యువతకు భరోసా | youth getting chances thorugh rajiv yuva shakti scheme | Sakshi
Sakshi News home page

యువతకు భరోసా

Nov 15 2014 3:36 AM | Updated on Aug 17 2018 2:53 PM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతీ, యువకులకు రాజీవ్ యువశక్తి పథకం ద్వారా భరోసానిస్తుంది.

ఆదిలాబాద్ కల్చరల్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతీ, యువకులకు రాజీవ్ యువశక్తి పథకం ద్వారా భరోసానిస్తుంది. యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ఎందరో మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు. జిల్లాలో ప్రతి సంవత్సరం యూనిట్ల సంఖ్య పెరుగుతోంది. యువతకు భరోసాగా ఈ పథకం నిలుస్తోంది. అయితే అనుకున్నంతగా బ్యాంకర్లు యువతకు రుణాలు ఇవ్వడానికి సుముఖంగా లేరనే ఆరోపణలూ ఉన్నాయి.

పేద నిరుపేద యువత వద్దకు ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు చేసే ప్రయత్నం కొంత బ్యాంకర్ల పుణ్యమా అంటూ దూరమవుతున్నట్లు కనిపిస్తోంది. బ్యాంకర్లు మరింతగా యువత రుణాలు అందించేందుకు ముందుండేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు యువకులు కోరుతున్నారు. గతేడాది రాష్ట్రస్థాయిలో రాజీవ్‌యువ శక్తి రుణాలు అందించడంలో జిల్లా అగ్రస్థానంలో ఉంది. 360 యూనిట్లు జిల్లాకు కేటాయించగా అవి పూర్తిగా మంజూరు చేసి, ఇతరత్రా జిల్లాలో పూర్తిగాని యూనిట్లను జిల్లాకు మలిచి 520 యూనిట్లు అందించారు. రాష్ర్టంలోనే  యువతకు రుణాలు అందించడానికి కృషి చేసిన యువజన సర్వీసుల శాఖకు రాష్ట్ర ప్రభుత్వం అవార్డు అందించింది. విస్తీర్ణంలో జిల్లా పెద్దగా ఉండటంతో నిరుద్యోగ యువత ఎక్కువగా ఉండటంతో అనుకున్నంతగా బ్యాంకర్లు సహకరించడం లేదని తెలుస్తోంది. కొన్ని సందర్భాల్లో బ్యాంకర్లు అర్హులకు న్యాయం చేయడం లేదనే విమర్శ కూడా ఉంది.

 యువతకు అందించిన యూనిట్లు
 రాజీవ్ యువశక్తి పథకంలో బాగంగా జిల్లా నిరుద్యోగ యువతీ యువకులకు జిల్లాయువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో రుణాలు అందించారు. 2010-2011 సంవత్సరంలో 281 యూనిట్లకు గానూ అన్నింటినీ మంజూరు చేశారు. 2011-12 సంవత్సరానికి గానూ 189 యూనిట్లకు గానూ 189 మంజూరు చేశారు. 2012-13 సంవత్సరానికి 350 యూనిట్లకు 439 యూనిట్లు అందించనున్నారు. 2014-15 సంవత్సరంలో 365 యూనిట్ల లక్ష్యం ఉంది. అయితే ఇప్పటికే 110 యూనిట్లు మంజూరయ్యాయి. లబ్ధిదారుల ఖాతాలలో నిధులు జమ అయ్యాయి. రుణమాఫీ విషయంలో బ్యాంకర్లు రైతులకు రుణాలు అందించడంలో బిజీగా ఉండటంతో రాజీవ్ యువశక్తి రుణాలకు బ్రేక్ పడింది.

 దరఖాస్తు గడువు ఈ నెల 20
 తెలంగాణ రాష్ట్రంలోని పది జిల్లాలో ఏ రాష్ట్రంలో రాజీవ్ యువశక్తి పథకాల రుణాలు మంజూరు కాలేదు. కానీ జిల్లాలోనే 110 యూనిట్లు మంజూరు కాగా, 100 బ్యాంకుల్లో మంజూరు కన్సల్టింగ్ ఇచ్చి ఉన్నాయి. రైతుల రుణమాఫీలో విషయంలో బీజీగా ఉండటంతో దరఖాస్తుల గడుపు నవంబర్ 20కి పెంచారు. జిల్లాలో మరింతగా యువకుల నుంచి దరఖాస్తులను ఆహ్వనిస్తున్నట్లు అదికారుల చెబుతున్నారు.జిల్లాలోని ఆయా మండలాల ఎంపీడీవోలు, మున్సిపల్ కమీషనర్‌ల కార్యాలయాలకు రాజీవ్ యువశక్తి దరఖాస్తు పారాలను చేరాయి. మండలాల్లో, మున్సిపాలిటీల ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ సమక్షంలో ఎంపిక చేసి రుణాలను అందజేయనున్నారు. ఇందులో రుణాలకు రూ. 30వేలు సబ్సిడిని అందిస్తారు. 60 వేల రుణం తీసుకున్న వారికి 30 శాతం ప్రభుత్వం చెల్లిచగా, 30 వేలు సబ్సిడి లబిస్తుంది. లక్షనుంచి రెండు లక్షల రుణాల తీసుకునే వారు రూ.10శాతం బ్యాంక్‌లో డిపాజిట్ చేయాలి. 60 వేల రుణం తీసుకునే వారికి ఇది డిపాజిట్ చేయనవసరం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement