breaking news
Ajmal Ameer
-
ఆ హీరో అలాంటివాడే.. ఆడిషన్ అని పిలిచి గదిలో..: హీరోయిన్
ప్రముఖ హీరో అజ్మల్ అమీర్ (Ajmal Ameer) అమ్మాయిలతో అసభ్యంగా మాట్లాడాడంటూ ఓ వీడియో క్లిప్ నెట్టింట వైరలయింది. హద్దులు దాటి సంభాషించాడంటూ ఆరోపణలు వచ్చాయి. ఇదంతా ఏఐ మాయ అని.. వాటిని కొట్టిపారేశాడు. ఇలాంటి ఫేక్ వీడియోలతో నా కెరీర్ నాశనం చేయలేరు అని వీడియో రిలీజ్ చేశాడు. ఈ క్రమంలో తమిళ హీరోయిన్ నర్విని దేరి.. అజ్మల్ అలాంటి దుర్మార్గుడే అంటూ మీడియా ముందుకు వచ్చింది. హీరోయిన్ కోసం వెతుకులాటతమిళ యూట్యూబ్ ఛానల్ ట్రెండ్ టాక్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. అజ్మల్కు వ్యతిరేకంగా మాట్లాడిన మొదటి వ్యక్తి నేనే! అజ్మల్ అరాచకాల గురించి గతంలో చెప్పాను. అసలేం జరిగిందంటే.. 2018లో చెన్నైలోని ఓ మాల్లో అజ్మల్ను తొలిసారి కలిశాను. అప్పటికే నేనో సినిమా చేస్తున్నాను. అజ్మల్ ఒక యాక్టర్ అని నా ఫ్రెండ్ వల్ల తెలిసింది. అజ్మల్.. తన నెక్స్ట్ సినిమాకు హీరోయిన్ కోసం వెతుకుతున్నట్లు చెప్పాడు. ఆడిషన్కు రమ్మని ఆహ్వానంనన్ను యాక్ట్ చేయమని అడిగాడు. అలా ఇద్దరం మాట్లాడుకుని, ఫోన్ నెంబర్లు తీసుకుని వెళ్లిపోయాం. తర్వాత నాకు వాట్సాప్లో ఆడిషన్కు రమ్మని పిలిచాడు. నేను ఆ మరుసటి రోజే డెన్మార్క్ వెళ్లాల్సి ఉంది, ఇప్పుడు రాలేనని చెప్పాను. నువ్వు వస్తే సినిమా టీమ్ అందరినీ కలుసుకోవచ్చని ఒప్పించాడు. అయినా ఆడిషన్, సెలక్షన్.. ఒకే రోజులో ఎలా పూర్తవుతాయని ప్రశ్నిస్తే తాను చూసుకుంటానన్నాడు. అక్కడికి వెళ్లగానే..సినిమా స్టార్ట్ అవ్వడానికి ఇంకా సమయం ఉందని చెప్పాడు. ఆడిషన్కు వెళ్లేటప్పుడు నా ఫ్రెండ్స్ లేదా బంధువుల్లో ఎవరో ఒకర్ని వెంటపెట్టుకుని వెళ్తాను. కానీ, ఆరోజు సడన్గా వెళ్లాల్సి వచ్చేసరికి ఒంటరిగా వెళ్లాను. అజ్మల్ పంపిన లొకేషన్కు వెళ్లగానే కొంత అసౌకర్యంగా అనిపించింది. ఆయన చెప్పిన రూమ్ దగ్గరికెళ్లి డోర్ కొట్టగా అజ్మల్ తలుపు తీశాడు. మిగతావారేరి? అని అడిగితే అందరూ బయటకు వెళ్లారన్నాడు.రూమ్లో ఒక్కడే..వారు వచ్చేవరకు కింద వెయిట్ చేస్తానంటే ఆయన ఒప్పుకోలేదు. ఏదో తప్పు జరగబోతోంది అని నా మనసు కీడు శంకించింది. తినడానికి ఏదో ఇస్తే వద్దని తిరస్కరించాను. ఇంకో 20 నిమిషాల్లో నా నుంచి మెసేజ్ రాకపోతే వెంటనే ఫోన్ చేయ్ అని నా ఫ్రెండ్కు మెసేజ్ పెట్టాను. మరోవైపు అజ్మల్.. నా బ్యాగు తీసుకుని పక్కనపెట్టాడు. ఏం చేయాలో అర్థం కాక వాష్రూమ్కి వెళ్లి అక్కడే కాసేపు ఉండిపోయాను. బయటకు రాగానే పాటలు పెట్టి నా చేయి పట్టుకున్నాడు. అమ్మాయిలు నా వెంట పడతారుడ్యాన్స్ చేద్దామన్నాడు. వెంటనే అతడిని దూరం నెట్టి.. మీ ఉద్దేశం ఏంటో నాకర్థమైంది. నేను దానికోసమైతే రాలేదు అని ముఖం మీదే చెప్పాను. అందుకు అజ్మల్.. ఏం మాట్లాడుతున్నావ్? నేను హ్యాండ్సమ్.. నా వెనక ఎంతమంది అమ్మాయిలు పడతారో తెలుసా? అంటూ గొప్పలుపోయాడు. అయితే నాకేంటి? నాకిదంతా నచ్చదని కరాఖండి చెప్తూ ఉన్నా.. సడన్గా హత్తుకునేందుకు ప్రయత్నించాడు. నన్ను చంపాకే ముట్టునేను అడ్డు చెప్పాను. నన్నేదైనా చేయాలంటే అది నన్ను చంపాకే చేసుకో అన్నాను. అప్పుడే తనకు ఫోన్కాల్ వచ్చింది. వెంటనే నేను క్యాబ్ డ్రైవర్కు ఫోన్ చేసి రెడీగా ఉండమన్నాను. నాతోపాటు సిస్టర్స్ వచ్చారు, వారు కింద నాకోసం వెయిట్ చేస్తున్నారని అబద్ధం చెప్పాను. నేను వెళ్లకపోతే వారే నన్ను వెతుక్కుంటూ ఇక్కడివరకు వస్తారన్నాను. ఇంతలో రూమ్ బాయ్ కాలింగ్ బెల్ కొట్టాడు. అజ్మల్ డోర్ తలుపు తీయగానే వెంటనే అక్కడి నుంచి పారిపోయి తప్పించుకున్నాను. చాలామందితో ఇలాగేఇంత జరిగాక కూడా నాకు మెసేజ్ చేయడం మానలేదు. మళ్లీ కలుస్తావా? అని అడుగుతూ ఉంటాడు. అజ్మల్ చాలామంది అమ్మాయిలతో ఇలాగే ప్రవర్తించాడు. ఇదంతా జరిగినప్పుడు నా చదువు, జీవితంపైనే ధ్యాస పెట్టాను. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేయలేదు అని నర్విని చెప్పుకొచ్చింది. నర్విని.. ఉయిర్వారై ఇనింతాయి, సినంకోల్ అనే తమిళ సినిమాల్లో హీరోయిన్గా చేసింది.చదవండి: శ్రీజకు మళ్లీ అన్యాయం? 'మేమేం పాపం చేశాం? ఎందుకింత వివక్ష' -
అమ్మాయితో అసభ్య వీడియో కాల్స్? నా కెరీర్ నాశనం..!
ప్రముఖ నటుడు అజ్మల్ అమీర్ (Ajmal Ameer) అమ్మాయిలతో అసభ్యంగా మాట్లాడాడంటూ ఓ వీడియో క్లిప్పింగ్ నెట్టింట వైరల్గా మారింది. హద్దులు దాటి మాట్లాడటంతో పాటు చాటింగ్ కూడా చేశాడంటూ ప్రచారం జరిగింది. ఈ వివాదంపై అజ్మల్ స్పందించాడు. అవన్నీ ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) సాయంతో సృష్టించిన ఫేక్ వీడియో కాల్స్ అని కొట్టిపారేశాడు.నాకు పీఆర్ లేదుఅజ్మల్ మాట్లాడుతూ.. ఈ కల్పిత కథలు, ఏఐ వాయిస్ ఇమిటేటింగ్, ఎడిటింగ్స్.. నన్ను కానీ, నా కెరీర్ను కానీ నాశనం చేయలేవు. దేవుడి దయ వల్ల రెండు పెద్ద (తెలుగు, తమిళ) ఇండస్ట్రీలలో నేనేంటో నిరూపించుకోగలిగాను. నాకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుని సినీ పరిశ్రమలో కొనసాగుతున్నాను. నా ఇమేజ్ను కాపాడేందుకు నాకెటువంటి మేనేజర్ లేడు, పీఆర్ అసలే లేదు. రెండురోజులుగా నా గురించి తప్పుడు ప్రచారం జరుగుతోంది.సినిమాఇలాంటి సమయంలో నాకు అండగా నిలబడ్డ అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. మీవల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. మీరే నా ధైర్యం అని వీడియో రిలీజ్ చేశాడు. అజ్మల్ విషయానికి వస్తే.. ఫిబ్రవరి 14 అనే తమిళ సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాడు. రంగం మూవీతో తెలుగులోనూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. రచ్చ, అభినేత్రి 2, వ్యూహం, బడ్డీ, గోట్(The Greatest of All Time) వంటి పలు సినిమాలతో అలరించాడు. View this post on Instagram A post shared by Ajmal Amir (@ajmal_amir) చదవండి: నీకెందుకే అంత యాటిట్యూడ్? రీతూపై విషం కక్కిన ఆయేషా -
'వ్యూహం' సినిమా రివ్యూ
టైటిల్: వ్యూహం నటీనటులు: అజ్మల్ అమీర్,మానస రాధాకృష్ణన్,ధనంజయ్ ప్రభునే,సురభి ప్రభావతి తదితరులు నిర్మాణ సంస్థ: రామదూత క్రియేషన్స్ నిర్మాత: దాసరి కిరణ్ కుమార్ రచన-దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ సంగీతం: ఆనంద్ సినిమాటోగ్రఫీ: సాజీశ్ రాజేంద్రన్ విడుదల తేది: మార్చి 2, 2024 రాజకీయాలు, సినిమాలు తెలుగువారి జీవితంలో భాగం. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం ఉన్నన్నీ రోజులు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గార్ల పేర్లు చిరస్థాయిలో ఉంటాయనేది జగమెరిగన సత్యం. అందుకే వారి రాజకీయ ప్రయాణంపై వచ్చిన యాత్ర, యాత్ర-2 చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. తాజాగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన సమయం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు 'వ్యూహం' చిత్రాన్ని తెరకెక్కించారు వర్మ. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వాస్తవంగా ఈ రెండు నెలల క్రితం రావాల్సిన ఈ చిత్రాన్ని నారా లోకేష్ అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆ చిక్కులన్ని దాటుకోని నేడు(మార్చి 2) విడుదలైన వర్మ వ్యూహం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారు మరణించిన సీన్తో వ్యూహం సినిమా ప్రారంభం అవుతుంది. ఇందులోని పాత్రలకు వర్మ తనదైన స్టైల్లో పేర్లు పెట్టుకుని తెరకెక్కించాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని వీర శేఖర్ రెడ్డి అని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మదన్ రెడ్డి అని ప్రేక్షకులకు వర్మ పరిచయం చేశారు. వీఎస్సార్ మరణానికి ముందు జగన్ అంటే ప్రజలకు పెద్దగా తెలియదు.. తండ్రి అడుగుజాడల్లో నడవాలని రాజకీయాల్లో ఆయన తొలి అడుగు పడి కడప ఎంపీగా గెలుస్తారు. 2009లో హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్సార్ మరణించడంతో ఏపీ రాజకీయాల్లో పెనుమార్పులు రావడం జరుగుతుంది. ఆ సమయంలో ఏపీ సీఎం ఎవరంటూ ప్రశ్నలు రావడం జరుగుతుండగా.. మదన్(అజ్మల్ అమీర్) ముఖ్యమంత్రిగా కావాలని 150కి పైగా ఎమ్మెల్యేల మద్ధతుతో ఒక లేఖ భారత్ పార్టీ (కాంగ్రెస్) అధినేత్రి అయిన మేడం (సోనియా) వద్దకు చేరుతుంది. అదే సమయంలో మదన్ ముఖ్యమంత్రి ఎట్టిపరిస్థితిల్లో కాకూడదని ఇంద్రబాబు (ధనుంజయ్ ప్రభునే) పన్నిన వ్యూహం ఏంటి..? మేడంను దిక్కరించిన జగన్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు..? 2009లో జగన్ సీఎం కాకుండా చంద్రబాబు అండ్ కో చేసింది ఏమిటి..? 2014లో ఇంద్రబాబుకు మద్దతు ఇచ్చిన శ్రవణ్ కళ్యాణ్..2019 ఎన్నికల్లో ఆ పార్టీతో ఎందుకు పోటీ పెట్టుకోలేదు? శ్రవణ్ కల్యాణ్ పన్నిన వ్యూహం ఏంటి? అతన్ని ఇంద్రబాబు ఎలా వాడుకున్నాడు? ప్రతి పక్షాల కుట్రలన్నింటిని మదన్ ఎలా ప్రజా నాయకుడిగా ఎదిగారనేదే ఈ సినిమా కథ. ఎలా ఉందంటే.. వైఎస్సార్ మరణం తర్వాత ఎపీ రాజకీయాల్లో చోటుచేసుకున్న పెనుమార్పులను ఎదర్కొని జగన్ ఎలా నిలబడ్డారు..? అనేది వ్యూహంలో వర్మ చూపించారు. తండ్రి ఆశయాలకు గండిపడుతున్న సమయంలో నేనున్నానంటూ ప్రజల కోసం జగన్ పోరాటం.. కేంద్రాన్ని ఎదురించి తనను నమ్ముకున్న ప్రజల కోసం జగన్ ప్రారంభించిన ఓదార్పు యాత్ర.. దాంతో కేంద్రం నుంచి జగన్ ఎలాంటి చిక్కులు ఎదుర్కొన్నారు..? అప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జగన్ను ప్రత్యర్థులంతా ఏకమై ఎదురుదాడి చేస్తున్నప్పటికి ఎలాంటి బెరుకు లేకుండా ప్రజలను మాత్రమే నమ్ముకుని అసలు సిసలైన ప్రజా నాయకుడిగా ఎలా ఎదగగలిగాడు అనే విషయాన్ని వ్యూహంలో వర్మ చక్కగా చూపించాడు. ప్రజల్లో తిరుగుతున్న నాయకులు అందరూ కూడా తమ వ్యక్తిగత జీవితంలో ఎలా ఉంటారో తను అనుకున్న రీతిలో చూపించారు వర్మ.. అందుకే వైఎస్ఆర్ మరణం తర్వాత చంద్రబాబు ఆలోచనలు ఎలా ఉన్నాయి.. అప్పుడు ఆయన ఎలా రియాక్ట్ అయి ఉంటాడు అనేది చూపించారు. కుటుంబ పెద్దను కోల్పోతే ఒక ఫ్యామిలీ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటుంది.. ఆ సమయంలో వారి బాధ ఎలా ఉంటుంది అనేది వర్మ బయటకు తీశాడు.. కష్ట సమయంలో వైఎస్ జగన్ గారికి ఆయన తల్లి, సతీమణి అండగా ఎలా నిలడ్డారనే పాయింట్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. కేంద్రాన్ని దిక్కారించడం వల్ల జగన్ జైలుకు వెళ్లిన సమయంలో తన అనుకున్న వారందరూ దూరం అయినా కూడా ఆయన సతీమణి వైఎస్ భారతి(సినిమాలో మాలతి) గారు ఎలా ధైర్యంగా ముందు అడుగు వెశారో వర్మ తనదైన స్టైల్లో చూపించారు. 2014 ఎన్నికల్లో తొలిసారిగా పోటీకి సింగిల్గానే జగన్ బరిలోకి దిగితే... ఓటమి భయంతో చంద్రబాబు కూటమిని ఏర్పాటు చేసుకుని పోటీకి సిద్ధమౌతాడు.. ఎన్నికల్లో గెలిచిన తర్వాత మనసేన (జనసేన) అధినేత అయిన శ్రవణ్ కల్యాణ్ను తప్పించేందుకు బాబు ఎలాంటి ఎత్తుగడలు వెశాడో చూస్తే అందరినీ నవ్వు తెప్పిస్తాయి. మళ్లీ 2019 నాటికి పవన్తో మళ్లీ బాబు టచ్లోకి వెళ్లడం వంటి సీన్స్ వస్తున్న సమయంలో ఏం వ్యూహం బాబుగారు అంటూ పొగడ్తలతో ప్రేక్షకులు కూడా ముంచెత్తుతారు. సినిమా జరుగుతున్న సమయంలో అప్పుడప్పుడు ముకేష్ (లోకేష్) పాత్ర కనిపించి కనిపించక ఉంటుంది. వర్మకు ఆ పాత్ర అంటే బాగా ఇష్టం ఉన్నట్లు ఉంది అందుకే చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దాడు. ముకేష్ నుంచి వచ్చే డైలాగ్స్ తక్కువే అయినా ఫన్నీగా అందరినీ ఆకట్టుకుంటాయి. ఆయన పాత్ర గురించి చెప్పడం కంటే సినిమాకు వెళ్లి చూస్తేనే బాగుంటుందని అభిప్రాయం. ఎవరెలా చేశారంటే.. వ్యూహం సినిమాలో కథ మొత్తం వైఎస్ జగన్, చంద్రబాబు పాత్రల చూట్టే ఎక్కువగా జరుగుతుంది. తర్వాత పవన్ కల్యాణ్ పాత్రకు కాస్త ఎక్కువగానే ప్రయారిటీ ఉంటుంది. వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్ అమీర్ సరిగ్గా సరిపోయారు అని చెప్పవచ్చు.. జగన్ గారిలో ఉన్న మ్యానరిజాన్ని పర్ఫెక్ట్గా అజ్మల్ చూపించాడు.. తనదైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశాడు. ముఖ్యంగా ఓదార్పు యాత్ర సమయంలో ఆయన కనిపించిన తీరుతో పాటు ప్రత్యేక హోదా కోసం ఆయన చేపట్టిన దీక్షకు సంబంధించిన సీన్స్లలో జగన్ గారికి దగ్గరగా కనిపిస్తాడు. ముఖ్యంగా వ్యూహం సినిమాలో వైఎస్ భారతి గారి పాత్రలో మానస రాధాకృష్ణన్ సరిగ్గా సెట్ అయ్యారు. సినిమాలో ఆమె కనిపించిన ప్రతిసారి అచ్చం భారతిలాగే ఉన్నారు. చంద్రబాబు పాత్రలో కనిపించిన ధనంజయ్ ప్రభునే అందరికీ సుపరిచయమే.. ఆయన నటనతో దుమ్మురేపాడు అని చెప్పవచ్చు.. చంద్రబాబు మ్యానరిజానికి ఏ మాత్రం తగ్గకుండా ప్రేక్షకులను ఆయన మెప్పించాడు. సోనియా గాంధీ పాత్రలో ఎలీనా కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. వ్యూహం సినిమాలో నటించిన అందరిలో దాగి ఉన్న టాలెంట్ను వర్మ సరిగ్గా ఉపయోగించుకున్నాడు. సాంకేతిక పరంగా సినిమా బాగుంది. వైఎస్ జగన్ పార్టీ పెట్టిన సమయంలో వచ్చిన పాట అందరినీ మెప్పిస్తుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగున్నప్పటికీ సంగీత నేపథ్యం ఇంకాస్త మెరుగ్గా ఉండుంటే బాగుండేది. వైఎస్ జగన్ గారి జీవితంలోని కీలకమైన సంఘటనలను మాత్రమే తీసుకుని ఎడిటింగ్ చేసిన తీరు పర్వాలేదు.. ఏదైమనా వ్యూహం సినిమాను ఎవరైనా చూడొచ్చు.. వైఎస్ జగన్ గారి అభిమానుల్లో మాత్రం ఫుల్ జోష్ను నింపడం ఖాయం. -
ఆర్జీవీ వ్యూహం.. దసరాకు స్పెషల్ పోస్టర్ రిలీజ్!
టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘వ్యూహం’. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి టీజర్,ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇటీవలో ఓ సాంగ్ను వర్మ విడుదల చేశారు. ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. తాజాగా దసరా సందర్భంగా డైరెక్టర్ ఆర్జీవీ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. విజయదశమి శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ చేశారు. కాగా.. ఈ చిత్రాన్ని రెండు పార్టులుగా తెరకెక్కించనున్నట్లు ఆర్జీవీ ప్రకటించారు. మొదటి భాగం వ్యూహం పేరుతో నవంబర్ 10న విడుదల కానుంది. శపథం పేరుతో రెండో భాగం జనవరి 25న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. వ్యూహం మూవీలో వైఎస్ జగన్ గారి పాత్రతో దక్షిణాది నటుడు అజ్మల్ అమీర్ నటిస్తుండగా.. వైఎస్ భారతి గారి పాత్రలో మానస రాధాకృష్ణన్ నటిస్తున్నారు. ‘అహంకారానికి ఆలోచనకు మధ్య జరిగే యుద్ధం’ ఇతివృత్తంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ నిర్మిస్తున్నారు. HAPPY DUSSEHRA from the team of VYOOHAM 💐💐💐 pic.twitter.com/4u6Ecpp1So — Ram Gopal Varma (@RGVzoomin) October 23, 2023 -
మంగళవారం కోసం ఎదురు చూస్తున్నా!
‘‘ఆర్ఎక్స్ 100’ తర్వాత నేను, అజయ్ భూపతి లేదా నేను, పాయల్ ఎప్పుడు మళ్లీ సినిమా చేస్తామని అందరూ అడుగుతుంటే.. మంచి కథ కుదరాలని చెబుతూ వచ్చాను. వారిద్దరి కాంబినేషన్లో ‘మంగళ వారం’ సినిమా చేస్తున్నట్లు వార్తలు చూసి, నన్ను వదిలేసి ఇద్దరూ సినిమా చేశారు అనుకున్నా (నవ్వుతూ). అజయ్ తన సొంతూరు ఆత్రేయపురంలో ‘ఆర్ఎక్స్ 100’ తీశాడు. ఇప్పుడు ఆ ఊరిని మరో విధంగా ‘మంగళవారం’లో చూపించాడు. 100 పర్సెంట్ అందరికంటే ఈ సినిమా కోసం నేనెక్కువ ఎదురు చూస్తున్నాను’’ అని హీరో కార్తికేయ అన్నారు. పాయల్ రాజ్పుత్, అజ్మల్ ఆమిర్ జంటగా అజయ్ భూపతి దర్శకత్వం వహించిన చిత్రం ‘మంగళవారం’. స్వాతీ రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం నిర్మించిన ఈ సినిమా నవంబర్ 17న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్ని హీరో చిరంజీవి సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో హీరో కార్తికేయ ట్రైలర్ని రిలీజ్ చేశారు. అజయ్ భూపతి మాట్లాడుతూ– ‘‘మంగళవారం’ మంచి డార్క్ థ్రిల్లర్. ఇందులో మహిళలకు సంబంధించిన పాయింట్ని టచ్ చేశాం. కార్తికేయ, నా కాంబినేషన్లో మరో సినిమా ఉంటుంది’’ అన్నారు. ‘‘మా నాన్నకు (నిమ్మగడ్డ ప్రసాద్), నాకు సినిమాలంటే ఇష్టం. సినిమా నిర్మించాలనే నా కల ‘మంగళవారం’తో నెరవేరింది’’ అన్నారు స్వాతీ రెడ్డి. ‘‘ఈ సినిమాతో నేను, స్వాతి నిర్మాతలుగా పరిచయమవడం గర్వంగా ఉంది’’ అన్నారు సురేష్ వర్మ. ‘‘నా కెరీర్ ఎటు వెళుతుందో తెలియని అనిశ్చితి ఉన్న సమయంలో ‘మంగళవారం’కి చాన్స్ ఇచ్చారు అజయ్గారు’’ అన్నారు పాయల్. -
'వ్యూహం' నుంచి దమ్మున్న సాంగ్తో ఊపేసిన రాహుల్ సిప్లిగంజ్
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘వ్యూహం’. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్,ట్రైలర్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా వ్యూహం సినిమా నుంచి YSRCP అనే సాంగ్ను వర్మ విడుదల చేశారు. ఈ పాట కోసం ఆర్ఆర్ఆర్ సినిమాతో నాటు.. నాటు పాటకు ఆస్కార్ అవార్డుతో మరింత గుర్తింపు పొందిన రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. (ఇదీ చదవండి: సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి) వైఎస్సార్సీపీ.. వైఎస్సార్సీపీ (YSRCP).. ఢీ కొట్టే మా పార్టీ వచ్చింది చూడు.. దమ్మున్న మా పార్టీ వచ్చింది చూడు.. ఆంధ్ర ప్రాంతంలో పుట్టింది నేడు.. సీమ సింగంలా తొడగొట్టే చూడు.. అంటూ సాగే పాటను రాహుల్ అద్భుతంగా పాడారు. ఇప్పటికే వ్యూహం నుంచి వెన్ను పోటు సాంగ్ పేరుతో.. పులుల రూపంలో గుంట నక్కలు అంటూ ఒక పాటను వర్మ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ పాట యూట్యూబ్లో సంచలనం క్రియేట్ చేస్తుంది. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జరిగిన పరిణామాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు రామ్ గోపాల్ వర్మ. రెండు పార్టులుగా రానున్న ఈ సినిమా.. మొదటి భాగం వ్యూహం పేరుతో నవంబర్ 10న విడుదల కానుంది. శపథం పేరుతో రెండో భాగం జనవరి 25న విడుదల కానున్నట్లు ఆయన ప్రకటించారు. వ్యూహం మూవీలో వైఎస్ జగన్ గారి పాత్రతో దక్షిణాది నటుడు అజ్మల్ అమీర్ నటిస్తుండగా.. వైఎస్ భారతి గారి పాత్రలో మానస రాధాకృష్ణన్ నటిస్తున్నారు. ‘అహంకారానికి ఆలోచనకు మధ్య జరిగే యుద్ధం’ ఇతివృత్తంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ నిర్మిస్తున్నారు. -
హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీలో నయన
లేడీ సూపర్స్టార్ నయనతార చిత్రం అంటే అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. దర్బార్, బిగిల్ చిత్రాల సక్సెస్తో తన క్రేజ్ను ఇంకా పెంచుకుంది. మరోసారి సూపర్స్టార్ రజనీకాంత్తో అన్నాత్తా చిత్రంలో నటిస్తోంది. ఇది కాకుండా కథానాయకికి ప్రాముఖ్యత కలిగిన మూక్కుత్తి అమ్మన్ అనే భక్తిరస కథా చిత్రంలోనూ నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ను పూర్తి చేసుకుంది. కాగా తన ప్రియుడు విఘ్నేశ్శివన్ను నిర్మాతగా రౌడీ పిక్చర్స్ పతాకంపై వెట్రికన్ అనే చిత్రంలో నటిస్తోంది. ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రం కావడం విశేషం. సాధారణంగా హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాల్లో హీరోయిన్లకు సపోర్టింగ్ ఒక హీరో ఉంటుంటాడు. అలా మాయ చిత్రంలో నయనతారతో నటుడు ఆరి నటించారు. అదేవిధంగా ఈ నెట్రికన్ చిత్రంలోనూ అజ్మల్ నటిస్తున్నాడు. అంజాదే, కో, ఇరవుక్కు ఆయిరం కన్గళ్ వంటి చిత్రాల్లో తనదైన స్టైల్లో నటించి మెప్పించారు. అంతే కాదు తెలుగులోనూ నటిస్తూ బహుభాషా నటుడిగా రాణిస్తున్నాడు. కాగా అజ్మల్ ఇప్పుడు నయనతారతో కలిసి నెట్రికన్ చిత్రంలో నటిస్తున్నట్లు చిత్ర వర్గాలు తాజాగా వెల్లడించారు. ఈ చిత్రంలో అజ్మల్ పాత్ర కథను మలుపు తిప్పే చాలా కీలకంగా ఉంటుందట. సస్పెన్స్, థ్రిల్లర్తో కూడిన మిస్టరీ కథాంశంతో కూడిన చిత్రంగా తెరకెక్కుతున్న చిత్రం నెట్రికన్. అవళ్ వంటి హిట్ చిత్రాల దర్శకుడు మిలింద్రావ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే 80 శాతం పూర్తి అయ్యిందని చిత్ర వర్గాలు తెలిపారు. కాగా దీనికి గిరీశ్ సంగీతాన్ని, కార్తీక్ గణేశ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. నవీన్ సుందరమూర్తి మాటలను అందిస్తున్న ఈ చిత్రానికి కుబేద్రన్. వీకే సహ నిర్మాతగానూ, జీ.మురుగభూపతి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గానూ వ్యవహరిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ కూడా చివరి దశకు చేరుకోవడంతో నయనతార త్వరలో ఆమె ప్రియుడు విఘ్నేశ్శివన్ దర్శకత్వం వహించనున్న కాత్తు వాక్కుల రెండు కాదల్ అనే ముక్కోణపు ప్రేమ కథా చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతుందన్నమాట. విజయ్సేతుపతి హీరోగా నటించనున్న ఇందులో సమంత మరో నాయకిగా నటించనుంది. -
వంశీగారి సినిమాలు చూస్తే మా ఊళ్లో తిరిగినట్టే ఉంటుంది : వీవీ వినాయక్
‘‘వంశీగారి సినిమాలు చూస్తే మా ఊళ్లో తిరిగినట్టే ఉంటుంది. ఆయన తీసిన చిత్రాల్లో ‘ఏప్రిల్ 1 విడుదల’ అంటే నాకు చాలా ఇష్టం. ఆ సినిమాను ఇప్పటికీ చూస్తుంటాను. ఆయన ఏ సంగీత దర్శకునితో చేసినా, అందులో వంశీగారి మార్క్ కనిపిస్తుంది. ఇళయరాజా తర్వాత చక్రి సంగీతం వంశీగారికి బాగా కుదిరింది’’ అని వీవీ వినాయక్ చెప్పారు. వంశీ దర్శకత్వంలో రూపొందిన 25వ చిత్రం ‘తను మొన్నే వెళ్లిపోయింది’’ అజ్మల్, నిఖితా నారాయణ్ జంటగా పూర్ణానాయుడు నిర్మించిన ఈ చిత్రం పాటల ఆవిష్కరణ హైదరాబాద్లో వినాయక్ చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా చక్రి మాట్లాడుతూ -‘‘నా అదష్ట సంఖ్య ఆరు. వంశీగారితో నాకిది ఆరో సినిమా. వంశీగారి సినిమా అంటే భారీ అంచనాలుంటాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుంది’’ అన్నారు. హీరోగా తనకిది తొలి తెలుగు సినిమా అని అజ్మల్ చెప్పారు. తనను అచ్చమైన తెలుగమ్మాయిలా చూపించారని నిఖితా నారాయణ్ సంతోషం వెలిబుచ్చారు. ఈ వేడుకలో కుమార్ చౌదరి, మల్టీడెమైన్షన్ వాసు, నందినీ రెడ్డి, పుప్పాల రమేష్, హర్షవర్థన్, మేర్లపాక గాంధీ, క్రాంతి మాధవ్, వెంకట్రావ్ తదితరులు పాల్గొన్నారు. -
'ప్రభంజనం' సినిమా స్టిల్స్


