-
నిమ్స్లో త్వరలో ఐపీ సేవలు
బీబీనగర్(భువనగిరి) : బీబీనగర్ నిమ్స్ ఆస్పత్రిలో ఇన్పేషెంట్ (ఐపీ) విభాగాన్ని త్వరలో ప్రారంభిస్తామని ఎంపీ బూర నర్సయ్యగౌడ్ వెల్లడించారు. గురువారం నిమ్స్ భవనంలో కొనసాగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఆయ న విలేకరులతో మాట్లాడుతూ ముఖ్య మంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నిమ్స్ భవనంలో కొనసాగుతున్న పునరుద్ధరణ పనులను పరిశీలించినట్లు తెలిపారు. జూన్లోపు నిర్మాణ పనులు పూర్తవుతాయని, తదుపరి మొదటి దశలో 13 విభాగాలతో, 250 పడకలతో ఇన్ పేషెంట్ విభాగాన్ని ప్రారంభించనున్నట్టు తెలిపారు. రెండో దశలో 700లకుపైగా పడకలతో ఇతర విభాగాలతో కూడిన పూర్తిస్థాయి ఆస్పత్రిని ప్రారంభించనున్నట్టు వివరించారు. మొదటి దశలో కావాల్సిన సదుపాయాలు, అవరమయ్యే నిధులపై ప్లాన్ చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్టు తెలిపారు. అంతకుముందు నిమ్స్ భవనంలో పూర్తయిన పనులు, పరిసర ప్రాంతాలను డ్రోన్ కెమెరాలతో షూట్ చేయించిన ఎంపీ వాటిని సీఎంకు చూపించనున్నట్లు ఆయన తెలిపారు. ఎయిమ్స్ ఏర్పాటుకు కృషి బీబీనగర్లోనే ఎయిమ్స్ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు ఎంపీ నర్సయ్యగౌడ్ తెలిపారు. ముఖ్యమంత్రి కూడా మొగ్గు చూపుతున్నారని, కేంద్రానికి అందజేయాల్సిన స్థల సేకరణ ప్రతిపాదనలను రాష్ట్రంలోని ఆదిలాబాద్, మహబూబ్నగర్, యాదాద్రిభువనగిరి జిల్లా బీబీనగర్ నుంచి కేంద్రానికి పంపించినట్టు తెలిపారు. బీబీనగర్లో ఏయిమ్స్ నిర్మాణానికి అనుకూలంగా ఉందని సీఏం దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. ఆయన వెంట ఎంపీపీ గోళి ప్రణీతాపింగళ్రెడ్డి, నిమ్స్ సూపరింటెండెంట్ మహేశ్వర్రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ అమరేందర్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పిట్టల అశోక్ తదితరులు ఉన్నారు. -
బీబీనగర్ నిమ్స్ను ఏం చేద్దాం?
వైద్య కళాశాలా?.. క్యాన్సర్ ఇన్స్టిట్యూటా? మూడు ప్రతిపాదనలతో సీఎం వద్దకు ఫైలు తాజా బడ్జెట్లో రూ.కోటితో సరిపెట్టిన వైనం సిటీబ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న బీబీనగర్ నిమ్స్పై మళ్లీ సందిగ్ధం నెలకొంది. 150 ఎకరాల విస్తీర్ణం గల ఈ క్యాంపస్ను,అందులో నిర్మించిన భవనాలను వైద్య కళాశాలకు అప్పగించాలా..? క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కు కేటాయించాలా..? లేక ముందుగా అనుకున్నట్టు జనరల్ ఆస్పత్రినే కొనసాగించాలా..? అనే దానిపై ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఫైలు ఇప్పటికే సీఎం కేసీఆర్కు చేరినట్టు సమాచారం. ఈ భవనాలను ఏం చేయాలనే అంశంపై పూర్తి నిర్ణయాధికారాన్ని సీఎంకే వదిలేసినట్టు సమాచారం. తాజా బడ్జెట్లో దీనికి పెద్దగా కేటాయింపులు జరపకపోవడం వెనుక ఇదే కారణమని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఓపీకి అంతా సిద్ధమైనా.. బీబీనగర్ సమీపంలోని రంగాపూర్ వద్ద 150 ఎకరాల విస్తీర్ణంలో రూ.93 కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన నాలుగు అంతస్తులు నిమ్స్ భవనం పనులను నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ దక్కించుకుంది. దివంగత సీఎం వైస్ రాజశేఖరరెడ్డి 2009లో దీనికి శంకుస్థాపన చేశారు. ఇటీవలే ఓపీ భవనం పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం పూర్తిస్థాయిలో కాకపోయినా తొలిదశలో భాగంగా ఆస్పత్రిలో నాలుగు ఆపరేషన్ థియేటర్లు, క్యాజువాలిటీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, స్పైన్, హెడ్ ఇంజూరీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, విభాగాలు, అధునాతన బ్లడ్ బ్యాంక్, ఎక్సరే, సీటీ, ఎంఆర్ఐ సేవలతో పాటు అన్ని రకాల వైద్య పరీక్షలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. ప్రతి విభాగానికి ఆరుగురు నిష్ణాతులైన వైద్యులు, ప్రాథమిక అవసరాల కోసం 700 మంది నర్సింగ్, పారామెడికిల్, నాన్ పారామెడికల్ స్టాఫ్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అవసరమైన ఏర్పాట్లు కూడా చేశారు. తీరా ప్రారంభ సమయంలో దీనిపై సీఎం కేసీఆర్కు మూడు ప్రతిపాదనలు అందాయి. తాజా ప్రతిపాదనలు ఇలా.. ప్రస్తుతం రెడ్హిల్స్లోని ఎంఎన్జే క్యాన్సర్ ఆస్పత్రికి రోగుల తాకిడి ఎక్కువైంది. దీన్ని బీబీనగర్కు తరలించి క్యాన్సర్తో బాధపడుతున్న వారికి అక్కడే వైద్యసేవలు అందించాల నే అంశాన్ని కూడా పరిశీలిస్తోంది. లేదంటే తెలంగాణకు కొత్తగా మంజూరైన మెడికల్ కాలేజీకి ఈ క్యాంపస్ను కేటాయించడం వల్ల గ్రామీణ విద్యార్థులకు వైద్యవిద్యను దగ్గర చేయడంతోపాటు పరిసర ప్రాంతాల్లోని రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించవచ్చని యోచిస్తోంది. ఈ రెండు కాకపోతే స్థానిక ప్రజల అవసరాల దృష్ట్యా జిల్లాలో మరో జనరల్ ఆస్పత్రిని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే అంశం కూడా పరిశీలనలో ఉంది. ఏదేమైనా సకాలంలో సేవలు అందుబాటులోకి వస్తే భువనగిరి డివిజన్తోపాటు నల్లగొండ, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, మెదక్ జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందే అవకాశం ఉంది. ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలైనా బీబీనగర్ నిమ్స్పై ఇంకా ఓ నిర్ణయం తీసుకోకపోవడం సిగ్గుచేటని పీసీసీ నాయకుడు చామల ఉదయ్ చందర్రెడ్డి గురువారం ఓ ప్రకటనలో విమర్శించారు. ఆస్పత్రి భవనాన్ని వెంటనే ప్రారంభించి, స్థానికులకు వైద్యసేవలు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు కొత్తకోటకు సీఎం రేవంత్ రాక..
‘నీట్’కు ఏర్పాట్లు పూర్తి
ఐదుగురి నామినేషన్లు
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్రెడ్డి
సుందర మున్నేరే లక్ష్యం..
నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు
నేడు, రేపు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
పకడ్బందీగా విధులు నిర్వర్తించాలి
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
ముగ్గురు మంత్రులం ఉన్నాం..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement