అసెంబ్లీలో టీడీపీ ఎంపీ కలకలం
హైదరాబాద్: అసెంబ్లీలో రాష్ట్ర విభజనపై బిల్లు వ్యవహారం హోరెత్తిస్తుండగా, మరోవైపు తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ సభలో కలకలం సృష్టించారు. బుధవారం ఆయన అసెంబ్లీలోకి వెళ్లి ఎమ్మెల్యేల మధ్య దర్జాగా కూర్చున్నారు. ఈ విషయం బయటకురావడంతో మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ సంగతి తెలుసుకున్న రమేష్ అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోయారు. మీడియాతో మాట్లాడకుండా మెల్లగా జారుకున్నారు.
శాసనసభ వ్యవహారాల మంత్రి శైలజానాథ్ ఈ విషయం గురించి మాట్లాడుతూ.. సీఎం రమేష్ సభలోకి వచ్చి కూర్చొన్న విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఎమ్మెల్యేకాని వారెవరూ సభలోకి వెళ్లడం సరికాదని శైలజానాథ్ అన్నారు.