breaking news
am admi
-
8AM TO 8PM Shift.. భగ్గుమంటున్న అధ్యాపకులు, విద్యార్థులు
న్యూఢిల్లీ: దేశంలోని విశ్వవిద్యాలయాలు నూతన విద్యా సంవత్సరంలోకి ప్రవేశించడానికి సిద్ధమవుతున్న ప్రస్తుత తరుణంలో, ఢిల్లీ విశ్వవిద్యాలయం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇది సంస్థాగత ప్రాధాన్యతలు, విద్యావేత్తల పని పరిస్థితులపై సాగుతున్న చర్చలను మరింత తీవ్రతరం చేసింది. అలాగే ఈ నిర్ణయం నిర్మాణాత్మక మార్పుల అమలుకు దోహదపడుతుందని, క్యాంపస్లలో విద్యావాతావరణాన్ని ప్రభావితం చేస్తుందని బోధనా సంఘం అభిప్రాయం వ్యక్తం చేస్తోంది.ఢిల్లీ విశ్వవిద్యాలయం తన తాజా ఉత్తర్వులలో వర్శిటీ పరిధిలోని అన్ని కళాశాలలు,అనుబంధ సంస్థలు సాధారణ పని దినాలలో ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల మధ్య పనిచేయాలని అధికారికంగా ఆదేశించింది. జూలై 31న జారీ చేసిన ఈ ఆదేశంలో.. వనరులను ఉత్తమంగా ఉపయోగించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అయితే పని గంటలను పెంచాలనే ఈ ఆదేశం వర్శిటీలోని అన్ని విభాగాల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. జూలై 12న జరిగిన విశ్వవిద్యాలయ కార్యనిర్వాహక మండలి సమావేశంలో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు వర్శిటీ తన నోటిఫికేషన్లో పేర్కొంది.పొడిగించిన ఈ పని గంటలను సమర్థవంతంగా ఉపయోగిచుకునేందుకు అధ్యాపకులు, సిబ్బంది ముందుకు రావాలని విశ్వవిద్యాలయం సూచించింది. కొత్త విద్యా సంవత్సరానికి ముందు నుంచే ఈ విధానం అమలుకానుంది. మరోవైపు ఈ నూతన విద్యాసంవత్సరం(2025-26) నుంచే నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ (ఎఫ్వైయూపీ) ప్రారంభం కానుంది. సీనియర్ రెగ్యులర్ ఫ్యాకల్టీకి నాల్గవ ఏడాది విద్యార్థులకు బోధనా బాధ్యతలు అప్పగించనున్నట్లు తాజా నోటిఫికేషన్లో వర్శిటీ పేర్కొంది.ఢిల్లీ విశ్వవిద్యాలయం జారీ చేసిన ఆదేశంపై అధ్యాపకుల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ ఉత్తర్వులను అసాధ్యమని, బోధనా సిబ్బందికి, విద్యార్థులకు హానికరం అని అధ్యాపకులు అంటున్నారు. అలాగే ఈ ఉత్తర్వులను అమలు చేసేందుకు అవసరమైన ప్రాథమిక మౌలిక సదుపాయాలు లేవని పలువురు అధ్యాపకులు ఆరోపిస్తున్నారు. కళాశాలలకు దూరంగా ఉన్న అధ్యాపకులకు, విద్యార్థులకు ఇది సమస్యగా మారనున్నదనే వాదన వినిపిస్తోంది. -
సేఫ్సైడ్ కోసం.. రెండు చోట్లా పోటీ
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్సింగ్ చన్నీని కాంగ్రెస్ సేఫ్పైడ్గా రెండో నియోజకవర్గంలోనూ పోటీకి దింపింది. బదౌర్ (ఎస్పీ రిజర్వుడు) స్థానం నుంచి చన్నీ పోటీ చేస్తారని ప్రకటించింది. చన్నీతో కలిపి ఆదివారం మొత్తం ఎనిమిది మందితో కూడిన తుది జాబితాను కాంగ్రెస్ విడుదల చేనింది. ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చింది. నామినేషన్లకు మరో రెండు రోజులు గడువు మిగిలి ఉందగనా... కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన పూర్తి కావడం గమనార్హం. ఆమ్ ఆద్మీ పార్టీ సర్వే ప్రకారం చన్నీ చమకౌర్ నియోజకవర్గంలో ఓడిపోతున్నారని తేలిందని, అందుకే కాంగ్రెస్ ఆయన్ను మరోచోటు నుంచి పోటీకి నిలిపిందని ఆప్. చదవండిః ఒక వైపు నామినేషన్లు.. మరోవైపు రాజీనామాలు -
సామాన్యుడిపైకొరడా
నీటిబిల్లు బకాయిదారులపై ఆర్ఆర్ యాక్ట్ ప్రభుత్వ విభాగాల బకాయిలపై మౌనం జలమండలి తీరుపై సర్వత్రా ఆగ్రహావేశాలు సాక్షి, సిటీబ్యూరో : దేశ రాజధాని ఢిల్లీలో ఉచిత నీరందిస్తూ ఢిల్లీ జలబోర్డు ఆమ్ ఆద్మీ మనసు దోచుకుంటోంది. ఆ దిశగా కనీస ప్రయత్నం కూడా చేయని మన జలమండలి.. సామాన్యులపై కొరడా ఝళిపిస్తూ లాభాల బాటలో నడవాలని ప్రయత్నిస్తోంది. గ్రేటర్ పరిధిలో ఆరు నెలలుగా నీటిబిల్లు బకాయిపడిన సామాన్య, మధ్యతరగతి వర్గాలకు.. బ్రిటీషు ప్రభుత్వం 1864లో చేసిన రెవెన్యూ రికవరీ యాక్ట్, సెక్షన్-5 ప్రకారం ఏకంగా 941 రెడ్నోటీసులిచ్చి సంచలనం సృష్టిస్తోంది. మరోవైపు రూ.850 కోట్లు బకాయిపడిన మూతపడిన ప్రభుత్వ రంగ సంస్థలు, పంచాయతీరాజ్, గ్రామీణ నీటిసరఫరా విభాగం, ప్రభుత్వ ఆస్పత్రులు, పోలీసు క్వార్టర్లు, సర్కారు కార్యాలయాల విషయంలో జలమండలి మిన్నకుంటుంది. ఈ విషయంలో హోదా రీత్యా జలమండలికి చైర్మన్గా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి కూడా ప్రేక్షకపాత్రకే పరిమితమౌతుండటం పట్ల సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. సామాన్యులపైనే కరకు చట్టం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అన్న చందంగా మారింది జలమండలి తీరు. గ్రేటర్ పరిధిలో మొత్తం 8.05 లక్షల కుళాయిలున్నాయి. వీటిలో సామాన్య, మధ్యతరగతి, నిరుపేదలకు సంబంధించిన కుళాయిలు సుమారు 4 లక్షల వరకు ఉన్నాయి. వీరిలో నెలవారీగా ఠంచనుగా బిల్లు చెల్లించేవారు 90 శాతం మంది ఉంటారు. మరో పదిశాతం మాత్రం వివిధ వ్యక్తిగత, ఆర్థిక కారణాల రీత్యా ఆర్నెల్లు, ఏడాదికి బిల్లు చెల్లించడం.. బోర్డు ఏర్పడినప్పటి (1989వ సంవత్సరం) నుంచీ ఆనవాయితీగా వస్తుంది. కానీ ఇటీవల సర్కారు పెద్దలకు దుర్బుద్ధి పుట్టింది. నీటిబిల్లులను పక్కాగా వసూలు చేసి జలమండలిని లాభాల బాట పట్టించేందుకు ఒకవైపు నీటిబిల్లులను ఎడాపెడా పెంచడంతోపాటు, ఆర్నెల్లు బిల్లు బకాయి పడితే చాలు రెవెన్యూ రికవరీ యాక్ట్-1864 లోనిసెక్షన్-5 ప్రకారం కొరడా ఝళిపిస్తోంది. మహానగరం పరిధిలో గత నెలరోజులుగా 941 రెడ్నోటీసులిచ్చింది. వీటిలో 64 కుళాయి కనెక్షన్లను తొలగించింది. ఇంతటితో ఆగక ఆర్.ఆర్.యాక్ట్ ముసుగుతో బకాయిదారుల ఇళ్లలోని టీవీలు,ఫ్రిజ్లు, కూలర్లు వం టి గృహవినియోగ వస్తువులను బలవంతంగా సీజ్ చేసి సామాన్యులను హతాశులను చేస్తుండటం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశ రాజధానిలో ఒకవైపు ఉచిత నీరు ఇస్తున్నప్పటికీ ఆ దిశగా నగరంలో చేసిన ప్రయత్నాలు లేకపోగా ఇలాంటి విపరీత చర్యలకు పాల్పడటం హేయమని స్వచ్ఛం ద సంఘాలు, ప్రజాసంఘాలు, విపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రూ.850 కోట్ల సర్కారు బకాయిలపై మౌనం! మహానగరంలో జలమండలికి మూతపడిన ప్రభుత్వరంగ సంస్థలు, సర్కారు కార్యాలయాలు, వసతి గృహాల నుంచి రావాల్సిన బకాయిలు రూ.850 కోట్ల వరకు ఉన్నాయి. వీటి వసూలుకు జలమండలి ఆపసోపాలు పడుతోంది. ఆయా విభాగాలకు మొక్కుబడిగా లేఖలు రాసి చేతులు దులుపుకొంటోంది. స్వయంగా ముఖ్యమంత్రి హోదా రీత్యా చైర్మన్గా ఉన్నప్పటికీ బకాయిల వసూలుకు ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంతో జలమండలి రోజురోజుకూ రూకల్లోతు కష్టాల్లో కూరుకుపోతోంది. యుద్ధప్రాతిపదికన బకాయిల వసూలు చేయడమో లేదా ప్రభుత్వం ఆ మొత్తాన్ని గ్రాంటుగా మంజూరు చేయడమో చేస్తేనే బోర్డు ఆర్థిక నష్టాలు గణనీయంగా తగ్గడమే కాదు.. అల్పాదాయ, మధ్యాదాయ వర్గాలకు చెందిన 4 లక్షల కుళాయిలకు ఉచిత నీరు సరఫరా చేయొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికైనా కరకు చట్టాల అమలుపై జలమండలికి కనువిప్పు కలుగుతుందా?