బోల్తా పడిన బస్సు: 14 మంది మృతి | 14 passengers killed as bus overturns Godda | Sakshi
Sakshi News home page

బోల్తా పడిన బస్సు: 14 మంది మృతి

May 17 2014 4:15 PM | Updated on Sep 2 2017 7:28 AM

ఓ పెళ్లి వేడుకల కార్యక్రమం ముగించుకని తిరిగి వస్తున్న సమయంలో బస్సు బోల్తాపడి 14 మంది మృతి చెందిన ఘటన గొడ్డా జిల్లాలోని భాతొండా సమీపంలో శనివారం చోటు చేసుకుంది.

జార్ఘండ్: ఓ పెళ్లి వేడుకల కార్యక్రమం ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో బస్సు బోల్తాపడి 14 మంది మృతి చెందిన ఘటన గొడ్డా జిల్లాలోని భాతొండా సమీపంలో శనివారం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. పెళ్లి వేడుకులకు హాజరైన కోసం 31 మందితో కూడిన బస్సు.. తిరిగి వస్తుండగా భాతొండా సమీపంలోని పోరియాహత్ బ్లాక్ వద్ద అకస్మికంగా బోల్తాకొట్టింది. దీంతో 14 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఇందులో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికత్స అందిస్తున్నట్లు ఎస్పీ అజయ్ లిండా తెలిపారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement