-
సినిమా తీసిన 5వ తరగతి విద్యార్థిని.. త్వరలోనే రిలీజ్!
అద్భుతాలకు నిలయం ఈ ఆధునిక కాలం. అదేవిధంగా ప్రతిభ ఏ ఒక్కరి సొత్తూ కాదు. అలా 5వ తరగతి చదువుతున్న 12 ఏళ్ల విద్యార్థిని గూండాన్ చట్టి అనే యానిమేషన్ చిత్రాన్ని తెరకెక్కించింది. ఈ చిన్నారి పేరు పీకే అగస్త్యి. ఈ వయసులోనే తనకు కలిగిన ఆలోచనతో సినిమా తీస్తానని తన తండ్రి డాక్టర్ ఎస్కే.కార్తికేయన్కు చెప్పగా ఆయన ఈ వయసులో చిత్రం ఏమిటి, దర్శకత్వం ఏమిటి అని నిరాశపరచకుండా తన కూతురి ఆలోచనను గౌరవించి, ఆ చిన్నారిని ప్రోత్సహించారు. అలా ఆమె దర్శకత్వంలో నిర్మించిన చిత్రం గూండాన్ చట్టి. గ్రామీణ నేపథ్యంలో అగస్త్యి రూపొందించిన ఈ యానిమేషన్ చిత్రం పలువురు సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలను అందుకుంటోంది. ఒక గ్రామంలోని ఇద్దరు స్నేహితులకు ఒకేసారి పుట్టిన పిల్లలు ఆ గ్రామంలో జరుగుతున్న అక్రమాలను ఎలా అరికట్టారు? అనే చక్కని సందేశానికి వినోదాన్ని చేర్చి జనరంజకంగా రూపొందించిన చిత్రం ఇది. అగస్త్యి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ చిత్రంలో 3 మంచి పాటలున్నాయి. ఒక విద్యార్థిని తెరకెక్కించిన ఈ చిత్రాన్ని రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ప్రదర్శించే విధంగా నిర్మాత చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. ఇది విద్యార్థుల వికాసాన్ని పెంపొందించే చిత్రంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రానికి అమర్గీత్ సంగీతాన్ని అందించారు. కథనం, మాటలు, పాటలు, దర్శకత్వ సహకార బాధ్యతలను చిన్నతంబి నిర్వహించారు. కాగా గూండాన్ చట్టి చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. చదవండి: అమ్మ కోసం అన్ని వదిలేసి.. దుకాణం నడుపుతూ.. ఇప్పుడు స్టార్ హీరోలతో! -
చైనాలో డౌటే
ఇంటికొకరు సైన్యంలో చేరాలని చైనా చక్రవర్తి ప్రకటించాడు. ఒక ఇంట్లో జబ్బున పడి ఉన్న తండ్రి తరఫున ఆయన కూతురు మారువేషం వేసుకుని సైన్యంలో చేరింది! శత్రు సైన్యాలతో పోరాడి చైనాసైన్యం సత్తాను చాటింది. ఆమె పేరు హ్వా మ్యులన్. చైనా జానపద కథ ఇది. డిస్నీ వాళ్లు ఇరవై రెండేళ్ల క్రితమే ముల్యన్ పాత్రతో ఓ యానిమేషన్ సినిమా తీశారు. ఇప్పుడు ఆ పాత్ర పేరుతోనే ‘మ్యులన్’ అనే హాలీవుడ్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. సిద్ధంగా అయితే ఉంది కానీ, చైనాలో విడుదలే డౌట్గా ఉంది. ఒకవేళ విడుదలైనా సుమారు 15 వందల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ సినిమా అంత పెద్ద మొత్తాన్ని వసూలు చేయగలదా అని నిర్మాతలు సంశయంలో పడ్డారు. కరోనా వైరస్ కారణంగా ‘మ్యులన్’ చిత్రానికి ఎదురైన అవరోధం ఇది. మార్చి 27న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. అయితే కరోనా వ్యాప్తి కారణంగా చైనాలో 70 వేలకు పైగా థియేటర్లు ఇప్పటికే మూత పడ్డాయి. వైరస్ తగ్గుముఖం పట్టి పరిస్థితులు పూర్తిగా మెరుగైతే మార్చి 27 లోపు థియేటర్లన్నిటినీ తెరిచేందుకు అనుమతిస్తాం అని చైనా అంటోంది. అనుమతించినప్పటికీ ఎంతమంది ప్రేక్షకులు ధైర్యం చేసి థియేటర్లకు వస్తారన్న ఆందోళనలో నిర్మాతలు ఉన్నారు. ఆ రోజుకీ కరోనా ప్రభావం తగ్గకుండా ఉంటే ఈ చిత్రానికి చైనాలో భారీ నష్టం సంభవించవచ్చు. ఇందులో ఎవరైనా చేయగలిగిందేమీ లేదు. కరోనాపై పోరాడేందుకు మ్యులన్ లాంటి శక్తిమంతమైన యోధురాలైన ఔషధాన్ని ఎవరైనా సృష్టించాలి. -
కల నెరవేరింది
తమిళ ప్రఖ్యాత నవల ‘పొన్నియిన్ సెల్వన్’ని సినిమాగా తీసుకురావాలన్నది దివంగత నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి యంజీఆర్ (యంజీ రామచంద్రన్) కల. ఈ నవలను సినిమాగా తీయాలని పలుమార్లు ప్రయత్నించినప్పటికీ కుదర్లేదు. ఇప్పుడు యంజీఆర్ను యానిమేషన్ రూపంలో ‘పొన్నియిన్ సెల్వన్’ రూపొందిస్తోంది చెన్నైకు సంబంధించిన శనీశ్వరన్ యానిమేషన్ స్టూడియో ఇంటర్నేషనల్. ఈ సంస్థే నిర్మాణాన్ని కూడా చూసుకుంటోంది. ‘వందియదేవన్: పొన్నియిన్ సెల్వన్ 1’ పేరుతో ఈ భారీ బడ్జెట్ యానిమేషన్ చిత్రాన్ని దర్శకుడు దవచెల్వాన్ తెరకెక్కిస్తున్నారు. నాలుగేళ్లుగా ఈ సినిమాపై వర్క్ చేస్తోందట ఈ యానిమేషన్ స్టూడియో. ఇటీవల యంజీఆర్ జయంతి సందర్భంగా ఈ సినిమాలో తొలి పాటను విడుదల చేశారు. విశేషం ఏంటంటే ఈ సినిమాలో హీరోయిన్గా జయలలిత పాత్ర ఉండబోతోందట. ఆమె పాత్ర కూడా యానిమేషన్లోనే ఉంటుంది. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఈ సంగతి అలా ఉంచితే ‘పొన్నియిన్ సెల్వన్’ నవల ఆధారంగా దర్శకుడు మణిరత్నం ప్రస్తుతం ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇందులో కార్తీ, ‘జయం’ రవి, ఐశ్వర్యా రాయ్, త్రిష ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. -
ఎల్సా పాత్రతో నాకు పోలికలున్నాయి
‘‘ఫ్రోజెన్’ సినిమా చూసిన నా ఫ్రెండ్ ఒకామె ’ఆ సినిమా చూసినప్పుడు నువ్వే గుర్తొచ్చావు’ అని చెప్పింది. నాకూ ఎల్సా పాత్రకు పర్సనాలిటీ విషయంలో ఎక్కడో పోలికలున్నాయని సినిమా చూశాక అనిపించింది’’ అని నటి నిత్యామీనన్ అన్నారు. డిస్నీ సంస్థ అందిస్తున్న తాజా యానిమేషన్చిత్రం ‘ఫ్రోజెన్ 2’. ఎల్సా, అన్న అనే అక్కా చెల్లెళ్ల కథ ఇది. నవంబర్ 22న ఈ సినిమా తెలుగులో విడుదలకానుంది. తెలుగు వెర్షన్లో ఎల్సా పాత్రకు నిత్యామీనన్, ఎల్సా చిన్ననాటి పాత్రకు మహేశ్ బాబు కుమార్తె సితార డబ్బింగ్ చెప్పారు. ఈ సందర్భంగా నిత్యామీనన్ మాట్లాడుతూ– ‘‘ఎల్సా పాత్రతో చాలా కనెక్ట్ అయ్యాను. అందుకే.. ‘ఫ్రోజెన్ 2’లో ఎల్సాకు డబ్బింగ్ చెప్పమనగానే ఓకే అన్నాను. మరోసారి డబ్బింగ్ చెప్పమని అడిగినా చెబుతాను (నవ్వుతూ)’’ అన్నారు. ‘‘డబ్బింగ్ చెప్పడం చాలా సరదాగా అనిపించింది. నాన్న సర్ప్రైజ్గా ఫీలయ్యారు. నా ఫేవరెట్ కార్టూన్ పాత్ర ఎల్సానే’’ అని సితార అన్నారు. ‘‘సితారతో డబ్బింగ్ చెప్పించమని డిస్నీ శివప్రసాద్గారు మహేశ్ని, నన్ను కన్విన్స్ చేశారు. సితార ఎలా డబ్బింగ్ చెబుతుందో అనుకున్నాను.. బాగా చెప్పింది. 3 ఏళ్ల నుంచి ఎల్సా పాత్రకు తను పెద్ద ఫ్యాన్. సితారను సినిమాల్లోకి తీసుకురావాలని ఇదేం స్ట్రాటజీ కాదు. గౌతమ్, సితార కెరీర్ని ఇంకా ఏం ప్లాన్ చేయలేదు. వాళ్లు ఏం ఎంచుకున్నా సపోర్టివ్గా నిలబడతాం’’అన్నారు నమ్రతా శిరోద్కర్. ‘‘2013లో ‘ఫ్రోజెన్’ చిత్రం రిలీజ్ అయింది. యానిమేషన్ సినిమాల కలెక్షన్లలో టాప్గా నిలిచింది’’ అన్నారు డిస్నీ ప్రతినిధి విక్రమ్ దుగ్గల్. -
బుజ్జి బుజ్జి మాటలు
మహేశ్బాబు ముద్దుల కుమార్తె సితార సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టనున్నారు. అయితే అది ఆన్స్క్రీన్ ఎంట్రీ కాదు ఆఫ్స్క్రీన్ ఎంట్రీ. తెరపై కనిపించే పాత్ర కాదు. వినిపించే పాత్ర. హాలీవుడ్ యానిమేషన్ మూవీ ‘ఫ్రోజెన్ 2’. అన్నా, ఎల్సా అనే అక్కాచెల్లెళ్ల కథాంశంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో ఎల్సా చిన్ననాటి పాత్రకు సితార డబ్బింగ్ చెప్పనున్నారు. తన బుజ్జిబిజ్జి మాటలతో ఎల్సా పాత్రకు డబ్బింగ్ చెబు తారట. ఎల్సా ఎంగేజ్ పాత్రకు నిత్యా మీనన్ డబ్బింగ్ చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ నెల 22న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఆల్రెడీ యూట్యూబ్లో ఓ చానెల్లో ఎప్పటికప్పుడు వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటారు సితార. మరి భవిష్యత్తులో సినిమాల్లోకి వచ్చే ఆసక్తి ఉందా? వేచి చూడాలి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్కు స్కాట్లాండ్ జట్టు ప్రకటన..
పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. ఫోటోలు వైర్
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement