breaking news
administrative office
-
Punjab: సివిల్ సర్వీస్ ఉద్యోగులకు అల్టీమేటం జారీ చేసిన సీఎం మాన్
పంజాబ్లో సివిల్ సర్వీస్ ఉద్యోగులు నిరసన బాట పట్టారు. అవినీతి ఆరోపణల కారణంగా లూథియానాలోని ప్రాంతీయ రవాణాశాఖ అధికారి నరీందర్ సింగ్ ధాలివాల్ను స్టేట్ విజిలెన్స్ బ్యూరో గత శుక్రవారం అరెస్ట్ చేసింది. నిబంధనలు ఉల్లఘించిన వారిపై చలాన్లు జారీ చేయకుండా వాహనాదారుల నుంచి లంచం తీసుకున్నారన్న ఆరోపణంతో అదుపులోకి తీసుకున్నట్లు విజిలెన్స్ బ్యూరో అధికారులు తెలిపారు. అయితే తమ సహోద్యోగిని అక్రమంగా, చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేశారంటూ సివిల్ సర్వీస్ ఉద్యోగులు సమ్మెకు దిగారు. ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ విధులు బహిష్కరించారు. అయిదు రోజులపాటు సామూహికంగా సాధారణ సెలవులపై వెళ్లారు. దీంతో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు లేక పనులు ఆగిపోయాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకు దిగిన సివిల్ సర్వీసెస్ అధికారులపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తీవ్రంగా స్పందించారు. ఈ తరహా నిరసనలను బ్లాక్మెయిల్గా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించారు. సమ్మె విరమించి బుధవారం మధ్యాహ్నం 2 గంటల్లోగా తిరిగి విధుల్లో చేరాలని, లేకుంటే వారిని సస్పెండ్ చేస్తామని హుకూం జారీ చేశారు. ఈ మేరకు సీఎం ట్వీట్ చేశారు. ‘కొందరు అధికారులు సమ్మె ముసుగులో విధులకు హాజరుకావడం లేదని నా దృష్టికి వచ్చింది. అవినీతి అధికారులపై ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యలకు వ్యతిరేకంగా వారు నిరసన చేస్తున్నారు. ఈ ప్రభుత్వం అవినీతిని ఏమాత్రం సహించదని అందరికీ స్పష్టంగా తెలియజేస్తున్నాం. అలాంటి సమ్మె బ్లాక్మెయిలింగ్, పని చేయకుండా చేతులు దులుపుకోవడమే అవుతుంది. బాధ్యతాయుతమైన ఏ ప్రభుత్వమూ దీనిని సహించదు. సమ్మెను చట్టవిరుద్ధంగా ప్రకటిస్తూ.. ఈరోజు(బుధవారం) మధ్యాహ్నం 2 గంటలలోపు విధుల్లో చేరని అధికారులందరినీ సస్పెండ్ చేయండి’ అని భగవంత్ మన్ పేర్కొన్నారు. అయితే, సీఎం హెచ్చరికను కూడా ఉద్యోగులు పట్టించుకున్నట్లు కనిపించడంలేదు. భగవంత్ మాన్ విధించిన డెడ్లైన్ ముగిసినప్పటికీ ఉద్యోగులు సమ్మె విరమించి విధుల్లో చేరలేదు. దీంతో అధికారులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అని ఉత్కంఠగా మారింది. -
ఎస్కేయూ అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్గా లక్ష్మీరాంనాయక్
ఎస్కేయూ : వర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా డాక్టర్ లక్ష్మీరాంనాయక్ను నియమితులయ్యారు. ఎస్కేయూ వీసీ ప్రొఫెసర్ కె.రాజగోపాల్ ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.సుధాకర్ బాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇది వరకు ఆయన ఫైనాన్స్ ఆఫీసర్గా ఉన్నారు. పదవీకాలం ముగియగానే సీనియర్ డిప్యూటీ రిజిస్ట్రార్ హోదాలో పరీక్షల విభాగానికి బదిలీ చేశారు. ఫైనాన్స్ ఆఫీసర్ స్థాయి కంటే తక్కువ హోదా కావడంతో ఉన్నతాధికారులు నూతనంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టును క్రియేట్ చేశారు. వర్శిటీ ఏఓ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ టు వీసీ (ఓఎస్డీ టు వీసీ) విభాగంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ విధులు నిర్వహిస్తారు.