ఏటీఎం మిషన్నే ఎత్తుకుపోయారు! | Sakshi
Sakshi News home page

ఏటీఎం మిషన్నే ఎత్తుకుపోయారు!

Published Tue, Nov 25 2014 2:30 PM

ఊహాత్మక చిత్రం

ఏటీఎం సెంటర్లో చోరీ చేయాలనుకున్నారు.. కానీ కుదరలేదు. దాంతో ఏకంగా ఏటీఎం మిషన్నే ఎత్తుకుపోయారు కొందరు దొంగలు.  సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. నరెలా ప్రాంతంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం మిషన్ను ఎవరో ఎత్తుకుపోయినట్లు ఆ ఏటీఎం కేంద్రాన్ని శుభ్రపరిచేందుకు వచ్చిన స్వీపర్ తెల్లవారుజామున గుర్తించి పోలీసులకు తెలిపారు.

వెంటనే పోలీసులు వచ్చి సీసీటీవీ కెమెరా ఫుటేజ్ చూద్దామనుకున్నారు. కానీ దొంగలు బాగా తెలివైనవాళ్లు కావడంతో సీసీటీవీ కెమెరాలను కూడా ఎత్తుకుపోయారు. ముందుగా ఆ ప్రాంతంలో ఉన్న వీధిలైట్లను పగలగొట్టి, ఆ తర్వాత మిషన్ మొత్తాన్ని ఎత్తుకుపోయారని, ఆ ఏటీఎం కేంద్రానికి సెక్యూరిటీ కూడా లేదని పోలీసులు తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement