
రూ. 7 లక్షలతో ఏటీఎం ఎత్తుకెళ్లారు
డబ్బు కోసం ఏటీఎం మిషన్ ను దుండగులు ఎత్తుకెళ్లిన ఘటన ఉత్తరాఖండ్ ఉధమ్ సింగ్ నగర్ జిల్లా పంత్ నగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది.
రుద్రపూర్: డబ్బు కోసం ఏటీఎం మిషన్ ను దుండగులు ఎత్తుకెళ్లిన ఘటన ఉత్తరాఖండ్ ఉధమ్ సింగ్ నగర్ జిల్లా పంత్ నగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. బుధవారం తెల్లవారుజామున దుండగులు ఈ లూటీకి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.
అశోక్ లేలాండ్ కంపెనీ ప్రధాన గేటు వెలుపల ఉన్న ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎం మిషన్ ను దుండగులు ఎత్తుకుపోయారని ఉధమ్ సింగ్ నగర్ జిల్లా ఎస్ఎస్పీ నిలేశ్ ఆనంద్ బర్నె తెలిపారు. ఏటీఎంలో 6 నుంచి 7 లక్షల రూపాయలు ఉన్నాయని వెల్లడించారు. దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.