-
మూడోసారి రెండు భాషల్లో...
‘‘ఇక సమంత సినిమాలకు దూరం. ప్రెగ్నెంట్’ అనే వార్త ఫిల్మ్నగర్లో హల్చల్ చేస్తోంది. సోషల్ మీడియాలోనూ ఇదే ప్రచారం జరుగుతోంది. అయితే తాజా వార్త ఏంటంటే.. సమంత ఓ సినిమాకి సైన్ చేశారట. ‘గేమ్ ఓవర్’ దర్శకుడు అశ్విన్ శరవణన్ చెప్పిన కథ నచ్చి, ఆమె ఈ సినిమా అంగీకరించారట. ఈ చిత్రకథ సమంత చుట్టూ తిరుగుతుందని టాక్. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రంలో ‘జీన్స్’ ఫేమ్ ప్రశాంత్ నటించనున్నారు. ఇదిలా ఉంటే ఈ మధ్య సమంత చేసిన ‘యు టర్న్’, ‘మజిలీ’, ‘ఓ బేబీ’ చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ‘జాను’ ఆశించిన ఫలితం సాధించకపోయినా నటిగా సమంతకు మంచి మార్కులు పడ్డాయి. ఇక ‘యు టర్న్’, ‘ఓ బేబీ’ చిత్రాలతో లేడీ ఓరియంటెడ్ మూవీస్ని నడిపించగలిగే సత్తా సమంతకు ఉందని ప్రూవ్ అయింది. ఇప్పుడు అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో అంగీకరించిన సినిమా కూడా కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమానే అని భోగట్టా. ఇప్పటివరకూ సమంత రెండు ద్విభాషా చిత్రాల్లో చేశారు. ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ ఇటు తెలుగు అటు తమిళంలో ఒకేసారి రూపొందింది. అలాగే 2018లో వచ్చిన ‘యు టర్న్’ తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన విషయం గుర్తుండే ఉంటుంది. ముచ్చటగా మూడోసారి ద్విభాషా చిత్రం చేయనున్నారామె. వచ్చే నెల ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ని ఆరంభించాలనుకుంటున్నారట. -
అంతకు మించి
నటిగా పదేళ్లు పూర్తి చేసుకున్నారు సమంత. కమర్షియల్ సినిమాలు, లేడీ ఓరియంటెడ్ సినిమాలు, కామెడీ, లవ్ స్టోరీలు.. ఇలా అన్ని జానర్లలో ఆడియన్స్కి వినోదం పంచారామె. కానీ పూర్తి స్థాయి హారర్ సినిమాలో కనిపించలేదు సమంత. తాజాగా అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో సమంత ఓ సినిమా అంగీకరించిన సంగతి తెలిసిందే. ఇది హారర్ సినిమా అని సమాచారం. తమిళ నటుడు, స్నేహ భర్త ప్రసన్న ఇందులో కీలక పాత్ర చేస్తున్నారట. ‘‘ఇది కేవలం హారర్ సినిమా మాత్రమే కాదు, అంతకు మించి’’ అని పేర్కొన్నారు సమంత. మార్చి నెలలో చిత్రీకరణ ప్రారంభం కానున్న ఈ సినిమాను ఈ ఏడాది చివరి కల్లా పూర్తి చేస్తారట. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. -
మరో లేడీ ఓరియంటెడ్ మూవీలో..
‘జాను’ తర్వాత సమంత ఏ సినిమా చేయబోతున్నారు? అంటే తెలుగు విషయంలో క్లారిటీ లేదు. ఎన్టీఆర్–త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందనున్న చిత్రంలో నటించనున్నారని టాక్. ఇక తమిళం విషయానికొస్తే.. ‘కాదు వాక్కుల రెండు కాదల్’ అనే సినిమా అంగీకరించారు. తాజాగా ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కోలీవుడ్ టాక్. ‘మాయ’ (2017), ‘గేమ్ఓవర్’ (2019) వంటి చిత్రాలు తెరకెక్కించిన అశ్విన్ శరవణన్ ఈ సినిమాని తెరకెక్కించనున్నారట. సమంత చేసిన ‘యు టర్న్’, ‘ఓ బేబి’ వంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలు తెలుగులో మంచి హిట్ అయ్యాయి. ఇప్పుడు తమిళంలోనూ ఆ మేజిక్ని రిపీట్ చేస్తారని ఊహించవచ్చు. -
థ్రిల్ చేస్తారా?
‘ఓ బేబీ’ సూపర్ సక్సెస్ తర్వాత ‘96’ తెలుగు రీమేక్లో నటించారు సమంత. శర్వానంద్, సమంత జంటగా ఈ సినిమా తెరకెక్కింది. ‘ఓ బేబీ’ తర్వాత ఇప్పుడు మరో లేడీ ఓరియంటెడ్ సినిమాలో కనిపించడానికి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. తమిళ దర్శకుడు అశ్విన్ శరవణన్ డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కనుందట. నయనతారతో ‘మాయ’, తాప్సీతో ‘గేమ్ ఓవర్’ వంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలు తెరకెక్కించారు అశ్విన్ శరవణన్. ఈ రెండు సినిమాలు థ్రిల్లర్ బ్యాక్డ్రాప్లో సాగాయి. మరి సమంత నటించబోయే సినిమా కూడా థ్రిల్లర్ జానర్లోనే ఉంటుందా? చూడాలి. సమంతకు తెలుగు, తమిళంలో మంచి మార్కెట్ ఉంది కాబట్టి ఇది ద్విభాషా చిత్రంగానూ రూపొందే అవకాశముంది. సమంత తొలి లేడీ ఓరియంటెడ్ సినిమా ‘యు టర్న్’ కూడా థ్రిల్లరే. ఇదిలా ఉంటే ప్రస్తుతం వెబ్ సిరీస్ ‘ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2 చిత్రీకరణలో పాల్గొంటున్నారు సమంత. ఈ సిరీస్తో వెబ్ వరల్డ్లోకి అడుగుపెడుతున్నారామె. -
మా బాధ్యత పెరిగింది
‘‘గేమ్ ఓవర్’ విజయంతో మా సంస్థపై బాధ్యత మరింతగా పెరిగింది. మా సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ విజయం వారిదే’’ అని నిర్మాతలు ఎస్.శశికాంత్, చక్రవర్తి రామచంద్ర అన్నారు. తాప్సి లీడ్ రోల్లో అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ ఓవర్’. తెలుగు, తమిళ చిత్రాల నిర్మాణ సంస్థ ‘వై నాట్ స్టూడియోస్’ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదలైంది. ఎస్.శశికాంత్, చక్రవర్తి రామచంద్ర మాట్లాడుతూ– ‘‘మా సంస్థ గతంలో తెలుగులో నిర్మించిన ‘లవ్ ఫెయిల్యూర్, గురు’ చిత్రాల విజయాల సరసన ‘గేమ్ ఓవర్’ నిలిచింది. మూడు భాషల్లో సినిమా విజయం సాధించింది. విజయోత్సవ వేడుకలు ఒకేచోట నిర్వహించనున్నాం’’ అన్నారు. ‘‘గేమ్ ఓవర్’ ప్రేక్షకులకు ఓ సరికొత్త థ్రిల్లింగ్ను కలిగిస్తుందని విడుదలకు ముందు చెప్పాను.. ఇప్పుడు ఆ మాట నిజమైంది’’ అన్నారు తాప్సీ. ‘‘గేమ్ ఓవర్’ సినిమా తెలుగులో నాకు ఎంతో కీర్తిని తెచ్చిపెట్టింది’’ అని అశ్విన్ శరవణన్ అన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement