breaking news
Breastmilk Donation
-
42 లీటర్ల చనుబాలను డొనేట్ చేసిన నిర్మాత
పిల్లలకు తల్లి పాలు ఎంతో అవసరం. డబ్బా పాల కంటూ అమ్మ పాలు ఎంతో బలాన్ని, మంచి ఆరోగాన్ని అందిస్తాయి. అయితే చాలా మంది తల్లులు కొన్ని కారణాల వల్ల తమ పిల్లలకు పాలు ఇవ్వలేకపోతున్నారు. ఈ ప్రభావం పిల్లల ఎదుగుదల, ఆరోగ్యంపై కచ్చితంగా పడుతోంది. ఈ విషయం తెలుసుకున్న ఓ బాలీవుడ్ నిర్మాత తన చనుబాలను తల్లి పాలకు దూరమైన చిన్నారులకు అందించేందుకు ముందుకు వచ్చారు. అలాగే తల్లి పాల ఆవశ్యకతను చెప్పుకొస్తున్నారు. సాంద్ కీ ఆంక్ సినిమాకు నిర్మాతగా పనిచేసిన 42 ఏళ్ల నిధి పర్మార్ హిరా నందిని ఈ ఏడాది ఫిబ్రవరిలో మగబిడ్డకు జన్మనిచ్చారు. అయితే నిధికి పాల ఉత్పత్తి అధికంగా ఉంటుంది. తన కొడుక్కి పాలు పట్టిన తరువాత కూడా పాలు మిగులుతుండటంతో వాటిని వృథా చేయకూడదని అనుకున్నారు. చదవండి: టాప్ ఫామ్లో ఉన్నావ్.. మహేష్ ప్రశంసలు తల్లి పాలను ఫ్రీజ్లో సరిగా స్టోర్ చేస్తే మూడు నుంచి నాలుగు నెలల వరకు నిల్వ ఉంచవచ్చని గ్రహించారు. దీంతో ఎక్కువైన పాలను పాలు దొరక్క ఇబ్బంది పడుతున్న చిన్నారులకు అందించాలని నిర్ణయించుకున్నారు. తన పాలను డొనేట్ చేయాలని నిర్ణయించుకున్న తర్వాత ఎలా చేయాలన్న విధానంపై తీవ్రంగా ఆలోచించారు. ఇందుకోసం అనేక మందిని ఇందుకు సంబంధించిన వివరాలను అడగ్గా.. అమెను అందరూ ఎగతాళి చేశారు. ఎవరూ సరైన వివరాలు చెప్పలేదు. దీంతో ఆన్లైన్లో డొనేషన్ సెంటర్ల వివరాలను తెలుసుకున్నారు. చివరకు ముంబైలోని సూర్య హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డులోని పిల్లల కోసం తన పాలను డొనేట్ చేయాలని నిర్ణయించుకున్నారు. చదవండి: వైరల్: ‘సామ్ జామ్’లో మెరిసిన మెగాస్టార్.. 42 లీటర్ల పాలు డొనేట్ మార్చి నెల నుంచి ఇప్పటివరకు హిరానందిని నలభై రెండు లీటర్ల వరకు తల్లి పాలను డొనేట్ చేశారు. తన పాలు అందించిన పిల్లల్లో ప్రీమెచ్యూర్ బేబీస్, బరువు తక్కువగా పుట్టిన చిన్నారులే ఎక్కువగా ఉన్నారు. ఓ సారి స్వయంగా ఆమె తన పాలు తాగే చిన్నారులు ఎలా ఉన్నారో చూడడం కోసం ఆస్పత్రికి వెళ్లారు. ఆ చిన్నారులను స్వయంగా చూసిన తర్వాత ఆమె తన చనుబాలను మరో ఏడాది పాటు డొనేట్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయంపై నిధి మాట్లాడుతూ.. నా బిడ్డకు పాలు పట్టిన కూడా నాకు చాలా పాలు మిగిలాయి. వాటిని నేను ఎందుకైనా ఉపయోగించుకోవాలనుకున్నాను. నా స్నేహితులను అడిగితే.. ఆభరణాల తయారీ, ఫేస్ ప్యాక్, స్క్రబ్ వంటి సలహాలు ఇచ్చారు. కానీ నేను అందుకు ఇష్టపడలేదు. తరువాత నెట్లో శోధించి.. ఒక గైనకాలజిస్టు ద్వారా ముంబైలోని ఓ ఆసుపత్రిలో తల్లి పాలు డొనేట్ చేస్తారని తెలుసుకున్నాను. వెంటనే అప్పటి నుంచి 40 లీటర్లకు పైగా పాలు దానం చేశాను. ఇంత మంది పిల్లలకు పాలు అందించడం గొప్పగా ఫీల్ అవుతున్నాను’ అని తెలిపారు. -
బంగారు తల్లి!
‘తల్లిపాలు అమృతంతో సమానం’ అంటారు. ఆ అమృతానికి కొరత ఏర్పడింది. మన దేశంలో తక్కువ సంఖ్యలో ‘తల్లిపాల కేంద్రాలు’ ఉన్నాయి. వీటి గురించి కూడా తక్కువ మందికే తెలుసు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని తల్లిపాల గొప్పదనం గురించి ప్రచారం చేయడమే కాదు... స్వయంగా బ్రెస్ట్ మిల్క్ డొనేట్ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు చెన్నైకి చెందిన శరణ్య గోవిందరాజులు. తాను గర్భవతిగా ఉన్న సమయంలో ‘నేచురల్ పేరెంటింగ్’ అనే ఫేస్బుక్ కమ్యూనిటీలో చేరారు శరణ్య, ఈ కమ్యూనిటీ ద్వారా ‘బ్రెస్ట్మిల్క్ డొనేషన్’తో పాటు ఎన్నో విలువైన విషయాలు తెలుసుకోగలిగారు.‘బ్రెస్ట్మిల్క్ డొనేషన్’ శరణ్యను ఆకట్టుకుంది. తాను కూడా చేయాలనుకున్నారు. ఈ సమయంలోనే వాహిదాలాంటి బ్రెస్ట్మిల్క్ డోనర్లు శరణ్యకు మార్గదర్శకంగా నిలిచారు. ప్రోత్సహించారు. పాలను దానం చేయడానికి ‘కంచి కామకోఠి చైల్డ్స్ ట్రస్ట్ హాస్పిటల్’ను ఎంచుకున్నారు శరణ్య. పాలదానం చేసే క్రమంలో హాస్పిటల్కు వెళుతున్నప్పుడు ‘బ్రెస్ట్ మిల్క్బ్యాంక్లు’ ‘బ్రెస్ట్మిల్క్ డొనేషన్’ అనేవి ఎంత ప్రాధాన్యత కలిగిన విషయాలో మరింత బాగా తెలిసింది.‘‘పాలదానం విషయంలో నా కుటుంబ సభ్యులు అండగా నిలవడం ఆనందాన్ని ఇస్తుంది’’ అంటున్నారు శరణ్య.ఒకసారి శరణ్య హాస్పిటల్కు వెళ్లినప్పుడు ఒక తల్లి... ‘‘ఏమ్మా... పాలను ఇవ్వడానికి ఎంత డబ్బు తీసుకుంటావు?’’ అని అడిగింది. ఆశ్చర్యపోవడం శరణ్య వంతైంది. ఆ ఆశ్చర్యం నుంచి తేరుకొని తాను ఉచితంగా పాలదానం చేస్తున్నానని చెప్పారు. ఆ సమయంలో ఆ తల్లి కంట్లో వెలుగు కనిపించింది.‘బ్రెస్ట్ మిల్క్ డొనేషన్’ గురించి కొందరికి అపోహలు ఉండవచ్చు. కొందరికి అవగాహన లేకపోవచ్చు.... ఇలాంటి వారికి శరణ్య గోవిందరాజులు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. శరణ్యతో ఒక్కసారి మాట్లాడితే చాలు... ‘బ్రెస్ట్మిల్క్ డొనేషన్’ అనేది మనసుకు ఎంత తృప్తిని ఇచ్చే పనో తెలుసుకోగలుగుతున్నారు.‘బ్రెస్ట్ మిల్క్ డొనేషన్’ గురించి ఎంత అవగాహన కలిగిస్తే...అన్ని ‘మిల్క్బ్యాంకు’లు ఏర్పాటు చేసే అవకాశాలు పెరుగుతాయని వైద్యులు చెబుతున్నారు. శరణ్యలాంటి వాళ్లు మరింత మంది పూనుకుంటే ఆ అవగాహన విస్తృతి మరింత వేగంగా పెరుగుతుంది అనడంలో సందేహం లేదు.