివాలయ పాలనకు బిజినెస్ రూల్స్ కీలకం. ప్రైవేట్ సంస్థలకు రాయితీలు ఇచ్చే విషయంలో ఆర్థిక శాఖ నిబంధనల మేరకు వ్యవహరిస్తోంది. పెట్టుబడికి మించి రాయితీలు ఇవ్వాలంటూ వస్తున్న ఫైళ్లపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది.. నిబంధనలను గుర్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో రాయితీలకు చెందిన అంశాల ఫైళ్లు ఆర్థిక శాఖకు వెళ్లకుండా చేయాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించారు. ఇందులో భాగంగానే బిజినెస్ రూల్స్లో మార్పులు చేయాలని నిర్ణయించుకున్నారు. ఆర్థిక అంశాలతో ముడిపడిన అంశాలకు చెందిన ఫైళ్లు ఆర్థిక శాఖకు పంపినప్పటికీ తిరస్కరించకుండా ఉండేలా బిజినెస్ రూల్స్లో మార్పులు చేయాలని కూడా ప్రతిపాదించారు. అడ్డూ అదుపూ ఉండదిక... ఎప్పటినుంచో ఉన్న బిజినెస్ రూల్స్ను మార్చేస్తే ఇక అడ్డూ అదనపు లేకుండా ప్రజాధనాన్ని పాలకులు దోచేసుకుంటారని సీనియర్ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు ఆర్థిక శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేసినా కేబినెట్ పేరుతో పాలకులు నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఇప్పుడు బిజినెస్ రూల్స్నే మార్చేస్తే యథేచ్ఛగా కావాల్సిన వారికి కావాల్సినంత దోచిపెట్టవచ్చునని, అడిగే నాథుడే ఉండడని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంలో ఎవరికైనా న్యాయం ఒకే రకంగా ఉండాలని, అందుకే బిజినెస్ రూల్స్, నిబంధనలు పెట్టారని, ఇప్పుడు ఆ రూల్స్నే సవరిస్తే న్యాయం అనేది ఒకరికి ఒకలా, మరొకరికి మరోలా అమలవుతుందని చెబుతున్నారు. అలాగే కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలను మూడు రోజుల్లోగా అమలు చేస్తూ ఆదేశాలు జారీ చేయాలని కూడా బిజినెస్ రూల్స్లో మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి తీర్మానాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపుతారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆమోదించిన తరువాత ముఖ్యమంత్రి ఆమోదానికి వెళ్తాయి. ముఖ్యమంత్రి ఆమోదం అనంతరం ఆయా శాఖలకు వెళితే తగిన ఆదేశాలు జారీ చేస్తాయి. అయితే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే తీర్మానాలు రావడంలో జాప్యం జరుగుతోంది. ఆ జాప్యం నివారించకుండా మూడు రోజుల్లో ఆదేశాలు జారీ చేయాలంటే ప్రయోజనం ఉండదనే అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఫైనాన్సియల్ కోడ్, బడ్జెట్ మాన్యువల్ పాటించకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి వీలుండదనే అభిప్రాయాన్ని అధికార వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. -
బిజినెస్ రూల్స్ను మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సమ్మతించలేదు
పాల్వాయి ప్రశ్నకు హోంశాఖ సహాయమంత్రి హరీబాయి చౌదరి సమాధానం సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి రాజధానికి సంబంధించి శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా బిజినెస్ రూల్స్ను మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సమ్మతించలేదని కేంద్రం తెలిపింది. రాజ్యసభలో సభ్యుడు పాల్వాయి గోవర్ధన్రెడ్డి అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హరీబాయి చౌదరి సభకు లిఖితపూర్వక సమాధానం అందజేశారు. ‘ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 8(1) ప్రకారం అపాయింటెడ్ డే నుంచి ఉమ్మడి రాజధాని ప్రాంతంలో పాలనా సౌలభ్యం కోసం ప్రజల ప్రాణ, ఆస్తుల సంరక్షణపై గవర్నర్కు ప్రత్యేక బాధ్యతలు ఉన్నాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం బిజినెస్ ట్రాన్సాక్షన్ రూల్స్(బీటీఆర్)ను మార్చేందుకు అంగీకరించలేదు. కేంద్ర ప్రభుత్వం జూన్ 4న బీటీఆర్ మార్చడంపై అభిప్రాయాన్ని కోరగా జూలై 5న తెలంగాణ ప్రభుత్వం బదులిచ్చింది. శాంతిభద్రతలపై ఎప్పటికప్పుడు రాష్ట్ర మంత్రివర్గం ద్వారా గవర్నర్కు నివేదికలు పంపిస్తామని ఆ లేఖలో పేర్కొంది. సంబంధిత నేరాలను గమనించేందుకు డీజీపీ కార్యాలయంలో ఒక అధికారిని నియమిస్తామంది. అలాగే ఉమ్మడి రాజధాని ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలో భాగమని, ఇక్కడ ఉమ్మడి శాంతిభద్రతల బలగాలు ఉండబోవని తెలిపింది. శాంతిభద్రతలు రాష్ట్రం పరిధిలో అంశమైనందున.. ఇతర రాష్ట్రాలకు చెందిన బలగాలు తమ రాష్ట్ర పరిధిలో ఉండజాలవని తెలంగాణ పేర్కొంది.’ అని వివరించారు.


