breaking news
Baramulla attack
-
బారాముల్లాలో ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: అసెంబ్లీ ఎన్నికల ముందు జమ్ముకశ్మీర్లో బాంబు మోత మోగుతోంది. ఇప్పటికే కథువా, కిష్త్వార్ జిల్లాలో ఎన్కౌంటర్ కొనసాగుతుండగా.. తాజాగా బారాముల్లా జిల్లాలోనూ భద్రతా బలగాలు.. ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.ఈ ఎన్కౌంటర్ ముగ్గురు మిలిటెంట్లు హతమయ్యారు. ఉత్తర కాశ్మీర్ పట్టాన్ ప్రాంతంలోని చక్ తాపర్ క్రీలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం రావడంతో భారత సైన్యం, జమ్ముకశ్మీర్ పోలీసులు శుక్రవారం అర్థరాత్రి సంయుక్త ఆపరేషన్ ప్రారంభించారు. స్కూల్ బిల్డింగ్లో దాక్కున్న మిలిటెంట్లతో ఎదురుకాల్పులకు దిగారు. శుక్రవారం రాత్రి ఒక మిలిటెంట్ చనిపోగా, శనివారం ఉదయం మరో ఇద్దరు హతమయ్యారు.చదవండి: మోదీ పర్యటన ముందు జమ్ముకశ్మీర్లో కాల్పుల మోత.. ఇద్దరు జవాన్ల మృతిఎన్కౌంటర్లో ముగ్గురు చనిపోయినట్లు కశ్మీర్ ఐజీ వీకే బిర్డి వెల్లడించారు. ఆ మిలిటెంట్లను గుర్తించే ప్రక్రియలో ఉన్నట్లు చెప్పారు. మరోవైపు జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇవాళ దోడా జిల్లాలో ప్రధాని మోదీ ప్రచారం చేపట్టనున్నారు.Joint operation with @JmuKmrPolice in progress at #Baramulla. https://t.co/YZY7MLjYeo pic.twitter.com/GkvBlwRJ2k— NORTHERN COMMAND - INDIAN ARMY (@NorthernComd_IA) September 14, 2024 -
మన సైన్యం తగిన బుద్ధి చెప్పింది..
న్యూఢిల్లీః ఉగ్రవాదులకు మన సైనికులు తగిన బుద్ధి చెప్పారంటూ హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రశంసించారు. ఆదివారం రాత్రి బారాముల్లా సరిసర సైనిక శిబిరాలపై భారీగా సాయుధ తీవ్రవాదులు దాడులు జరిపిన నేపథ్యంలో హోం మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదుల ప్రయత్నాలకు భారత సైన్యం గట్టి బుద్ధి చెప్పిందంటూ సైన్యానికి అభినందనలు తెలిపారు. లేహ్, కార్గిల్ ప్రాంతాల్లో రాజ్ నాథ్ రెండు రోజులపాటు పర్యటించనున్నారు. మన భద్రతా దళాలు ఉగ్రవాదులను ఎంతో చాకచక్యంగా ఎదుర్కొంటున్నారని, దాడులకు తగిన జవాబు ఇస్తున్నారని హోం మంత్రి అన్నారు. జమ్మూ కాశ్మీర్ బారాముల్లా ప్రాంతంలోని ఆర్మీ, పారా మిలటరీ శిబిరాలపై ఆదివారం రాత్రి తీవ్రవాదులు జరిపిన దాడిపై మీడియాకు ప్రశ్నకు హోం మంత్రి ఆ విధంగా సమాధానం ఇచ్చారు. బారాముల్లా 46 రాష్ట్రీయ రైఫిల్స్ క్యాంపుపై ఆదివారం రాత్రి ఆత్మాహుతి దాడికి దిగిన ఉగ్రవాదులను బీఎస్ ఎఫ్ ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొట్టిందని రాజనాథ్ వివరించారు. శ్రీనగర్ లోని 46 రాష్ట్రీయ రైఫిల్స్ ప్రధాన కార్యాలయం వద్ద ఉగ్రవాదులు సృష్టించిన బీభత్సంలో సైనికులకు ఉగ్రవాదులకు మధ్య సుమారు నాలుగు గంటలపాటు హోరాహోరీ పోరాటం జరిగింది. ఈ నేపథ్యంలో జరిగిన కాల్పుల్లో ఓ జవాన్ వీరమరణం పొందగా.. మరో ఇద్దరు జవాన్లకు గాయాలైనట్లు భారత ఆర్మీ వెల్లడించింది. కాల్పుల్లో ఇద్దరు పాక్ మిలిటెంట్లను ఆర్మీ మట్టుబెట్టింది. మరో నలుగురు ఉగ్రవాదులు తప్పించుకున్నారు. పీవోకే లోని తీవ్రవాదుల శిబిరాలపై భారత ఆర్మీ దళాలు సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించిన పక్షం రోజుల తర్వాత మొదటిసారి బారాముల్లాలో ఉగ్రవాదులు విరుచుకు పడ్డారు. భారత ఆర్మీ శిబిరాలపై ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలను కలసి వారి యోగ క్షేమాలను తెలుసుకోవడంతో పాటు, కాశ్మీర్ సమస్య పరిష్కారానికి వారి సలహాలను తీసుకునేందుకు రాజ్ నాథ్ లేహ్, కార్గిల్ ప్రాంతాల్లో రెండు రోజులపాటు పర్యటించనున్నారు. శ్రీనగర్ తో పాటు ఇతర ప్రాంతాల్లో ఆందోళనలకు పరిష్కారం కనుగొనే దిశగా రాజనాథ్ పర్యటన కొనసాగుతుంది. అలాగే లఢక్ పర్యటనలో ప్రజలతో సంభాషించడం వల్ల వారు ఎదుర్కొనే సమస్యలను తెలుసుకుని, వాటిని త్వరలో పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. హిజ్బుల్ ముజాహిదీన్ మిలిటెంట్ బుర్హాన్ వని మరణం అనంతరం జమ్ము కాశ్మీల్లో అశాంతి తలెత్తిన నేపథ్యంలో హోమ్ మినిస్టర్ ఆ ప్రాంతంలో పర్యటించడం ఇది నాలుగోసారి. -
మన సైన్యం తగిన బుద్ధి చెప్పింది..