-
బ్యాంకింగ్ దెబ్బ- మార్కెట్లు డీలా
ప్రధానంగా పీఎస్యూ, ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ కౌంటర్లలో తలెత్తిన అమ్మకాలు దేశీ స్టాక్ మార్కెట్లను దెబ్బతీశాయి. వెరసి సెన్సెక్స్ 143 పాయింట్లు క్షీణించి 36,594 వద్ద ముగిసింది. నిఫ్టీ 46 పాయింట్ల నష్టంతో 10,768 వద్ద స్థిరపడింది. ప్రపంచ మార్కెట్లు డీలాపడటంతో తొలి నుంచీ ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యమిచ్చారు. ఫలితంగా మిడ్ సెషన్లో సెన్సెక్స్ 36,401 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. అయితే తొలుత 36,749 వద్ద గరిష్టానికీ చేరింది. ఈ బాటలో 10,764 వద్ద ప్రారంభమైన నిఫ్టీ 10,819 వద్ద గరిష్టాన్ని తాకగా.. 10,713 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. కోవిడ్-19 కేసులు పెరుగుతున్న కారణంగా గురువారం యూఎస్ మార్కెట్లు నీరసించాయి. ఐటీ అక్కడక్కడే ఎన్ఎస్ఈలో ప్రధానంగా బ్యాంక్ నిఫ్టీ 2.5 శాతం స్థాయిలో వెనకడుగు వేసింది. మెటల్, ఆటో, మీడియా సైతం 0.7 శాతం స్థాయిలో నీరసించాయి. అయితే ఫార్మా, రియల్టీ, ఎఫ్ఎంసీజీ 0.7 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. ఐటీ 0.2 శాతం బలపడింది. నిఫ్టీ దిగ్గజాలలో యాక్సిస్, గెయిల్, ఐసీఐసీఐ, ఇండస్ఇండ్, హెచ్డీఎఫ్సీ, ఇన్ఫ్రాటెల్, టైటన్, అదానీ పోర్ట్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎస్బీఐ 3.2-2 శాతం మధ్య నష్టపోయాయి. ఇతర బ్లూచిప్స్లో ఆర్ఐఎల్, హెచ్యూఎల్, సన్ ఫార్మా, బ్రిటానియా, ఎయిర్టెల్, టీసీఎస్, కోల్ ఇండియా, నెస్లే, పవర్గ్రిడ్ 3-0.5 శాతం మధ్య లాభపడ్డాయి. పీఎన్బీ డౌన్ డెరివేటివ్ కౌంటర్లలో పీఎన్బీ, టాటా పవర్, ఎంజీఎల్, కెనరా బ్యాంక్, యూబీఎల్, ఐసీఐసీఐ ప్రు, భారత్ ఫోర్జ్, ఆర్బీఎల్ బ్యాంక్, జూబిలెంట్ ఫుడ్, ఐడీఎఫ్సీ ఫస్ట్బ్యాంక్ 5.4-3.2 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. మరోవైపు ఐడియా, జిందాల్ స్టీల్, మైండ్ట్రీ, ఎస్బీఐ లైఫ్, బయోకాన్, హెచ్పీసీఎల్, ఐబీ హౌసింగ్ 5-2 శాతం మధ్య జంప్చేశాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.7-0.4 శాతం మధ్య బలహీనపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1662 నష్టపోగా.. 1001 లాభపడ్డాయి. డీఐఐల అమ్మకాలు నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 213 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 803 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించాయి. ఇక బుధవారం ఎఫ్పీఐలు రూ. 995 కోట్లు, డీఐఐలు రూ. 853 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. అయితే మంగళవారం ఎఫ్పీఐలు రూ. 830 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 784 కోట్ల అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మెగా ఐపీవో నేడే
న్యూఢిల్లీ: దేశీయ బీమా రంగం నుంచి ఓ కంపెనీ తొలిసారిగా భారీ ఐపీవోకు వస్తోంది. ప్రైవేటు రంగ బీమా దిగ్గజం ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఐపీవో సోమవారం ప్రారంభం కానుండగా, ఈ నెల 21న ముగియనుంది. ఈ ఇష్యూలో భాగంగా ఐసీఐసీఐ బ్యాంకు తన వాటాల్లోంచి 12.65 శాతం వాటాకు సమానమైన 18,13,41,058 ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. తద్వారా రూ.6వేల కోట్లకు పైగా నిధులు సమీకరించనుంది. ఒక్కో షేరు ధరల శ్రేణిని రూ.300 - 334. ఐపీవోకు ముందే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ 40 యాంకర్ ఇన్వెస్టర్లకు 4.89 కోట్ల షేర్లు ఒక్కోటీ రూ.334 ధరకు కేటాయించడం ద్వారా ‘అతిపెద్ద యాంకర్ ఇన్వెస్టర్ ప్లేస్మెంట్’గా రికార్డు సృష్టించింది. ఇష్యూ సైజులో 10 శాతం షేర్లు అంటే 1,81,34,105 షేర్లను ఐసీఐసీఐ బ్యాంకు షేర్ హోల్డర్లకు రిజర్వ్ చేశారు. గరిష్టంగా 50 శాతం క్వాలిఫైడ్ ఇన్వెస్టర్లకు, రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం రిజర్వ్ చేశారు. యాంకర్ ప్లేస్మెంట్ తర్వాత నికరంగా 13.2 కోట్ల షేర్లు సబ్స్క్రిప్షన్కు అందుబాటులో ఉండగా, అందులో రిటైల్ ఇన్వెస్టర్లకు 5.71 కోట్ల షేర్లు అందుబాటులో ఉన్నాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ కార్యకలాపాలు 2001లో ప్రారంభం కాగా, మార్చి చివరి నాటికి సంస్థ నిర్వహణలో 1.4 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్లో ఐసీఐసీఐ బ్యాంకుకు 68 శాతం, యూకేకు చెందిన ప్రుడెన్షియల్ కార్పొరేషన్ హోల్డింగ్స్కు 26 శాతం వాటా ఉంది. విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్జీకి చెందిన ప్రేమ్జీ ఇన్వెస్ట్కు 4 శాతం, సింగపూర్కు చెందిన టెమాసెక్కు 2 శాతం చొప్పున వాటా ఉంది. గతేడాది నవంబర్లో వీరికి 6 శాతం వాటాలను విక్రయించడం ద్వారా ఐసీఐసీఐ బ్యాంకు రూ.1,950 కోట్లను సమీకరించింది. తాజా ఇష్యూ అనంతరం ఐసీఐసీఐ బ్యాంకు వాటా 55 శాతానికి పరిమితం కానుంది. కాగా, 2010లో ప్రభుత్వరంగ కోల్ ఇండియా సంస్థ ఐపీవో తర్వాత మరోసారి భారీ స్థాయి ఇష్యూ రావడం ఇదే. కోల్ ఇండియా అప్పట్లో రూ.15వేల కోట్ల నిధులను ఐపీవో ద్వారా సమీకరించింది.
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
విల్ జాక్స్ విధ్వంసకర సెంచరీ.. 10 సిక్స్లతో! వీడియో వైరల్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
Advertisement