breaking news
Ananta udayabhaskar
-
ఎమ్మెల్సీ అనంతబాబుకు మధ్యంతర బెయిల్
ఢిల్లీ:డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ మంజూరైంది. అనంతబాబుకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అనంతబాబు.. మే నెలాఖరు నుంచి రిమాండ్లో ఉన్న సంగతి తెలిసిందే. -
AP: ఎమ్మెల్సీగా అనంత ఉదయభాస్కర్ ప్రమాణస్వీకారం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఎమ్మెల్సీగా అనంత ఉదయభాస్కర్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంత ఉదయ భాస్కర్ చేత శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు శుక్రవారం ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తనకు శాసనమండలి సభ్యునిగా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. పార్టిలో కష్టపడి పనిచేసిన ప్రతిఒక్కరికి గుర్తింపు ఉంటుందని చెప్పడానికి తనకు మండలి సభ్యత్వం ఇవ్వడమే నిదర్శనమని అన్నారు. పార్టీ కోసం కష్టపడ్డవారికి సముచిత స్ధానం కల్పించే వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు. సీఎం జగన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని తెలిపారు. అనంతరం మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ.. అనంతకు ఎమ్మెల్సీ ఇవ్వడంతో తూర్పు గోదావరి జిల్లాలో వైఎస్సార్సీపీ మరింత బలపడుతుందని అన్నారు. కష్టానికి నష్టానికి ఓర్చుకున్న వ్యక్తి అనంత ఉదయ భాస్కర్ తెలిపారు. సీఎం జగన్ అనంతకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని గుర్తుచేశారు. -
ఎంపీ గీత అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి
- ఎమ్మెల్యే వంతల, వైఎస్సార్ సీపీ నేత అనంతబాబు డిమాండ్ - ఆమెది ఆది నుంచీ నేరచరిత్రేనని ఆరోపణ రంపచోడవరం : అరకు ఎంపీ కొత్తపల్లి గీత అక్రమాలపై సీబీఐ విచారణ నిర్వహించాలని రంపచోడవరం ఎమ్మెల్యే వంతలరాజేశ్వరి, వైఎస్సార్ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు అనంత ఉదయభాస్కర్ (బాబు) డిమాండ్ చేశారు. ఇందుకోసం హైకోర్టులో కూడా వ్యా జ్యం వేస్తామన్నారు. గురువారం వారు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ గీత నకిలీ పత్రాలతో పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసి రుణం పొందారని, తన కుల ధృవీకరణ పత్రాల విషయంలో కూడా నకిలీ పత్రాలనే సమర్పించి అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. 1993లో అప్పటి జాయింట్ కలెక్టర్ ఆమె కులధృవీకరణ పత్రాన్ని రద్దు పరుస్తూ, ఆమె గిరిజనురాలు కాదని, క్రిస్టియన్ బీసీ ‘బి’ కేటగిరీగా ప్రకటించారన్నారు. అప్పట్లో ఈ విషయమై హైకోర్టుకు వెళ్లగా పునర్విచారణకు ఆదేశించారన్నారు. అది పరిశీలనలో ఉన్న సమయంలోనే ఆమె అడ్డతీగల తహశీల్దార్ కార్యాలయంలో కులధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేయగా 2.7.2013న తిరస్కరించారన్నారు. తర్వాత అదే తహశీల్దార్, రెవెన్యూ అధికారులు గీతతో కుమ్మక్కై కులధృవీకరణ పత్రం మంజూరు చేశారన్నారు. నిబంధనల ప్రకారం పరిశీలిన కమిటీలో పెండింగ్లో ఉన్నప్పుడు కులధృవీకరణ పత్రాన్ని మంజూరు చేయకూడదన్నారు. ఈ వ్యవహారంలో నిజమైన గిరిజనురాలికి న్యాయం జరగాలంటే గీతకు సహకరించిన రెవెన్యూ అధికారులపైన, పరిశీలన కమిటీలపైన సీబీఐ విచారణ జరపాలన్నారు. గతంలో గీత అనంతపురం డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్నప్పడు భారీ మొత్తంలో సొమ్ము ( సుమారు రూ.50లక్షలు) డ్రా చేసి తన సొంత ఖర్చులకు వాడుకున్నారని, దీనిపై అప్పటి అనంతపురం కలెక్టర్ అనంతపురం పోలీసు స్టేషన్లో క్రిమినల్ కేసు పెట్టారని, ఉద్యోగం నుంచి తొలగించారని చెప్పారు. నేర చరిత్ర కలిగిన గీత మొదటి నుంచీ ఇప్పటి వరకు చేసిన అన్ని అక్రమాలపై సీబీఐ విచారణ చేయాలన్నారు. విలేకరుల సమావేశంలో జెడ్పీటీసీ భారతి, ఎంపీపీ అరగాటి సత్యనారాయణ, మండల కన్వీనర్ మంగరౌతు వీరబాబు, నాయకులు పత్తిగుళ్ల రామాం జనేయులు, వరప్రసాద్, కిశోర్ తదితరులు పాల్గొన్నారు.