శ్రీవారి సేవలో న్యాయమూర్తులు | Sakshi
Sakshi News home page

శ్రీవారి సేవలో న్యాయమూర్తులు

Published Mon, Jul 13 2015 12:53 AM

శ్రీవారి సేవలో న్యాయమూర్తులు

తిరుమల శ్రీవారిని ఆదివారం ఇద్దరు న్యాయమూర్తులు దర్శించుకున్నారు. కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌కే ముఖర్జీ, తెలుగు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేసీ భాను ఉదయం నైవేద్య విరామ సమయంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి ఆలయంలోకి వెళ్లారు.

శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. తరువాత వకుళమాతదేవిని దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. న్యాయమూర్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి లడ్డూప్రసాదాలు అందజేశారు.
 - తిరుమల
 

Advertisement
Advertisement