-
ఆరు టన్నుల గో మాంసం పట్టివేత
పద్మనాభం (భీమిలి) : విజయనగరం నుంచి తూర్పు గోదావరి జిల్లాకు వ్యాన్లో తరలిస్తున్న సుమారు రూ.60 వేల విలువ చేసే ఆరు టన్నుల గో మాంసాన్ని సోమవారం ఉదయం విజయనగరం గో సంరక్షణ సంఘం వారు విశాఖ జిల్లా పద్మనాభం జంక్షన్లో పట్టుకుని పోలీసులకు అప్పగిం చారు. వివరాలిలా ఉన్నాయి. విజయనగరంలో వంద గోవులను వధించి ఆరు టన్నుల మాంసాన్ని ఏపీ35 16టీఎస్1257 నంబర్ హేచర్ వ్యాన్లో తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడికి తరలిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న గోవులు, జంతువుల సంరక్షణ సంఘం కార్యదర్శి పనస బం గార్రాజు వ్యాన్ను వెంబడించారు. మార్గమధ్యలో పద్మనాభం జంక్షన్ వద్దకు రాగానే ఉదయం ఐదు గంటల సమయంలో వ్యాన్ ను పట్టుకున్నారు. వ్యాన్ నడుపుతున్న విజయవాడ ప్రాంతానికి చెందిన డ్రైవర్ మంచెల రామరాజు, తూర్పుగోదావరి జిల్లా గుండెపల్లి మండలం ఎరంపల్లి గ్రామానికి చెందిన క్లీనర్ కుదేలు వీరబాబును పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బంగార్రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వ్యాన్ను సీజ్ చేసి డ్రైవర్, క్లీనర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. గో మాంసాన్ని జనవాసాలకు దూరంలో ఉన్న కృష్ణాపురం కొండల వద్ద పూడ్చినట్టు పోలీసులు తెలిపారు. వ్యాన్తో కలిపి గో మాంసం బరువు పది టన్నులు ఉంటుం దని పోలీసులు తెలిపారు. -
అవును.. అది ఆవు మాంసమే!
దేశంలో 'అసహనం' వ్యాఖ్యలకు దారితీసిన దాద్రి ఘటన గుర్తుండే ఉంటుంది కదూ. యూపీలోని దాద్రి ప్రాంతంలో 50 ఏళ్ల మహ్మద్ అఖ్లాక్ అనే వ్యక్తి వద్ద ఆవుమాంసం ఉందని సుమారు 100 మంది అతడిని ఇంట్లోంచి బయటకు లాగి చంపేశారు. అప్పట్లో పోలీసులు అతడి ఇంటివద్ద చెత్తకుండీలో ఉన్న మాంసం శాంపిళ్లను సేకరించారు. అది 'మటన్' అని, బీఫ్ కాదని స్థానిక వైద్యుడు ఒకరు చెప్పారు. కానీ.. ఆ ఘటన జరిగిన 8 నెలల తర్వాత ఈ కేసు సరికొత్త మలుపు తిరిగింది. అక్కడ లభించింది. ఆవు లేదా దూడ మాంసమేనని ఫోరెన్సిక్ పరీక్షలో వెల్లడైంది. తొలుత అది మటన్ అనే తాము భావించామని, కానీ తర్వాత అది ఆవుమాంసం అన్న విషయం తేలిందని యూపీ డీజీపీ జావేద్ అహ్మద్ తెలిపారు. యూపీలో ఆవుమాంసం తినడం నేరం కాదు గానీ, ఆవులను చంపడం మాత్రం నేరమే. అఖ్లాక్ హత్య కేసులో అరెస్టయిన 18 మందిలో స్థానిక బీజేపీ నేత కుమారుడు కూడా ఉన్నారు. అప్పట్లో ముందు అక్కడున్నది మటన్ అని చెప్పడంతో.. బీజేపీ, దాని అనుబంధ సంఘాలు తప్పుడు రూమర్లు ప్రచారం చేస్తూ మత కల్లోలాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని సమాజ్వాదీ పార్టీ ఆరోపించింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
ఫిల్ సాల్ట్ విధ్వంసం.. ఢిల్లీను చిత్తు చేసిన కేకేఆర్
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement