breaking news
altimatum
-
Israel-Hamas war: వెళ్లిపోవాల్సిందే...రఫా ప్రజలకు మరోసారి ఇజ్రాయెల్ అల్టిమేటమ్
రఫా(గాజా స్ట్రిప్): గాజా దక్షిణాన ఉన్న చిట్టచివరి పెద్ద పట్టణం రఫాలో లక్షలాది మంది జనం ప్రాణాలు అరచేత పట్టుకుని పారిపోవాల్సిన పరిస్థితి దాపురించింది. రఫాను ఖాళీచేసి వెళ్లాలని జనాలకు ఇజ్రాయెల్ సైనికబలగాలు మరోసారి ఆదేశించాయి. ఉత్తర దిశ నుంచి మొదలెట్టి దక్షిణం దిశగా భూతల దాడులతో ఆక్రమణలు, దాడులను ఇజ్రాయెల్ సైన్యం కొనసాగిస్తోంది. అమెరికా, ఇతర మిత్రదేశాలు దూకుడు తగ్గించాలని మొత్తుకుంటున్నా ఇజ్రాయెల్ తన దాడులను ఆపట్లేదు. హమాస్ సాయుధుల ప్రతిదాడులతో శనివారం రఫా శివారుప్రాంతాలు భీకర రణక్షేత్రాలుగా మారిపోయాయి. రఫా తూర్పున మూడింట ఒక వంతు భూభాగంలో జనాలను ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ ఇప్పటికే ఖాళీచేయించింది. రఫా మొత్తాన్ని ఖాళీచేయించే దుస్సాహసానికి దిగితే మానవతా సాయం చాలా కష్టమవుతుందని, అమాయక పౌరుల మరణాలు మరింత పెరుగుతాయని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తంచేసింది. -
ముగ్గురికీ ఇవ్వాల్సిందే!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార పార్టీలో సీట్ల కేటాయింపు వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది. ఒకవైపు కోట్ల కుటుంబం రాకతో అటు ఆలూరు, ఇటు డోన్లో ఎమ్మెల్యే సీటు విషయంలో చర్చ మొదలుకాగా..ఇప్పుడు కర్నూలు సీటు విషయంలో మరింత రచ్చ జరుగుతోంది. కర్నూలు టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డికే ఇవ్వాలని మంత్రి అఖిలప్రియ, నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి పట్టుబడుతున్నారు. లేనిపక్షంలో తాము ముగ్గురమూ బరిలో ఉండబోమని టీడీపీ అధిష్టానానికి తేల్చిచెప్పినట్టు తెలుస్తోంది. ముగ్గురిలో ఏ ఒక్కరికి సీటు ఇవ్వకపోయినా తామంతా పోటీ నుంచి తప్పుకుంటామని స్పష్టం చేసినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికే ఆళ్లగడ్డ, శ్రీశైలం, బనగానపల్లె, ఎమ్మిగనూరు, మంత్రాలయం, పత్తికొండ సీట్లకు టీడీపీ అభ్యర్థులను ఖరారు చేశారు. కర్నూలు, నంద్యాల, డోన్లో కూడా మొదట్లో సిట్టింగులకే ఇస్తామని చెప్పారు. అయితే, టీజీ వెంకటేష్ చక్రం తిప్పడంతో కర్నూలు విషయంలో పార్టీ అధిష్టానం పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా టీజీ వెంకటేష్ కుమారుడు భరత్..మంత్రి లోకేష్తో భేటీ తర్వాత రాజకీయ పరిణామాల్లో మార్పు కన్పిస్తోంది. ఈ నేపథ్యంలో తాడోపేడో తేల్చుకునేందుకు ఎస్వీ, భూమా కుటుంబాలు సిద్ధమైనట్టు సమాచారం. ఎస్వీ, భూమా కుటుంబాలు వేర్వేరన్న విషయాన్ని గ్రహించాలని, ఒకే కుటుంబానికి మూడు సీట్లు ఇవ్వడం లేదని, రెండు కుటుంబాలకు కలిపి మూడు సీట్లు అన్న విషయాన్ని గుర్తించాలని అధిష్టానానికి వివరించినట్టు తెలుస్తోంది. ఇక కోట్ల కుటుంబం చేరికతో డోన్ విషయంలోనూ చర్చ మొదలయ్యింది. లోకేష్ను కలవడంతో.. వాస్తవానికి చంద్రబాబు సమక్షంలో జరిగిన జిల్లా సమీక్ష సందర్భంగా కర్నూలు సీటు ఎస్వీకే అని ప్రాథమికంగా అంగీకారం తెలిపారు. నంద్యాల సీటు కూడా భూమా బ్రహ్మానందరెడ్డికే ఇస్తామని స్పష్టం చేశారు. అయితే, టీజీ భరత్ మంత్రి లోకేష్ను కలిసిన తర్వాత చర్చ మరో విధంగా సాగుతోంది. విజన్యాత్రను మరింత దూకుడుగా చేసుకోవాలని, సర్వే ప్రకారమే సీట్ల కేటాయింపు ఉంటుందని భరత్తో లోకేష్ అన్నట్టు తెలుస్తోంది. దీంతో భరత్ మరింత దూకుడు పెంచారు. టీజీ కుటుంబానికి సీటివ్వకపోతే పార్టీ మారే అవకాశం ఉందన్న చర్చ కూడా మొదలయ్యింది. అయితే, ఎస్వీకి సీటు ఇవ్వకపోయినప్పటికీ ఎటూ పోయే పరిస్థితి ఉండదన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తమైంది. దీంతో భరత్ వైపు చంద్రబాబు మొగ్గు చూపారన్న వార్తలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలోనే ముగ్గురికీ సీట్లు ఇవ్వాల్సిందేనని, లేకపోతే బరి నుంచి తప్పుకుంటామంటూ అల్టిమేటం జారీచేసినట్టు తెలుస్తోంది. -
ఆక్వాపార్క్ను తరలించాల్సిందే
సాక్షి ప్రతినిధి, ఏలూరు : గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ను ఎట్టిపరిస్థితుల్లో తుందుర్రు నుంచి తరలించాల్సిందేనని వైఎస్సార్ సీపీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి, ఆక్వా పార్క్ యాజమాన్యానికి అల్టిమేటం ఇచ్చారు. బుధవారం సాయంత్రం తుందుర్రులో ఆక్వా పార్క్ బాధితులతో ముఖాముఖి మాట్లాడారు. ‘ఈ ఫ్యాక్టరీలో రోజుకు 3 వేల టన్నుల రొయ్యలు, చేపలను శుద్ధి చేస్తే ఆ రసాయనాలతో కాలుష్యం రాకుండా ఎలా ఉంటుంది. కాలుష్య నియంత్రణ చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం ఈ పరిశ్రమ ఆరెంజ్ కేటగిరీలో ఉంది. అంటే.. కాలుష్యం వెదజల్లే కేటగిరీలో ఉంది. ఇది కాలుష్య కారకమని చంద్రబాబుకు తెలియదా. కాలుష్యం ఉందని తెలుసు కాబట్టే పైపులైన్ వేస్తామంటూ ప్రజలను మభ్యపెడుతున్నారు. ఇదే ఫ్యాక్టరీని ఇక్కడకు పది కిలోమీటర్ల దూరంలోని సముద్ర తీరానికి మారిస్తే ఇబ్బంది ఉండదు. అక్కడ మనుషులు ఉండరు కాబట్టి సమస్య ఉండదు. సముద్ర తీరంలో ఇదే ఫ్యాక్టరీ యజమానులకు 350 ఎకరాల భూములన్నాయి. అక్కడకు తరలిస్తే సముద్ర తీరం కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. దానివల్ల పైప్లైన్ వేసేందుకు అయ్యే ఖర్చు కూడా తప్పుతుంది’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ‘ఫ్యాక్టరీ వల్ల కొద్దోగొప్పో ఉద్యోగాలు వస్తాయి కాబట్టి సరేనన్నామని కొందరు అంటున్నారు. కానీ ఇక్కడ ఫ్యాక్టరీ పెడితే విపరీతమైన దుర్గం ధం వస్తుంది. కాలువలు కలుషితమై వ్యవసా యం దెబ్బతింటుంది. పొలాలపై ఆధారపడిన కూలీలు బతికే పరిస్థితి ఉండదు’ అన్నారు. ‘పరి శ్రమలు రాకూడదని ఎవరూ అనుకోరు. కానీ.. ఇక్కడ కడితే వీళ్ల పొట్టమీద కొట్టినట్టు అవుతుంది. ఈ ఫ్యాక్టరీ యాజమాన్యానికి కూడా నా సిన్సియర్ రిక్వెస్ట్ ఒక్కటే. ఫ్యాక్టరీ పెట్టిన తరువాత ఏ ఇబ్బంది ఉండకూడదనే విషయాన్ని చూసుకోవాలి. ఫ్యాక్టరీని సముద్ర తీరానికి తరలిస్తే యాజమాన్యానికి పూర్తి మద్దతు ఇస్తాం. మహా అయితే పునాది పనులకు పెట్టిన రూ.ఐదు కోట్ల ఖర్చు మాత్రమే నష్టం కావచ్చు’ అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం, ఫ్యాక్టరీ యాజమాన్యం మొండి పట్టుదలను పక్కన పెట్టి ప్రజాభీష్టానికి అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. కాదంటే.. బంగాళాఖాతంలో కలిసిపోవాల్సిందే ఫ్యాక్టరీ స్థలం మొత్తాన్ని పూర్తిగా పోలీసులతో నింపేసి, అక్కడ యుద్ధవాతావరణం సృష్టించారని వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాల్లో 144 సెక్షన్ విధించి.. ఉద్యమకారులపై హత్యాయత్నం కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. ప్రజల అభీష్టం మేరకు ఆక్వా పార్క్ను తక్షణమే ఇక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేశారు. కాదు.. కూడదు అని చంద్రబాబు మాటను నమ్ముకుంటే ఆయనతోపాటు యాజమాన్యం కూడా బంగాళాఖాతంలో కలిసిపోవాల్సిందేనని హెచ్చరించారు. ఫ్యాక్టరీని ఇక్కడి నుంచి తరలించకుంటే ప్రజల కోసం కోర్టును కూడా ఆశ్రయిస్తామని జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. అండగా నిలుస్తాం తుందుర్రు పరిసర గ్రామాల ప్రజలు చేస్తున్న ఉద్యమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అండగా నిలుస్తుందని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. తుందుర్రు గ్రామస్తులతో ఆయన మాట్లాడుతూ ఇక్కడ ఫ్యాక్టరీ వస్తే మీకు వచ్చే ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు. అనంతరం అక్కడి నుంచి బేతపూడి బయలుదేరి వెళ్లారు. బేతపూడిలో ఆక్వాపార్క్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న వారితో మాట్లాడారు. అసలు ఫ్యాక్టరీని ఎందుకు వద్దంటున్నారో అడిగి తెలుసుకున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ జరపకుండా, చేపల చెరువుల కోసం అంటూ.. దొంగ లెక్కలు చెబుతూ ఆక్వా పార్క్ నిర్మిస్తున్నారని ధ్వజమెత్తారు. తుందుర్రు ఎంపీటీసీ భర్త జవ్వాది సత్యనారామణ మాట్లాడుతూ తమను గ్రామ ప్రజలందరూ ఏకగ్రీవంగా ఎంపిక చేశారని, టీడీపీ తరఫున గెలిచినా తాము ప్రజల పక్షాన ఉద్యమిస్తున్నామని స్పష్టం చేశారు. కె.బేతపూడికి చెందిన సత్యవాణి మాట్లాడుతూ చేపలు, రొయ్యల శుద్ధి కోసం వరి పండే పొలాలను నాశనం చేస్తారా అని ప్రశ్నించారు. వరి ఇక్కడ పండకపోతే సింగపూర్ నుంచి తీసుకువస్తారా చంద్రబాబుగారూ అని నిలదీశారు. కన్నతల్లిని చంపి, పెంపుడు తల్లిని తీసుకువస్తామంటే తాము సహించేది లేదని అక్కడి వారంతా స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన జగన్మోహనరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబునాయుడి ప్రభుత్వం ఇంకా ఉండేది రెండేళ్లే అన్న విషయం గుర్తు పెట్టుకోవాలని, తర్వాత తమ ప్రభుత్వం ప్రజాభీష్టం మేరకు ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు. తుందుర్రు ప్రజలు చేస్తున్న ఉద్యమానికి వైఎస్సార్ సీపీ అండగా నిలబడుతుందని, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని, భీమవరం, నరసాపురం సమన్వయకర్తలు గ్రంధి శ్రీనివాస్, ముదునూరి ప్రసాదరాజు ఇక్కడి ప్రజలకు పూర్తిగా అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. సత్యవతికి పరామర్శ వైఎస్ జగన్మోహన్రెడ్డి గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా తణుకు సబ్జైలుకు చేరుకున్నారు. 38 రోజులుగా జైలులో రిమాండ్లో ఉన్న ఆరేటి సత్యవతిని పరామర్శించారు. తుందుర్రు ఉద్యమం, అక్కడ చోటుచేసుకున్న పరిణామాలను సత్యవతి నుంచి తెలుసుకున్నారు. తన భర్త క్యాన్సర్తో బాధపడుతున్నారని, అయినా పోలీసులు తనను తణుకులోను, తన కుమారుడిని నరసాపురం సబ్జైలులో పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపో యారు. తనకు బెయిల్ కూడా రాకుండా అడ్డుకుంటున్నారని వివరించారు. అనంతరం బయటకు వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ పోలీసు రాజ్యం నడుపుతున్న చంద్రబాబు సర్కారుపై నిప్పులు చెరి గారు. అనంతరం అత్తిలి, పాలకోడేరు, భీమవరం మీదుగా సాయంత్రం 5.30 గంటల సమయంలో తుందుర్రు చేరుకున్నారు. అక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకూ వైఎస్ జగన్ రాక కోసం వేలాది ప్రజలు ఎదురుచూశారు. తుందుర్రు గ్రామ సరిహద్దు నుంచి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి కె.బేతపూడి వరకూ జనసంద్రం కదలివచ్చిందా అన్నట్టుగా తీసుకువెళ్లారు. తుందుర్రు ఎస్సీ పేటలో వైఎస్ రాజశేఖరరెడ్డి, అంబేద్కర్ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.