శృతి హాసన్ ఇండస్ట్రీకి వచ్చి 16 ఏళ్లవుతోంది.
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అనేక సినిమాలు చేసింది.
అనగనగా ఓ ధీరుడు, 3, గబ్బర్ సింగ్, బలుపు, రేసుగుర్రం, ఆగడు, శ్రీమంతుడు, సలార్ వంటి ఎన్నో చిత్రాల్లో నటించింది.
మొదట్లో తన సినిమాలు సరిగా ఆడకపోవడంతో చాలామంది ఐరన్ లెగ్ అని విమర్శించారు.
కానీ తన టాలెంట్తో మంచి సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ విజయాలు అందుకున్న ఆమె ఆ తర్వాతి కాలంలో గోల్డెన్ లెగ్ హీరోయిన్గా నిలిచింది.
ప్రస్తుతం ఆమె కూలీ, ట్రైన్, జన నాయగన్, సలార్ 2 సినిమాలు చేస్తోంది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పెళ్లి పేరెత్తితేనే భయంగా ఉందని, అసలు మ్యారేజే చేసుకోనంటోంది.
కానీ, రిలేషన్లో మాత్రం ఉంటానని చెప్తోంది.


