breaking news
abdullapur
-
Crime News: నగ్నంగా మృతదేహాలు, వివాహేతర సంబంధమే కారణమా?
అబ్దుల్లాపూర్మెట్ : హైదరాబాద్ నగర శివారులోని అబ్దుల్లాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో జంట హత్యలు తీవ్ర కలకలం సృష్టించాయి. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్లోని వారాసిగూడ ప్రాంతానికి చెందిన యెడ్ల యశ్వంత్(22) క్యాబ్ డ్రైవర్గా పని చేసేవాడు. అతడికి అదే ప్రాంతానికి చెందిన జ్యోతి(28)అనే మహిళతో పరిచయం ఉంది. కొత్తగూడెం గ్రామ శివారులోని నిర్మానుష్య ప్రదేశానికి వచ్చిన వీరు హత్యకు గురై ఉంటారని భావించిన పోలీసులు క్లూస్టీంతో పలు ఆధారాలను సేకరించారు. మృతదేహాలు నగ్నంగా ఉండటం, యశ్వంత్ తలపై బలమైన గాయాలు ఉన్నాయి. జ్యోతి తలపై బండరాయితో కొట్టి చంపినట్లు గుర్తించారు. సంఘటన స్థలంలో చార్జింగ్లైట్లు.. సంఘటన స్థలంలో బ్యాగు, చార్జింగ్ లైట్లు, ప్లాస్టిక్పూలు, మొబైల్ చార్జర్తో పాటు కూల్డ్రింక్ సీసాలు లభ్యమయ్యాయి. సంఘటనా స్థలానికి కొద్ది దూరంలోనే బైక్ పార్కింగ్ చేసి ఉంది. వివాహేతర సంబంధమే వీరి హత్యకు కారణమై ఉండవచ్చనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిసింది. సంఘటనా స్థలాన్ని ఎల్బీనగర్ డీసీపీ సన్ప్రీత్సింగ్, వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి, అబ్దుల్లాపూర్మెట్ సీఐ వాసంస్వామి పరిశీలించారు. వివాహేతర సంబంధమే కారణమా? హత్యకు వివాహేతర సంబంధమే కారణమనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. యశ్వంత్, జ్యోతి ఏకాంతంగా ఉన్న సమయంలోనే హత్య జరిగినట్లు తెలుస్తోంది. తెలిసిన వారే వీరిని వెంబడిస్తూ వచ్చి హత్య చేశారా? అనే కోణంలో దర్యా ప్తు చేస్తున్నారు. జ్యోతి భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. మిస్సింగ్ కేసు నమోదు కాలేదు అబ్ధుల్లాపూర్మెట్ ఠాణా పరిధిలో దారుణహత్యకు గురైన ఎడ్ల యశ్వంత్ సంబంధించి ఎటువంటి మిస్సింగ్ కేసు నమోదు కాలేదని చిలకలగూడ సీఐ నరేష్ తెలిపారు. వారాసిగూడలోని మృతుడి తల్లితండ్రులు ఎడ్ల సురేష్, మంజుల మీడియాతో మాట్లాడుతూ క్యాబ్ డ్రైవర్గా పనిచేసే యశ్వంత్ ఆదివారం ఇంటినుంచి బయటికి వెళ్లినట్లు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం పోలీసులు సమాచారం అందించడంతో యశ్వంత్ సోదరుడు ఘటనా స్థలానికి వెళ్లినట్లు తెలిపారు. ఆదివారం ఇంటి నుంచి వచ్చాడు ఈనెల 1 న సాయంత్రం నా బైక్ తీసుకుని మా అన్న యశ్వంత్ బయటికి వచ్చాడు. ఒక్కోసారి రెండు మూడు రోజుల వరకూ ఇంటికి రాడు. అలాగే ఎక్కడికైనా వెళ్లాడనుకున్నాం. పోలీసుల ద్వారా సమాచారం తెలిసి ఇక్కడికి వచ్చాం. మా అన్నకు ఎవరితో విభేదాలు లేవు. హత్యకు గురైన మహిళతో పరిచయం ఉన్న విషయం తెలియదు. – మృతుడి సోదరుడు అనిరుద్ -
అత్యాచార యత్నం: ఇద్దరు యువకుల అరెస్ట్
హయత్నగర్(హైదరాబాద్ సిటీ): అబ్దుల్లాపూర్ మెట్ మండలం మజీద్ పూర్లో విద్యార్థినిని బుధవారం ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న తొమ్మిదవ తరగతి విద్యార్దినిని, స్థానికంగా నివాసం ఉంటున్న పాలపాటి రమేష్, మండలి శ్రీకాంత్ అనే ఇద్దరు యువకులు నిన్న(బుధవారం) సాయంత్రం బలవంతంగా స్విఫ్ట్ కార్లో ఎక్కించి అత్యాచార యత్నం చేయబోయారు. బాలిక కేకలు వేయడంతో, ఇద్దరినీ స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించారు. నిందితులు మద్యం మత్తులో ఈ ఘాతుకానికి ఒడిగట్టారని తెలిపారు.