మెరుగు పడిన అశోక్ సింఘాల్ ఆరోగ్యం | 'Vishwa Hindu Parishad patron Ashok Singhal's health conditon improving' says | Sakshi
Sakshi News home page

మెరుగు పడిన అశోక్ సింఘాల్ ఆరోగ్యం

Nov 15 2015 11:16 AM | Updated on Sep 3 2017 12:32 PM

మెరుగు పడిన అశోక్ సింఘాల్ ఆరోగ్యం

మెరుగు పడిన అశోక్ సింఘాల్ ఆరోగ్యం

విశ్వహిందూ పరిషత్ నేత అశోక్ సింఘాల్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఆదివారం న్యూఢిల్లీలో వెల్లడించారు.

న్యూఢిల్లీ : విశ్వహిందూ పరిషత్ నేత అశోక్ సింఘాల్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఆదివారం న్యూఢిల్లీలో వెల్లడించారు. గుర్గావ్ లోని మెదాంత మల్టీ స్పెషాల్టీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అశోక్ సింఘాల్ను ఈ రోజు ఉదయం కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పరామర్శించారు. అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సింఘాల్ ఆరోగ్య పరిస్థితి మెరుగు పడాలిని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు రాజ్నాథ్ సింగ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. గత రాత్రి అశోక్ సింఘాల్ శ్వాస తీసుకోవడం తీవ్ర ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో ఆయన్ని మెదాంత ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే.

గతనెల్లో నవరాత్రి పూజ సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ నగరంలో హువాన్ పూజ జరుపుతున్న సయమంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని ఏయిర్ అంబులెన్లో గుర్గావ్లోని ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే.  
 

Advertisement
 
Advertisement
Advertisement