బంగ్లాదేశ్ ఉగ్రవాది అరెస్టు
ముజఫర్నగర్: ఉత్తరప్రదేశ్ ఉగ్రవాద నిరోధక దళం (యూపీ ఏటీఎస్) ఆదివారం ఓ విదేశీ ఉగ్రవాదిని అరెస్టు చేసింది. దేశంలో అక్రమంగా ప్రవేశించిన బంగ్లాదేశీ ఉగ్రవాదిని అదుపులోకి తీసుకుంది. యూపీలో ముజఫర్నగర్లో తిష్టవేసిన అతను.. పలువురు విదేశీయులు దేశంలోకి ప్రవేశించేందుకు వీలుగా నకిలీ గుర్తింపు కార్డులను సమకూరుస్తున్నట్టు గుర్తించింది.
బంగ్లాదేశ్కు చెందిన అన్సారుల్లా బంగ్లా గ్రూప్కు చెందిన ఉగ్రవాదిగా అతన్ని గుర్తించారు. అతని వివరాలు తెలియాల్సి ఉంది. యూపీ ఏటీఎస్ ఫొటోను మీడియాకు విడుదల చేసింది.