పీఎన్బీ లాభాల క్షీణత | PNB Q2 net profit dips 11.5 per cent to Rs 549 crore | Sakshi
Sakshi News home page

పీఎన్బీ లాభాల క్షీణత

Nov 5 2016 3:02 PM | Updated on Sep 4 2017 7:17 PM

ప్రభుత్వరంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికంలో రూ. 549.36 కోట్ల నికర లాభం పోస్ట్ చేసింది.

చెన్నై: ప్రభుత్వరంగ బ్యాంకు  పంజాబ్ నేషనల్ బ్యాంక్  నికర లాభాల్లో క్షీణతను నమోదు చేసింది. సెప్టెంబర్ 30 తో  ముగిసిన   త్రైమాసికంలో రూ. 549.36 కోట్ల నికర లాభం పోస్ట్ చేసింది. గత ఆర్థిక త్రైమాసికం రూ 621.03 కోట్ల పోలిస్తే ఇది 11.5 తగ్గినట్టు కంపెనీ బీఎస్ సీ ఫైలింగ్ లో తెలిపింది. మొత్తం ఆదాయం స్వల్పంగా  పెరిగి రూ 14,218.27 కోట్లుగా నమోదు చేసింది.  గత ఏడాది ఇదే కాలంలో ఇది రూ 13,702  కోట్లుగా ఉంది.  
అయితే, మూడు నెలల కాలంలో బ్యాంకు సంపాదించిన మొత్తం వడ్డీ 4.16 శాతం క్షీణించి  రూ 11,830.36 కోట్లు. గత ఏడాది రూ. 12,345  కోట్లుగా ఉంది.  బ్యాడ్ రుణాల శాతం 34.6 శాతం పెరిగి రూ 2,534కోట్లు, గత ఏడాది రూ. 1,882కోట్ల బ్యాడ్ లోన్ల విలువ  ఉన్నట్టు  కంపెనీ తెలిపింది.   స్థూల మొండి బకాయిలు 13,63 శాతం పెరిగాయి. ఇదే కాలంలో గత ఆర్థిక సంవత్సరంలో 6.36 శాతం  ఉండగా రెండవ త్రైమాసికంలోనికర మొండి బకాయిలు కూడా 9.10 శాతానికిపెరిగాయి.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement