breaking news
anti-Sikh riots
-
'సిక్కుల ఊచకోత జరిగేది కాదు'
న్యూఢిల్లీ : ఐకే గుజ్రాల్ సలహా నాటి కేంద్ర హోం మంత్రి పీవీ నరసింహారావు విని ఉంటే, 1984 నాటి సిక్కుల ఊచకోత చోటు చేసుకునేదే కాదని మాజీ ప్రధాని మన్మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్ సంస్మరణ సభలో గురువారం మన్మోహన్ మాట్లాడారు. ‘1984లో ఆ విషాదకర సంఘటన జరిగిన రోజే.. గుజ్రాల్నాటి హోంమంత్రి పీవీ నరసింహారావు వద్దకు వెళ్లారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉందని, తక్షణమే ఆర్మీని మోహరిస్తే మంచిదని పీవీకి సలహా ఇచ్చారు. ఆ సలహాను పీవీ పాటించి ఉంటే, సిక్కుల ఊచకోత జరిగి ఉండేది కాదు’ అని మన్మోహన్ వ్యాఖ్యానించారు. మన్మోహన్ వ్యాఖ్యలపై బీజేపీ స్పందిస్తూ.. అంత చెడ్డవాడైన పీవీ కేబినెట్లో ఆరి్థకమంత్రిగా ఎందుకు పనిచేశారని మన్మోహన్ను ప్రశి్నంచింది. ఇప్పటికైనా వాస్తవం బయట పెట్టినందుకు మన్మోహన్కు కృతజ్ఞతలని ఐకే గుజ్రాల్ కుమారుడు అకాలీదళ్ నేత నరేశ్ గుజ్రాల్ వ్యాఖ్యానించారు. ఊచకోత బాధ్యతను రాజీవ్ గాంధీ నుంచి తప్పించేందుకు చేసిన వ్యాఖ్య ఇదని శిరోమణి అకాలిదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ పేర్కొన్నారు. మన్మోహన్ వ్యాఖ్యలపై స్పందించేందుకు కాంగ్రెస్ నిరాకరించింది. -
సిక్కుల ఊచకోతపై రాహుల్ విస్మయకర వ్యాఖ్యలు
-
‘ఆ కుటుంబాలకు బీజేపీ న్యాయం చేస్తుంది’
వాషింగ్టన్: సిక్కు వ్యతిరేక అల్లర్లలో నష్టపోయిన సిక్కు కుటుంబాలకు బీజేపీ ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్ తెలిపారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో సిక్కు అమెరికన్లు నిర్వహించిన సిక్కుల సాంప్రదాయ పండుగ వైశాఖిలో రాంమాధవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అమెరికాలో నివాసముంటున్న సిక్కులు భారీ సంఖ్యలో హాజరైయారు. కార్యక్రమంలో రాంమాధవ్ మాట్లాడుతూ...1984లో కాంగ్రెస్ పార్టీ పాలనలో జరిగిన సిక్కుల ఉచకోతలో చాలా మంది సిక్కులు మరణించారని, వారి కుటుంబానికి బీజేపీ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీయిచ్చారు. సిక్కు వ్యతిరేక అల్లర్లకు కారకులైన వారందరికి శిక్ష పడుతుందన్నారు. సిక్కు అల్లర్లపై ప్రభుత్వం నియమించిన జస్టిస్ ధింగ్రా కమిటీ అనేక అభియోగాలు నమోదు చేసిందని, సిక్కులపై 186కు పైగా దాడులు జరిగాయని గుర్తుచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక సందేశము ద్వారా వైశాఖి పండుగను నిర్వహిస్తున్న వారందరికి అభినందనలు తెలిపారు. వైశాఖి సిక్కు సాంప్రదాయం, సిక్కు సమాజపు సంస్కృతి, విలువలను పెంచుతుందని పేర్కొన్నారు. ఇండో-అమెరికన్లు భారత్, అమెరికా మధ్య సంబంధాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారని రాంమాధవ్ ప్రశంసించారు. -
సిక్కుల ఊచకోత : కన్నీటి జ్ఞాపకాలు
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్యానంతరం దేశవ్యాప్తంగా సిక్కుల ఊచకోతకు గురయ్యారు. వేల సంఖ్యలో అమాయక సిక్కులు అసువులు బాసారు. 33 ఏళ్ల నాటి విషాద పరిస్థితులు.. ఆనాటి జ్ఞాపకాలు బాధితుల కళ్ల ముందు ఇంకా కదలాడుతూనే ఉన్నాయి. ఇందిర హత్యానంతర పరిస్థితులకు ప్రత్యక్ష సాక్షి అయిన అత్తార్ కౌర్... కన్నీటి గాథ ఇది. సిక్కు వ్యతిరేక అల్లర్లలో అత్తార్ కౌర్ భర్తతో సహా 11 మంది కుటుంబ సభ్యులను కోల్పొయి దీనావస్థలొకి వెళ్లిపోయింది. ఆనాటి పరిస్థితులపై అత్తార్ కౌర్ పంజాబ్లోని ఒక న్యూస్ ఛానల్తో మాట్లాడారు. మారణహోమానికి 33 ఏళ్లు నాటి ప్రధాని ఇందిరాగాంధీని సిక్కు బాడీగార్డులు హత్య చేయడంతో.. ఒక్క సారిగా దేశమంతా సిక్కు వ్యతిరేకత అల్లర్లు చెలరేగాయి. ప్రధానంగా ఢిల్లీ, హర్యానా, పంజాబ్ ప్రాంతాల్లో మరీ ఎక్కువగా జరిగాయి. దేశంలోని ఇతర ప్రాంతాల కంటే అధికంగా ఢిల్లీలోనే మారణహోమం అధికంగా జరిగింది. అల్లరి మూకలు అత్యంత దారుణంగా 3 వేల మంది సిక్కులను ఊచకోత కోశాయి. ఈ మారణహోమానికి నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న సజ్జన్ కుమార్ కారకుడని సీబీఐ ఢిల్లీ సెషన్స్ కోర్టుకు తెలిపింది. చితికిన కుటుంబం అత్తార్ కౌర్ నాటి తూర్పు ఢిల్లీలోని త్రిలోకపురిలో భర్త, పిల్లలతో కలిసి నివాసముండేది. ఇందిర హత్యానంతరం అల్లరి మూకలు సిక్కులు అధికంగా నివసించే ప్రాంతాలపై దాడులకు దిగాయి. అత్తార్ కౌర్ భర్త కృపాల్ సింగ్ అక్కడే చిన్నచిన్ని వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాన్ని పొషించేవాడు. కళ్లముందే దారుణం కృపాల్ సింగ్ వ్యాపార పనుల రీత్యా అప్పుడే గురుద్వారాకు వెళ్లారు. ఇంటి బయట.. 7 మంది చిన్నారులు, స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నారు. ఇంటి బయట అత్త, మామ ఉన్నారని అత్తర్ కౌర్ తెలిపారు. సరిగ్గా అదే సమయంలో అటుగా వచ్చిన అల్లరి మూకలు.. ఆడుకుంటున్న చిన్నారులను, బయ ఉన్న పెద్దవారిని అత్యంత పాశవికంగా హత్య చేశాయని ఆమె చెప్పారు. తన రెండు నెలల పసిబిడ్డతో సహా, 6 మంది పిల్లలను, భర్త, అత్తమామలసహా 11 మంది కుటుంబ సభ్యులను అల్లరి మూకలు పొట్టన పెట్టుకున్నాయని ఆమె ఆవేదనగా తెలిపారు. సజీవ దహనం జంతువులును వేటాడినట్టు అల్లరి మూకలు సిక్కులను వెంటాడి వేటాడి చంపాయని అత్తార్ కౌర్ కన్నీరు పెట్టుకుంటూ తెలిపారు. కొద్దిమందిని దారుణంగా హింసించి.. సజీవ దహనం చేసిన ఘటనలు ఉన్నాయని కౌర్ తెలిపారు. ముస్లింల సాయం అల్లరి మూకలు మరింత దారుణాలకు ఒడిగడుతున్న సమయంలో మాకు పక్కనే ఉన్న ఒక ముస్లిం కుటుంబం.. మిగిలిన ముగ్గురు పిల్లలను, నాకు వారి ఇంట్లో రక్షణ కల్పించారని ఆమె తెలిపారు. సాయంత్రం ట్రిపోలి రహదారి పక్కన పిల్లల మృత దేహాలు, దహనమైన అత్త, మామలు, భర్త శరీరాలను చూశానని ఆమె హృదయ విదారకంగా తెలిపారు. ఇందిరా హత్యానంతర పరిస్థితులు గుర్తుకు వస్తే.. ఇప్పటికీ ఒళ్లు జలదరిస్తుందని ఆమె చెప్పారు. -
నేరమే అధికారమై ప్రజలను వేటాడుతున్న చోట...!
అవలోకనం సామూహిక హింసాత్మక ఘటనలకు సంబంధించి న్యాయం జరగకపోవడానికి ఒక కారణం ఏమిటంటే, వాటిలో పాలుపంచుకున్న లేదా అందుకు పురికొల్పిన వారిని అంటే తన సొంత మనుషులను విచారించడంలో అధికారంలో ఉన్న పార్టీ ఎలాంటి ఆసక్తి చూపకపోవడమే. ఢిల్లీలో సిక్కుల ఊచకోత, భోపాల్ విషవాయువు లీక్, బాబ్రీ మసీదు కూల్చివేత అనంతర మత ఘర్షణలు, గుజరాత్ మారణకాండ వంటి ఘటనల్లో బాధితులు నేటికీ తగిన న్యాయాన్ని పొందలేకపోవడానికి ఇదే కారణం. మన సామూహిక జాతీయ విషాదాలు అనేకం కాబట్టి, వాటిని లెక్కిం చడం కూడా కష్టమే అవుతుంది. నేను 40ల మధ్య వయసులో ఉన్నాను. వేలాదిమంది హత్యకు దారితీసిన కనీసం అయిదు ఘటనలు కలుగ జేసిన గాయాలు నాకు వ్యక్తిగతంగా కూడా గుర్తున్నాయి. ఈ మారణ కాండలు ఏవంటే , 2 వేలమంది ముస్లింలను చంపిన 1983 నాటి నెల్లి హత్యాకాండ, 1984 డిసెంబర్లో 3 వేలమంది మరణాలకు దారితీసిన భోపాల్ విషవాయు ప్రమాదం. తర్వాత అదే నెలలో ఢిల్లీలో 2 వేల మంది సిక్కుల ఊచకోతకు దారితీసిన ఇందిరాగాంధీ హత్యానంతర దాడులు, బాబ్రీమసీదును కూల్చివేసిన అనంతరం 1992లో దేశ వ్యాప్తంగా వేలాదిమంది హత్యకు దారితీసిన ఘటనలు (ఆనాటికి నేను 20లలో ఉండేవాడిని, నా చుట్టూ ఏం జరుగుతోందో నాకు పూర్తిగా బోధపడేది). తర్వాత 2002లో గుజరాత్లో కనీసం వెయ్యిమంది హత్యకు దారితీసిన హింసాత్మక దాడులు. దేశంలో జరిగిన మరికొన్ని ప్రధాన ఘటనలను వదిలిపెట్టాననడంలో సందే హమే లేదు. బోటు ప్రమాదాల్లో వందలాదిమంది ప్రాణాలు కోల్పోయిన ఘట నలు జరిగాయి. మరోవైపున ప్రకృతి వైపరీత్యాలలో వేలాదిమంది చనిపోతున్నా, ప్రభుత్వాలు తమ పౌరులకు ఎలాంటి సహకారం అందించలేని పరిస్థితిలో ఉండేవి. నేనిక్కడ వేలాది కశ్మీరీల హత్య గురించి, పండిట్ల వలస గురించి పొందుపర్చడం లేదు. ఎందుకంటే, ఇవి ఒక ఘటనలో కాకుండా నెలలు లేదా సంవత్సరాల పరిణామ క్రమంలో జరుగుతూ వచ్చాయి. ఇక్కడ నేను పొందుపర్చిన హింసాత్మక సందర్భాల్లో బాధితులకు న్యాయం అనేది అంత సులభంగా దక్కలేదు. వీటిలో ఒక్కటంటే ఒక్క ఘటన ఫలితాలను, వాటి పర్యవసానాలను పరిశీలించినట్లయితే ఒక జాతిగా మనం పూర్తిగా పతన మైన విషయం కొట్టొచ్చినట్లు కనబడుతుంది. వీటిని నిష్పక్షపాత దృష్టితో మనం చూసినట్లయితే, తీవ్రనేరాలకు పాల్పడిన వారిపై తగిన విధంగా దర్యాప్తు చేసి, వారిని జవాబుదారులను చేయడంలో మన వైఫల్యం స్పష్టమవుతుంది. మన దేశంలో జరుగుతున్న సామూహిక హింసాత్మక ఘటనలకు సంబం ధించి న్యాయం జరగకపోవడానికి ఒక కారణం ఏమిటంటే, హింసా ఘటనల్లో పాలుపంచుకున్న లేదా అందుకు పురికొల్పిన వారిని అంటే తన సొంత ప్రజలను విచారించడంలో అధికారంలో ఉన్న పార్టీ ఎలాంటి ఆసక్తి చూపకపోవడమే. ఉదాహరణకు, పై ఘటనల్లో చివర పేర్కొన్న గుజరాత్ హింసాకాండకు సంబం ధించి తగిన న్యాయాన్ని పొందలేకపోవడానికి ఇదే కారణం. ఈ ఉదాహరణను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, ఆ ఘటన గురించి నాకు బాగా తెలుసు. పైగా గుజరాత్ హింసాకాండకు చెందిన కొన్ని అంశాలను పరిశీలించడానికి భారత సంపాదక మండలి పంపిన త్రిసభ్య కమిటీలో నేనూ భాగం పంచుకున్నాను. ఢిల్లీలో 1984లో సిక్కుల హత్యాకాండపై దృఢవైఖరితో వ్యవహరించడం ద్వారా ఈ నిరాశా నిస్పృహల వలయాన్ని ఛేదించడానికి నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి అవకాశం ఉంది. సిక్కుల ఊచకోత ఘట నలో పాలుపంచుకున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన దుండుగులను ఉద్దేశపూర్వకంగా కాపాడుతూ వచ్చారని బీజేపీ చాలాకాలంగా ఆరోపిస్తోంది. కేంద్రంలో అధికారం చేపట్టాక, ఎన్డీయే కూటమి ప్రభుత్వం దీనిపై ఒక కమిటీని నియమించింది. ఢిల్లీలో హింసాకాండ సందర్భంగా జరిగిన దాడులపై తగిన విధంగా దర్యాప్తు జరగలేదని, దర్యాప్తు రూపాన్ని మార్చేందుకోసం ఒక కపట ప్రయత్నం చేశారని ఈ కమిటీ కనుగొంది. దీంతో ఇంతవరకు పరిశోధన జరగని కేసుల్లో తాజా ఎఫ్ఐఆర్ నివేదికలు, నేరారోపణలను నమోదు చేయడానికి ఎన్టీయే ప్రభుత్వం ఒక త్రిసభ్య బృందాన్ని ఏర్పర్చింది. మూడు దశాబ్దాల క్రితం ఊచకోతకు గురైన బాధిత కుటుంబాలకు న్యాయం అందించే విషయంలో ఈ బృందం నిర్ణయాత్మకంగా, దృఢంగా, శరవేగంగా స్పందిస్తుందని నేను ఆశించాను. ఢిల్లీ హత్యాకాండకు సంబంధించిన కేసులు చాలా పాతబడిపోయాయని, వాటిని పునరుద్ధరించడం చాలా కష్టమని పలువురు భావిస్తున్నప్పుడు, ఢిల్లీ హింసాకాండ బాధ్యులను శిక్షించినట్లయితే, భారతీయుల రక్తాన్ని చిందిస్తున్న వారు శిక్ష నుంచి తప్పించుకోవడం కష్టమని మనలో చాలా మందికి అది కాస్త నమ్మకాన్నిచ్చి ఉండేది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఈ కమిటీని నియమించారు. ఐపీఎస్ అధికారి ప్రమోద్ అస్థానా నేతృత్వంలో ఏర్పాటైన ఈ ప్రత్యేక బృందంలో మరొక పోలీసు అధికారి కుమార్ గ్యానేష్, రిటైర్డ్ సెషన్స్ న్యాయమూర్తి రాకేష్ కపూర్ సభ్యులుగా ఉన్నారు. ఈ హత్యాకాండకు సంబంధించి ఢిల్లీ పోలీసులు నిర్లక్ష్యం చేసిన లేదా తగిన విధంగా పరిశీలించని సాక్ష్యాధారాల పరిశీలనకోసం ప్రభుత్వం ఈ ముగ్గురికీ ఆరునెలల సమయాన్ని ఇచ్చింది. ఆరు నెలల తర్వాత అంతవరకు వారేం చేశారన్న విషయాన్ని నిర్ధారించుకోకుండానే కమిటీ విచారణను మరికొంత కాలం పొడిగించింది. కొన్ని వారాల క్రితం నాటి కారవాన్ సంచికలోని ఒక నివేదిక ఈ అంశాన్ని ప్రస్తావించి, ఈ బృందం సాధించిందేమీ లేదని తేల్చేసింది. ఢిల్లీ మారణకాండ బాధితులకు, వారి కుటుంబాలకు ప్రాతినిధ్యం వహి స్తున్న న్యాయవాది హెచ్ఎస్ ఫోల్కా చెప్పిన మాటలను ఆ పత్రిక ఉటంకించింది. ఆయనిలా అన్నారు. ‘‘సిట్ను ప్రభుత్వం ఏర్పర్చినప్పుడు దాన్నుంచి చాలా ఆశించాం. కానీ వీరు ఈ కేసుకు సంబంధించిన ఏ అంశంపైనా అడుగు ముందు కేసింది లేదు. ఆ హత్యాకాండ బాధితుల్లో ఏ ఒక్కరినీ వీరు కలిసిన పాపాన పోలేదు. బాధితుల్లో ఒకరు ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఒక ఫిర్యాదు పంపి నప్పుడు, ఏ వ్యాఖ్య చేయకుండానే దాన్ని వెనక్కి పంపించారు. కనీసం ఆ ఫిర్యాదును వారు అంగీకరించలేదు.’’ వాస్తవానికి సిట్ ఏర్పాటే ఒక మాయ అని, దాన్నుంచి దేన్నీ కోరుకోకుండా, ఆశించకుండా, కేవలం తాము సిట్ను ఏర్పర్చామన్న పేరు కొట్టేయాలన్నదే ప్రభుత్వ అభిమతమని ఆ లాయర్ పేర్కొన్నారు. ఇది నిజం కాదనే నేను భావిస్తున్నాను. సిక్కులపై హింసాకాండను నిరోధించడంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థత విషయంలో సందేహమే లేదు. ఆ పార్టీకి చెందినవారే స్వయంగా నాటి మారణకాండలో పాల్గొన్నారంటూ వారిపై తీవ్ర నేరారోపణలు కూడా ఉన్నాయి. ఇలాంటి నేరస్తులపై దృఢంగానూ, నిర్ణయాత్మకంగానూ వ్యవహరిస్తున్నట్లు ప్రభుత్వం తన వైఖరిని ప్రదర్శిస్తే, భారతీయులకు అది గొప్ప సేవ చేసినట్లే. కనీసం ఈ ఒక్క మారణకాండకు సంబంధించినంతవరకయినా న్యాయం సాధ్యమేనని ప్రభుత్వ దృఢవైఖరి సూచిస్తే అదే చాలు. వ్యాసకర్త కాలమిస్టు, రచయిత: ఆకార్ పటేల్ aakar.patel@icloud.com