breaking news
balaji cheruvu
-
డీఎస్సీ-14లో మాకూ ఛాన్స్ ఇవ్వాలి
బాలాజీ చెరువు(కాకినాడ) : త్వరలో వెలువడనున్న డీఎస్సీ-14లో తమకూ అవకాశం కల్పించాలంటూ సోమవారం డీఎడ్(డిప్లమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్) ద్వితీయ సంవత్సర అభ్యర్థులు నినాదాలు చేశారు. ముందుగా వారు మెయిన్రోడ్డులోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, కార్యాలయ ఏడీ అన్నపూర్ణకు వినతిపత్రం అందజేశారు. అనంతరం విద్యార్థులందరూ అక్కడి నుంచి ర్యాలీగా మసీదు సెంటర్ నుంచి బాలాజీ చెరువు మీదుగా జీజీహెచ్ నుంచి కలెక్టరేట్కు చేరుకుని అక్కడ నినాదాలు చేశారు. దివంగత ముఖ్యమంత్రి 2008 డీఎస్సీ పోస్టుల్లో డీఎడ్ ద్వితీయ సంవత్సర అభ్యర్థులకు అవకాశం కల్పించారని, అదే పద్ధతి 2012లోనూ కొనసాగించారన్నారు. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని అన్నారు. అనంతరం యూటీఏఫ్ భవనంలో డీఎడ్ ద్వితీయ సంవత్సర అభ్యర్థుల సంఘ అధ్యక్షుడిగా నక్కా పాండురంగారావు, ఉపాధ్యక్షుడిగా కె.రాజు, ప్రధాన కార్యదర్శిగా ఎం.శివసాయిప్రసాద్, కోశాధికారిగా ముమ్మిడి సతీష్, కార్యదర్శిగా బి.హరీష్, కార్యవర్గ సభ్యులుగా పి.అప్పలసూరి, డి.మురళీకృష్ణ, రవితేజ, సతీష్కుమార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో ఎస్టీయూ ప్రధాన కార్యదర్శి సుబ్బరాజు, పీఆర్టీయూ అధ్యక్ష, కార్యదర్శులు పి.వి.వి సత్యనారాయణ,చింతాడ ప్రదీప్కుమార్తో పాటు దాదాపు రెండువేల మంది డీఎడ్ విద్యార్థులు పాల్గొన్నారు. -
బ్యాంక్ ఉద్యోగుల సమ్మె
బాలాజీచెరువు (కాకినాడ), న్యూస్లైన్ : పదో ద్వైపాక్షిక వేతన ఒప్పందాన్ని వెంటనే అమలుచేయాలని, బ్యాంకింగ్ రంగ సంస్కరణలు నిలుపుదల చేయాలనే డిమాండ్లతో యునెటైడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ పిలుపు మేరకు బుధవారం జిల్లా వ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులు సమ్మె చేశారు. 500 ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకు శాఖల వఉద్యోగులు నినాదాలు చేస్తూ విధులు బహిష్కరించారు. దాంతో సుమారు రూ. 800 కోట్ల లావాదేవీలు నిలిచిపోయాయి. పలువురు వినియోగదారులు బ్యాంక్లకు వచ్చి ఇబ్బంది పడ్డారు. తమ డిమాండ్లు తీర్చకపోతే మరిన్ని నిరసన కార్యక్రమాలు నిరహిస్తామని బ్యాంక్ ఫోరం కన్వీననర్ ఆదినారాయణ మూర్తి తెలిపారు. ఆంధ్రాబ్యాంక్ జోనల్ కార్యాలయం వద్ద జరిగిన సమ్మెలో బ్యాంక్ ఫోరం నాయకులు పి.రమణ, మూర్తి, దేవదాసు, త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు.