నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములు అమ్మి నిధులు సమకూరుస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలోని పట్టణప్రాంత ఎమ్మెల్యేలతో ఆయన ఇష్టాగోష్టి సమావేశం నిర్వహించారు. పట్టణప్రాంతాల్లో రహదారుల నిర్మాణం, మురికివాడల మెరుగు, గృహనిర్మాణానికి కొత్త విధానం తీసుకొస్తామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల సమన్వయంతో తదుపరి కార్యాచరణ ఉంటుందన్నారు. జిల్లా, పట్టణ కేంద్రాల్లో ప్రభుత్వ కార్యాలయాల స్థితిగతులు మెరుగుపడాల్సి ఉందని ఆయన చెప్పారు.
ప్రభుత్వ కార్యాలయాల విషయంలో సొంత భవనాలు కావాల్సినవి, మరమ్మతులు చేయాల్సినవి, కొత్తగా కట్టాల్సిన వాటిపై కలెక్టర్ల నుంచి నివేదిక తెప్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు. పట్టణప్రాంతాల్లో కూడా డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ పథకం అమలు చేస్తామన్నారు. రోడ్ల మరమ్మతులు, నిర్వహణ బాధ్యతను ఐదేళ్ల వరకు కాంట్రాక్టర్లకు అప్పగిస్తామని తెలిపారు. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, గజ్వేల్ పట్టణాలకు రింగ్ రోడ్లు ఏర్పాటుచేస్తామన్నారు. అన్ని జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు నాలుగు లేన్ల రోడ్ల నిర్మాణం చేపడతామని ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చారు.
ప్రభుత్వభూములు అమ్మి నిధులు తెస్తాం: కేసీఆర్
Published Mon, Nov 24 2014 2:48 PM
Related news
-
హైవేలపై ఆగి ఉన్న మృత్యువు
సాక్షి, హైదరాబాద్: కొందరి నిర్లక్ష్యం మరికొందరిపాలిట మృత్యుపాశమవుతోంది. అనుమతి లేకున్నా జాతీయ రహదారుల వెంట నిలిపి ఉంచుతున్న భారీ వాహనాలు ఢీకొని దుర్మరణంపాలవుతున్నారు. జాతీయ రహదారుల్లో వేగంగా దూసుకెళ్లే వాహనదారులు ముందు ఆగిన లారీలు, భారీ ట్రక్కులను గుర్తించే లోపే నష్టం జరిగిపోతోంది. ఏప్రిల్ 25న కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగపురం వద్ద హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీ కొట్టడంతో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 22న సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురం శివారులో జాతీయ రహదారిపై ఆగి ఉన్న కంటైనర్ లారీని కారు వెనుక నుంచి ఢీ కొట్టడంతో కారు మొత్తం కంటైనర్ కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు మృత్యువాతపడ్డారు. ఈ తరహా ప్రమాదాలు పెరుగుతుండటం వాహనదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. రోజుకో రోడ్డు ప్రమాదం.. మూడు రోజులకొకరు మృతి రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ నివేదికల ప్రకారం చూస్తే తెలంగాణలో ఈ తరహాలో జాతీయ రహదారుల వెంట ఆగి ఉన్న లారీలు, ట్రక్కులను ఢీకొట్టడం కారణంగా ప్రతి రోజూ కనీసం ఒక ప్రమాదం జరుగుతోంది. ఈ ప్రమాదాల కారణంగా ప్రతి మూడు రోజులకు ఒకరి చొప్పున ప్రాణాలు కోల్పోతున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2018 నుంచి 2022 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ తరహా రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 600 మంది మృతి చెందగా, వందలాది మంది క్షతగాత్రులయ్యారు. 2022లో తెలంగాణలో మొత్తం 331 రోడ్డు ప్రమాదాలు ఈ తరహాలో జరగ్గా, 128 మంది మృతిచెందినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఎక్కువ ప్రమాదాలు తెల్లవారుజామున 3 నుంచి ఉదయం 6 గంటల మధ్య జరగడం గమనార్హం. ప్రమాదాలు జరిగిన సమయంలో ఆగిఉన్న లారీలను ఢీకొట్టే కార్లు గంటకు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగం ఉంటున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. హైవేలపై పార్కింగ్ చేస్తే చర్యలు తప్పవుజాతీయ రహదారుల వెంట భారీ వాహనాలు నిలిపి ఉంచడం, పార్కింగ్ చేయడం చట్ట ప్రకారం నేరం. అలా వాహనాలు నిలిపితే ఐపీసీ 304 సెక్షన్ కింద కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. జాతీయ రహదారుల వెంట ఉన్న పోలీస్ స్టేషన్ల పరిధిలోని పోలీసులు ఈ తరహాలో వాహనాలు నిలపకుండా పెట్రోలింగ్ చేస్తున్నారు. అయితే ఇటీవల తెల్లవారుజాము సమయంలోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నందున ఆ వేళల్లో పోలీసులను మరింత అప్రమత్తం చేసేలా సర్క్యులర్ను జారీ చేస్తాం. – మహేష్ భగవత్, తెలంగాణ రోడ్డు భద్రత విభాగం అడిషనల్ డీజీ ప్రమాదాలకు కారణమవుతున్న ప్రధాన నిర్లక్ష్యం ఇలా.. » జాతీయ రహదారుల వెంట వాహనాలు నిలిపి ఉంచవద్దని నిబంధనలు ఉన్నా.. భారీ ట్రక్కులు, లారీల డ్రైవర్లు కొందరు వీటిని విస్మరిస్తున్నారు. » ఏదైనా మరమ్మతుల కారణంగా వాహనం తప్పక ఆపాల్సి వస్తే వెనుక నుంచి వాహనదారుడికి ఆ విషయం తెలిసేలా పార్కింగ్ లైట్లు తప్పక ఆన్ చేసి పెట్టాలి. సేఫ్టీ ట్రైయాంగిల్ ఆకారాన్ని వాహనానికి కొంత దూరంలో పెట్టాలి. » జాతీయ రహదారుల వెంట ప్రత్యేకంగా కేటాయించిన స్థలంలోనే వాహనాలు నిలిపి ఉంచాలి. కానీ చాలామంది అలా చేయడం లేదు » డ్రైవర్ అలసిపోయినప్పుడు తెల్లవారుజాము సమయంలో వాహనాన్ని జాతీయ రహదారి వెంటే నిలిపి ఉంచి నిద్రిస్తుండడం సైతం మిగిలిన వాహనదారులకు మృత్యుపాశమవుతోంది. -
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (30-04-2024)
-
TS SSC 2024 Results: ఒక్క క్లిక్తో టెన్త్ రిజల్ట్స్ చూస్కోండి
క్లిక్ చేయండి పదో తరగతి ఫలితాలు చెక్ చేస్కోండి -
TS SSC Results 2024: తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు. ఫాస్ట్గా రిజల్ట్ను చూసుకునేందుకు సాక్షి ఎడ్యుకేషన్ వెసులుబాటు కల్పిస్తోంది.ఫలితాల కోసం క్లిక్ చేయండిఈ ఏడాదికిగానూ ఐదు లక్షల మంది పరీక్ష రాసినట్లు ఎడ్యుకేషన్ సెక్రటరీ బుర్రా వెంకటేశం తెలిపారు. ఈ ఏడాది ఫలితాల్లో బాలికలదే పైచేయి అని ఎడ్యుకేషన్ సెక్రటరీ బుర్రా వెంకటేశం తెలిపారు. పదో తరగతి ఫలితాల్లో మొత్తం 91.31 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 93.23 శాతం, బాలురు 89.42 శాంత ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. 3927 పాఠశాలలు ఉత్తీర్ణత సాధించాయని.. నిర్మల్ జిల్లా 99.05 శాతంతో మొదటి స్థానం, వికారాబాద్ జిల్లా 65.10 శాతం చివరి స్థానంలో నిలిచిందని చెప్పారు. 4లక్షల 94 వేల 207 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, ఇందులో 4,51, 272 మంది ఉత్తీర్ణత సాధించారు. జూన్ 3 నుండి 13 వరకు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. -
అమిత్ షా ఫేక్ వీడియో.. సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
అమిత్ షా ఫేక్ వీడియో.. సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
Related News by category
-
‘ఆయన’గెలిచారు..ఆమెకు తెలియదు
సాక్షి, ఆదిలాబాద్: జీవితంలో ఎవరైనా ఏదైనా సక్సెస్ సాధిస్తే మొదట కుటుంబ సభ్యులతో ఆనందం పంచుకుంటారు.. అయితే మాజీ ఎంపీ మధుసూదన్రెడ్డికి మాత్రం ఈ సంతోషం పంచుకునేందుకు ఆ అవకాశం లేకుండా పోయింది.. ఆయన భార్య అప్పటికే విగత జీవి.. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఆయన పేరు ఖరారైన తర్వాత కొద్ది రోజులకు ఓ శుభకార్యంలో పాల్గొనేందుకు కారులో ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా తుప్రాన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె తీవ్ర గాయాలపాలై కోమాలోకి వెళ్లిపోగా ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మార్చిలో ఈ ప్రమాదం జరగగా ఏప్రిల్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. మూడేళ్ల తర్వాత ఆయన ఎంపీగా ఉన్న కాలంలోనే ఆమె అదే పరిస్థితిలో ఈ లోకం విడిచి వెళ్లిపోయింది.న్యాయవాద వృత్తి నుంచి..ఆదిలాబాద్లో టి.మధుసూదన్రెడ్డి అప్పటికే దశాబ్దాలుగా ప్రముఖ న్యాయవాదిగా పేరు గడించారు. అప్పుడు 58 ఏళ్ల మధ్య వయస్సు.. భార్య భూలక్ష్మి, అప్పటికే పెళ్లిళ్లు జరిగిన కుమారుడు ప్రకాష్రెడ్డి, కూతురు సంగీత, మనుమలు, మనుమరాళ్లతో సంతోషంగా గడుపుతున్నారు. 2004లో ఆయనకు బీఆర్ఎస్ నుంచి ఆదిలాబాద్ ఎంపీ టిక్కెట్ ఖరారైంది. మార్చి 1న ఆయన ఆదిలాబాద్కు చెందిన ఓ న్యాయవాది కూతురి వివాహం హైదరాబాద్లో ఉండడంతో మధుసూదన్రెడ్డి భార్య భూలక్షి్మతో కలిసి కారులో డ్రైవర్తో సహా బయల్దేరి వెళ్లారు. అయితే మార్గమధ్యలో మధుసూదన్రెడ్డి కారు నడుపుతుండగా భార్య ముందర కూర్చుంది.డ్రైవర్ వెనుక సీటులో ఉన్నాడు. తుప్రాన్ వద్ద అనుకోని పరిస్థితిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భూలక్షి్మకి తీవ్ర గాయాలు కాగా మధుసూదన్రెడ్డికి మెడ వద్ద స్వల్ప గాయాలతో బయట పడ్డారు. ఈ ఇద్దరిని హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. అయితే భూలక్ష్మి కోమాలోకి వెళ్లిపోయింది. మధుసూదన్రెడ్డి చికిత్స అనంతరం తేరుకున్నారు. ఏప్రిల్ 20న 14వ లోక్సభ మొదటిదశ ఎన్నికలు జరిగాయి. మే 13న ఫలితాలు వెలువడ్డాయి. బీఆర్ఎస్ అభ్యర్థి మధుసూదన్రెడ్డి 4,15,429 ఓట్లు, టీడీపీ అభ్యర్థి వేణుగోపాల్చారి 3,74,455 ఓట్లు సాధించారు. ఆదిలాబాద్ ఎంపీగా మధుసూదన్రెడ్డి గెలిచారు. ప్రముఖ న్యాయవాదిగా తన విజయాన్ని చూసిన భాగస్వామి భూలక్ష్మి ప్రజాప్రతినిధిగా ఎంపికయ్యారన్న విషయం కూడా తెలియకుండానే కోమాలోనే 2007లో ఆమె కన్ను మూశారు.మొదటిసారి ఎన్నికల్లో..బీఆర్ఎస్ (టీఆర్ఎస్) పార్టీ 2001 సంవత్సరంలో ఆవిర్భవించింది. 2004 సాధారణ ఎన్నికల్లో యూపీఏ భాగస్వామ్య పార్టీలతో కలిసి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసింది. కాంగ్రెస్, వామపక్ష పార్టీలతో కలిసి రాష్ట్రంలో పోటీ చేసింది. కొత్త పార్టీగా ఆ ఎన్నికల్లో 26 అసెంబ్లీ స్థానాలతో పాటు ఐదు పార్లమెంట్ స్థానాల్లో గెలుపొందింది. ఈ ఎన్నికల్లోనే ఆదిలాబాద్ ఎంపీగా మధుసూదన్రెడ్డి గెలిచారు. ఆ ఐదుగురు ఎంపీల్లో పార్టీ అధినేత కేసీఆర్ కరీంనగర్ నుంచి గెలుపొందగా మెదక్ నుంచి ఆలె నరేంద్ర, హన్మకొండ నుంచి బి.వినోద్ కుమార్, వరంగల్ నుంచి దరావత్ రవీందర్ నాయక్ ఉన్నారు. దేశంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.ప్రత్యేక రాష్ట్ర సాధన ధ్యేయమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీకి ఉండగా, ఆ దిశగా యూపీఏ ప్రభుత్వం నుంచి ఎలాంటి ముందడుగు లేకపోవడంతో 2006లో బీఆర్ఎస్ యూపీఏ నుంచి వైదొలిగింది. పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేశారు. అందులో మధుసూదన్రెడ్డి కూడా ఉన్నారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో మధుసూదన్రెడ్డి తిరిగి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆదిలాబాద్ నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి ఇంద్రకరణ్రెడ్డి చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. దీంతో కృంగిపోకుండా ఆయన తిరిగి న్యాయవాది వృత్తి చేపట్టడం గమనార్హం. 2015లో ఆయన గుండెపోటుతో మృతి చెందారు. -
కూటమిది అసత్యాల మేనిఫెస్టో
చిలకలపూడి (మచిలీపట్నం): ప్రజలను మరొకసారి మోసం చేసేందుకే ఎన్డీయే కూటమి అసత్యాల మేనిఫెస్టోను విడుదల చేసిందని మాజీమంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) విమర్శించారు. ఆయన మంగళవారం రాత్రి కృష్ణాజిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. మూడు పార్టీలు కలిశామని కూటమి అభ్యర్థులు చెప్పుకొంటున్నా.. మేనిఫెస్టోపై ఒకరి ఫొటో లేకపోవటం విడ్డూరంగా ఉందన్నారు. మూడుఫోటోలు రెండు ఫోటోలయ్యాయంటే మేనిఫెస్టోలోని అంశాలు ఫొటోలేని వారికి ఇష్టం లేదా అని ప్రశ్నించారు. ఆడిన అబద్ధం ఆడకుండా జరగనవి, అసత్యాల మేనిఫెస్టో రూపొందించిన కూటమి సభ్యులు.. 40 ఏళ్ల రాజకీయ జీవితం, 14 ఏళ్లు ముఖ్యమంత్రి చేశానని చెప్పుకోవటం చూస్తే ప్రజలకే అర్థమవుతోందన్నారు. 50 ఏళ్ల వయసున్న సీఎం జగన్ 2019లో మేనిఫెస్టోను విడుదల చేసి 99 శాతం అమలు చేసి ప్రజలకు మంచిచేస్తేనే నాకు ఓటేయండని ధైర్యంగా అడుగుతున్నారని చెప్పారు. సంవత్సరానికి 71 వేల కోట్లతో సంక్షేమ పథకాలను ధైర్యంగా అమలు చేశారన్నారు.నిజాయితీగల వారైతే చంద్రబాబు 2014 మేనిఫెస్టోలో అమలు చేసిన వివరాలు చెప్పాలని డిమాండ్ చేశారు. డ్వాక్రా గ్రూపుల వారికి రూ.14 వేల కోట్ల రుణాలు, రైతులకు రూ.84 వేలకోట్ల రుణాలు మాఫీచేస్తానని చెప్పి.. వాటిని ఎంతవరకు అమలు చేశావో ప్రజలకు తెలుసని ఎద్దేవా చేశారు. జన్మభూమి కమిటీల పేరుతో పంచాయతీ వ్యవస్థను సర్వనాశనం చేసింది చంద్రబాబేనన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కూటమిగా ఏర్పడ్డామని, ఎన్డీయేలో కలిశామని చెప్పుకొంటున్న చంద్రబాబు మేనిఫెస్టోలో ప్రత్యేకహోదా, రైల్వేజోన్, విశాఖ స్టీల్ప్లాంట్, కడప స్టీల్ కర్మాగారం ఏర్పాటు విషయాలు ఎందుకు పొందుపరచలేదో చెప్పాలన్నారు. అధికారం కోసమే కూటమి అధికారం కోసమే కూటమిగా ఏర్పడ్డారని ఇప్పటికే ప్రజలు అర్థం చేసుకున్నారని చెప్పారు. ఏపీలో ఏడాదికి 10 శాతం మాత్రమే పెరుగుతున్న ఆదాయాన్ని బట్టి సీఎం జగన్ మేనిఫెస్టో రూపొందించారన్నారు. ఏడాదికి రూ.2 లక్షల కోట్లు అవసరమయ్యే విధంగా మేనిఫెస్టో రూపొందించిన చంద్రబాబు ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారో, ఏ విధంగా అమలు చేస్తారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి పాటుపడతానని చెబుతున్న చంద్రబాబు ఆయన పాలనలో ముస్లింలకు ఎమ్మెల్యే, మంత్రి పదవి ఇవ్వలేదని గుర్తుచేశారు. రాజ్యాధికారంలో మైనార్టీలు భాగస్వామ్యులు కాకూడదనుకునే బాబుకు ఇప్పుడు వారిపై ప్రేమ పుట్టుకొచ్చిందా అని నిలదీశారు. రజకులకు, కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిన హామీలు ఏమయ్యాయన్నారు. నాయీబ్రాహ్మణులకు ఉపకరణాలు ఇస్తామని చెబుతున్న చంద్రబాబు వారి పిల్లలకు చదువులు ఎందుకు చెప్పించవని ప్రశ్నించారు. వారు ఆర్థికంగా, విద్యాపరంగా ఎదగకుండా కులవృత్తిలోనే బతకాలా అని నిలదీశారు. రాష్ట్రంలో ప్రజలకు మేలు జరిగితేనే నాకు ఓటు వేయండని ధైర్యంగా చెబుతున్న సీఎం జగన్లాగా చెప్పగల దమ్ముందా అని చంద్రబాబును ప్రశ్నించారు.చంద్రబాబు ఏది చెబితే అదేనంటూ.. కూటమిలో పార్టీలు బుర్రకథల బ్యాచ్లా ఉన్నాయని ఎద్దేవా చేశారు. 2014లో కోటిమంది నిరుపేదలు ఉన్నప్పుడు ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి చెల్లిస్తానని మాయమాటలు చెప్పి ఏ ఒక్కరికి ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా..ఇప్పుడు 20 లక్షల మందికి ఉద్యోగాలిస్తానని అసత్యాల దొంతర అయిన మేనిఫెస్టోలో చెప్పటం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. -
నీ హామీలకు డబ్బెక్కడిది బాబూ?
సాక్షి, అమరావతి: అధికారమే పరమావధిగా ప్రజలను వంచించేందుకు సిద్ధమైన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మేనిఫెస్టోలో ఇష్టం వచ్చినట్లు ఇచ్చిన హామీల అమలుకు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు? ఈ ప్రశ్న ఇప్పుడు ఆర్థిక నిపుణులను సైతం వేధిస్తోంది. అలవికాని హామీలను ఎడాపెడా ఇచ్చేసిన చంద్రబాబు అసలు వాటిని అమలు చేయడం సాధ్యమా? అందుకు ఎంత ఖర్చు అవుతుంది? అంత సొమ్ము ఎక్కడి నుంచి సమీకరిస్తారు? అనే అంశాలకు సమాధానం లేదు. ప్రాథమిక అంచనాల ప్రకారం చంద్రబాబు మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను అమలు చేయాలంటే ఏడాదికి రూ.1.65 లక్షల కోట్లు ఖర్చవుతుంది. అంత డబ్బు సమీకరించుకునే అవకాశం ఉందా? రాష్ట్రంలో అందుకు తగ్గ వనరులు ఉన్నాయా?.. అంటే లేదనే సమాధానం వస్తుంది. వాస్తవికంగా ఆలోచిస్తూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించదు కాబట్టే సీఎం వైఎస్ జగన్కు ఇంకా సంక్షేమం అందించాలని మనసులో ఉన్నా కొత్త హామీలు ఇవ్వలేదు. అన్ని లెక్కలు వేసుకుని, వనరుల సమీకరణ చూసుకుని చేయగలిగే హామీలను మాత్రమే ఆయన మేనిఫెస్టోలో చేర్చారు. ప్రస్తుతం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల కోసం ఏటా రూ.70 వేల కోట్లు దాకా ఖర్చు చేస్తున్నారు. ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా పారదర్శకంగా నేరుగా లబ్దిదారులకే ప్రయోజనం చేకూరుస్తున్నారు.దీనికి అదనంగా మరికొంత లబ్ధిని జోడిస్తూ మేనిఫెస్టోను రూపొందించారు. తాము అమలు చేసే పథకాలు, కార్యక్రమాలు, వాటికి అయ్యే ఖర్చు, ఎక్కడి నుంచి సమీకరిస్తామనే విషయాలను ఆయన కూలంకషంగా వివరించారు. పథకాల అమలులో ఎక్కడా అవినీతికి తావు లేకుండా నేరుగా లబ్దిదారుల అకౌంట్లలోనే డబ్బు జమ చేయడం (డీబీటీ) లాంటి వినూత్న విధానాల ద్వారా చాలా పకడ్బందీగా ఐదేళ్లు ఆర్థిక క్రమశిక్షణ పాటించి ఇబ్బందికర పరిస్థితుల్లోనూ నెట్టుకొచ్చారు. పింఛన్లకు ఇంకా ఎక్కువ ఇవ్వాలని ఉన్నా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అనుకూలించవు కనుకే రూ.3,500 చొప్పున ఇస్తామని ప్రకటించారు. ఒకవేళ అప్పులు తెద్దామన్నా అవి కూడా పరిమితులకు లోబడే తేవాల్సి ఉంటుంది. అన్నీ బేరీజు వేసుకుని, ఉన్న వనరులను సది్వనియోగం చేసుకుంటూ పథకాలను కొనసాగించేందుకు సిద్ధమయ్యారు. వేలం పాటలా పోటీ పడి హామీలు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు కనీస ఆలోచన లేకుండా ఇష్టం వచ్చినట్లు హామీలు గుప్పించారు. చిత్తశుద్ధితో నెరవేర్చే ఉద్దేశం లేనందువల్లే వేలం పాటలో రేటు పెట్టినట్లుగా సీఎం జగన్ అమలు చేస్తున్న పథకాలకే తాను ఇంకా ఎక్కువ ఇస్తానని నమ్మబలికారు. అమ్మఒడి, రైతు భరోసా పథకాల పేర్లు మార్చి ఇష్టం వచ్చినట్లు ప్రకటించారు. సీఎం జగన్ అమలు చేస్తున్న చాలా పథకాలతోపాటు ఇతర రాష్ట్రాల్లో ప్రకటించిన పథకాలను సైతం కాపీ కొట్టి మేనిఫెస్టోలో చేర్చి ప్రజలను ఏమార్చేందుకు సిద్ధమయ్యారు. మరి ఇన్ని హామీలను అమలు చేయడం సాధ్యమా? ఇంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తారనే దానికి ఆయన వద్ద సమాధానం లేదు. మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు ఒక మీడియా ప్రతినిధి ఈ హామీల అమలుకు ఎంత ఖర్చవుతుందని అడగడంతో సమాధానం చెప్పకుండా కస్సుమని మండిపడ్డారు. దాన్నిబట్టే ఆయనకు తాను ఇచ్చిన హామీలపై చిత్తశుద్ధి లేదనే విషయం స్పష్టమైంది. సీఎం జగన్ ఇస్తున్నారు కాబట్టి తాను అంతకంటే ఎక్కువ ప్రకటించి ప్రజలను నమ్మించాలి, ఆ తరువాత ఎలాగూ అమలు చేసేది లేదని తనకు అలవాటైన రీతిలో వాగ్దానాలు చేస్తున్నారు. సాధ్యం కాదనే బీజేపీ పట్టించుకోలేదు చంద్రబాబు హామీలను అమలు చేయడం సాధ్యం కాదని గుర్తించడం వల్లే బీజేపీ ఆయన మేనిఫెస్టోను అంగీకరించలేదు. ప్రధాని మోదీతోపాటు బీజేపీ నేతల ఫొటోలు మేనిఫెస్టోలో కనీసం ముద్రించేందుకు కూడా ఒప్పుకోలేదు. చివరికి మేనిఫెస్టోను తాకడానికి సైతం బీజేపీ పరిశీలకుడు సిద్ధార్థనాథ్సింగ్ ఇష్టపడలేదంటే బాబు హామీలపై వారికి ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. అంటే చంద్రబాబు హామీలకు కేంద్రం నుంచి కూడా ఎలాంటి సహకారం ఉండదని చెప్పకనే చెప్పేశారు. రాష్ట్రంలో ఆర్థిక వనరులు సమకూర్చుకునే పరిస్థితులు లేక, కేంద్రం సహకరించకపోతే చంద్రబాబు అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తారనే దానికి సమాధానమే లేదు. అంటే ఆయన ఇచ్చిన హామీలు అమలు చేసేవి కావని తేటతెల్లమైంది. కేవలం ప్రజలను మభ్య పెట్టేందుకు, మరోసారి మాయ చేసేందుకే వేలం పాట మాదిరిగా సంక్షేమ పథకాలు ప్రకటించారు. పొరపాటున జనం నమ్మితే ఇక అంతే సంగతులు. 2014లో మాదిరిగా ఆ మేనిఫెస్టో మాయం కావడం ఖాయం. -
బాబు కిచిడీ మేనిఫెస్టో
సాక్షి, అమరావతి: చంద్రబాబు అంటేనే మోసం, మాయ, వెన్నుపోటు. ఏదో విధంగా ప్రజలను మభ్యపెట్టడం, అధికారంలోకి వస్తే అదే ప్రజలను మోసం చేసి, వెన్నుపోటు పొడిచి, తాను లాభపడటం.. ఇదే నైజం. ప్రజలకు మేలు చేసే మనసు ఆయనకు ఏ కోశానా లేదు. మంగళవారం విడుదల చేసిన తాజా మేనిఫెస్టోలోనూ చంద్రబాబు ఇదే నైజాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం ఏపీలో, పక్క రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాలనే కాపీ కొట్టి తన మేనిఫెస్టో తయారు చేశారు.నిబద్దతతో పనిచేసే నాయకుడైతే ప్రజలకు తానేమి మేలు చేస్తాడో ఆలోచించి, వాటిని మేనిఫెస్టోలో చెప్తాడు. కానీ, చంద్రబాబు ప్రజల కోసం ఏమీ చేయరన్నది గతంలో ఆయన పరిపాలనే విస్పష్టంగా చెబుతుంది. ఇటువంటి నాయకుడి మేనిఫెస్టోలో ఏ హామీలు ఉంటే ప్రజలకేం ఉపయోగం? అందుకే చంద్రబాబు ఇప్పటికే రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న ప్రజోపయోగ పథకాలు, పక్క రాష్ట్రాల్లో ఉన్నవీ తెచ్చి తాజా మేనిఫెస్టోలో చేప్పేసుకున్నారు.. ఏమాత్రం కష్టం లేకుండా. గతంలో 2104, 2019లో తాను ప్రజలను మోసగించడానికి ఇచ్చిన హామీలను కూడా ఈసారి మేనిఫెస్టోలో ఉంచారు.. ఇందులో ఆయన ఏమాత్రం సిగ్గుపడలేదు. ఈ మేనిఫెస్టోలో 177 హామీలు ఉన్నప్పటికీ, అవన్నీ కాపీ కొట్టినవి, పాతవే.అరువు తెచ్చుకున్న సూపర్ సిక్స్చంద్రబాబు తాజా మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ పేరుతో ప్రకటించిన ప్రధాన హామీలు అన్నీ అరువు తెచ్చుకున్నవే. వీటిలో సగం రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్న పథకాలు కాగా, మిగతావి పక్క రాష్ట్రాల నుంచి కాపీ కొట్టారు. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15 వేలు, ప్రతి రైతుకు ఏటా రూ.20 వేల ఆర్థిక సాయం అందించే పథకాలను అమ్మఒడి, రైతు భరోసా పేరుతో వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఐదేళ్ల నుంచి అమలు చేస్తోంది. వీటికే పేర్లు మార్చి, చంద్రబాబు మేనిఫెస్టోలో రాసుకున్నారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు కూడా వైఎస్సార్సీపీ నుంచి కాపీ కొట్టిందే. ఇది కాకుండా నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి, ప్రతి మహిళకి నెలకు రూ.1500, ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీలను తెలంగాణ, కర్ణాటక, ఇతర రాష్ట్రాల నుంచి కాపీ కొట్టారు. అంతే కాదు.. జాబు కావాలంటే బాబు రావాలంటూ 2014లో ఊదరగొట్టిన చంద్రబాబు.. జాబు లేదంటే నిరుద్యోగ భృతి అంటూ యువతను నిలువునా మోసం చేసి, మళ్లీ అదే హామీ ఇప్పుడూ ఇవ్వడమే ఆయనలోని గొప్పతనం.అవినీతి అమరావతిని మళ్లీ కడతారటఅధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ పేదలను పట్టించుకోని చంద్రబాబు.. మళ్లీ అధికారంలోకి వస్తే వారిని సంపన్నులను చేసేందుకు పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ పార్టనర్షిప్ (పీ4) పేరుతో పథకాలు ఇస్తానని ప్రకటించారు. అంతర్జాతీయ అవినీతి కుంభకోణంగా మారిన రాజధాని అమరావతి నిర్మాణాన్ని కొనసాగిస్తానని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల గురించి పట్టించుకోకుండా అమరావతి జపం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేస్తానని నమ్మబలుకుతున్నారు. విశాఖను పరిపాలన రాజధానిగా చేయడాన్ని వ్యతిరేకిస్తూ దాన్ని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు వద్దే వద్దంటూ అక్కడ హైకోర్టు బెంచిని తక్షణం ఏర్పాటు చేస్తామని నమ్మబలికారు. అగ్రిగోల్డ్ ఆస్తులను కొల్లగొట్టి లక్షలాది మందిని నడిరోడ్డున పడేసిన విషయాన్ని మరచిపోయి, ఇప్పుడు బాధిత కుటుంబాలను ఆదుకుంటామని చెబుతున్నారు.రూ.4 వేలు పింఛనంటూ మాయ హామీచంద్రబాబు అధికారంలో ఉన్న ఐదేళ్లూ సామాజిక పింఛన్లు రూ.1,000 మాత్రమే ఇచ్చారు. అందులోనూ చాలా మోసాలు. ఇచ్చిందే తక్కువ. అందులోనూ జన్మభూమి కమిటీల దందా, అవినీతి. వృద్ధులు నెల నెలా నానా అవస్థలుపడి ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లి, అక్కడ ఇచ్చినంత తెచ్చుకోవాల్సిన దుస్థితి. అవ్వాతాతలు, దివ్యాంగులు, ఇతర పెన్షనర్లకు చంద్రబాబు పెట్టిన అవస్థల నుంచి విముక్తి కల్పిస్తూ సీఎం జగన్ చర్యలు చేపట్టారు. బాబు రూ. వెయ్యి పింఛను ఇవ్వగా, దానిని సీఎం జగన్ రూ.3 వేలు ఇచ్చి, ఇంటి వద్దనే వలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తున్నారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఐదేళ్లుగా ఇస్తున్న రూ.3 వేలను రూ.4 వేలకు పెంచి ఇస్తామని చంద్రబాబు మభ్యపెట్టే హామీ ఇచ్చారు. అది కూడా 50 ఏళ్లకే ఇస్తామని చెప్పడం మాయ చేయడానికేనని కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. గతంలో చేయకుండా ఇప్పుడు మెగా డీఎస్సీ ప్రకటిస్తామని, ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ అంటూ ప్రకటించారు. ప్రతి ఇంటికీ మేలు చేసేలా జగన్ ప్రవేశపెట్టిన వలంటీర్ల వ్యవస్థను తూలనాడి, 2 నెలలుగా వారిని విధులకు దూరం చేసిన చంద్రబాబు.. వారికి రూ.10 వేలు గౌరవ వేతనం ఇస్తానని ప్రకటించడం ఆయన దివాళాకోరుతనమే. ఉద్యోగుల గురించి ఏనాడూ పట్టించుకోని చంద్రబాబు.. ఇప్పుడు అధికారంలోకి వస్తే వారికి మేలు చేస్తానంటున్నారు.ఇది మరో రకం మోసంఎన్డీఏలో భాగస్వామిగా ఉండి ఆ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో చేయాలని చెబుతున్న ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని రద్దు చేస్తామని చంద్రబాబు మేనిఫెస్టోలో ప్రకటించడమూ ప్రజలను మోసం చేయడమే. 2014, 2019 మేనిఫెస్టోల్లో చెప్పినట్టుగానే ఈ మేనిఫెస్టోలోనూ పోలవరం ప్రాజెక్టును సత్వరం పూర్తి చేస్తామని, నదుల అనుసంధానం, ప్రతి ఎకరానికి నీరు అంటూ పాత హామీలను పెట్టారు. రాష్ట్రంలో ఇప్పుడు పారదర్శకంగా ఇసుక విధానం అమలవుతుండగా తన హయాంలో అభాసుపాలైన ఉచిత ఇసుక విధానాన్ని మళ్లీ తెస్తానని చంద్రబాబు ప్రకటించారు. ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్ వంటి సకల మౌలిక వసతులతో గ్రామాల ముఖ చిత్రమే మారిపోయినా, గ్రామాల్లో మౌలిక వసతులు, మండల, జిల్లా కేంద్రాల్లో వర్క్ ఫ్రం హోం స్టేషన్లు అంటూ హామీలిచ్చారు. బీసీలకు బురిడీచంద్రబాబు అధికారంలో ఉండగా బీసీలకు స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్లు తగ్గించేశారు. ఇప్పుడు 34 శాతం ఇస్తామని చెప్పడం ఆ వర్గాలను మభ్యపెట్టడమే. 2014, 2019 మేనిఫెస్టోల్లో చెప్పినట్టుగానే ఇప్పుడూ బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం చేస్తామని మరోసారి పాత హామీనే ఇచ్చారు. మరోసారి మహిళలను మోసం చేసేలా..స్వయం సహాయక సంఘాలను మళ్లీ కొత్త తరహాలో మోసం చేయడానికి చంద్రబాబు కొత్త హామీ ఇచ్చారు. స్వయం సహాయక సంఘాల రుణాలు మాఫీ చేస్తానని 2014 మేనిఫెస్టోలో హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా మహిళలందరినీ వంచించి, ఆ సంఘాలను దివాలా తీయించారు చంద్రబాబు. ఇప్పుడు రూ. 3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణాలు ఇస్తామంటూ నిస్సిగ్గుగా మరోసారి ప్రకటించారు. ఇది మరోసారి మహిళలను వంచనకు గురిచేయడమే.ఆరోగ్యశ్రీకి మంగళమే!సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే ఆరోగ్య శ్రీ పథకం కింద రూ.25 లక్షల విలువైన వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నారు. చంద్రబాబు ఈ పథకాన్ని నిర్వీర్యం చేసేలా ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా ఇస్తామని ప్రకటించారు. అంటే చంద్రబాబు వస్తే ప్రజలకు బీమానే వర్తిస్తుంది తప్ప, ఆరోగ్య శ్రీ ఉండదు. ఆరోగ్యానికి భరోసా ఉండదు. డిజిటల్ హెల్త్ కార్డులు ఇప్పటికే రాష్ట్రంలో కోట్ల మందికి పంపిణీ చేసినా తానూ చేస్తానని చెప్పారు. విలేజ్ క్లినిక్లు, ఫ్యామిలి డాక్టర్, జగనన్న సురక్ష పథకాలన్నీ వైద్యాన్ని పేదలకు చేరువ చేయగా వాటికి ఏమాత్రం సాటిరాని, తీసికట్టుగా జన ఔషధి కేంద్రాలు, బీపీ, షుగర్ వ్యాధులకు ఉచితంగా జనరిక్ మందులు పంపిణీ చేస్తామని చెబుతున్నారు. విద్యా రంగంలో వైఎస్ జగన్ విప్లవాత్మకమైన మార్పులు తెస్తే, వాటి దరిదాపుల్లోకి సైతం రాలేని స్థితిలో కేజీ టు పీజీ సిలబస్ని రివ్యూ చేస్తామని, మూతపడిన పాఠశాలలు పునరుద్ధరిస్తామంటూ పస లేని హామీలు ఇచ్చారు. ఫీజు రీయింబర్స్మెంట్ ప్రస్తుతం అమల్లో ఉండగా, నేరుగా కాలేజీలకే రుసుం చెల్లిస్తామని ప్రకటించి దానిపైనా తిరకాసు హామీ ఇచ్చారు.ఇప్పుడు అమలవుతున్నవే ఆయనొచ్చి చేస్తాడట..» సీఎం జగన్ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ముస్లింలు, కాపులు, వడ్డెరలు, ఆర్య వైశ్యులు, క్షత్రియులు, అగ్రవర్ణ పేదలకు నవరత్నాలతో రూ.వేల కోట్ల సంక్షేమ అందిస్తుంటే.. ఇప్పుడు బాబు వారి సంక్షేమానికి చర్యలు తీసుకుంటానని అనడం కొసమెరుపు.» 2019 ఎన్నికల్లో ఇచ్చినట్టుగానే గ్రామాల్లో పేదలకు 3 సెంట్ల ఇళ్ల స్థలం ఇస్తానని, పక్కా ఇళ్లు కట్టిస్తానంటూ పాత పాటే పాడారు. నిజానికి ఈ ఐదేళ్లలో పేదలకు సీఎం వైఎస్ జగన్ 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వగా, వీటిలో ఇప్పటికే 22 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. ఆయనొచ్చి చేసేదేముంది?» నైపుణ్య శిక్షణ కేంద్రాలు, క్రీడా మౌలిక సదుపాయాలు, డిజిటల్ లైబ్రరీలు ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నా, వాటి గురించి మేనిఫెస్టో చేర్చడం ప్రజలను మభ్యపెట్టడం కాక మరేమిటి? కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇప్పటికే రాష్ట్రంలో అమల్లో ఉండగా తానూ అమలు చేస్తానని ప్రకటించడం పక్కా మోసమే.» వైఎస్ జగన్ ప్రభుత్వం ఏడాది నుంచి రాష్ట్రంలో శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు ఇస్తుండగా.. తాము అందిస్తామంటూ అదే హామీ ఇచ్చారు.» గొర్రెల పెంపకం యూనిట్లకు రాయితీలు, బీమా సౌకర్యం ఇప్పటికే ఉండగా దాన్ని తాను ఇస్తానని అంటున్నారు.» నాయీ బ్రాహ్మణుల షాపులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తుండగా దాన్ని ఇస్తానంటూ చెప్పుకొంటున్నారు. » మత్స్యకారుల సంక్షేమానికి ఇప్పటికే వైఎస్సార్సీపీ రూ.10 వేలు ఆర్థిక సాయం అందిస్తుండగా దాన్ని పెంచుతామని నమ్మబలికారు.» వైఎస్సార్సీపీ వాహన మిత్ర పథకం అమలు చేస్తూ రవాణా రంగ కార్మికులకు మేలు చేస్తుండగా, ఇప్పుడు తాను డ్రైవర్లకు ప్రమాద బీమా ఇస్తానని, వడ్డీ సబ్సిడీ ఇస్తానంటూ నమ్మబలికారు.» వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్ విద్యుత్ సరఫరా ప్రస్తుతం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇస్తుండగా తాను అధికారంలోకి వస్తే ఇస్తానన్నారు.» వైఎస్ జగన్ సీఎం కాగానే ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయగా, ఇప్పుడు తాను ఏర్పాటు చేస్తానని ప్రకటించారు.» సేంద్రీయ వ్యవసాయం, డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ, ప్రభుత్వ గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీ యూనిట్ల వంటివన్నీ వైఎస్సాÆŠసీపీ ప్రభుత్వం చేస్తుండగా వాటిని తన మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. ఇప్పుడు అమల్లో ఉన్న పథకాలన్నీ తాను చేస్తాననడం ప్రజలను వంచించడమే కదా? -
వైఎస్సార్ పేరును కాంగ్రెస్సే ఇరికించింది
సాక్షి, అమరావతి: పీసీసీ అధ్యక్షురాలు షర్మిలను చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుతో తలదించుకుంటుందని అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డి మండిపడ్డారు. కుట్రపూరితంగా వైఎస్సార్ పేరును కేసుల్లో కాంగ్రెస్ పార్టీ ఇరికించిందని ఆరోపించారు. ఇదే విషయాన్ని ఎన్నోసార్లు షర్మిల సైతం చెప్పారన్నారు. తాను ఇరికించానని ఆమె నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని సవాల్ విసిరారు. లేకుంటే షర్మిల దేనికి సిద్ధమో చెప్పాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో మంగళవారం పొన్నవోలు సుధాకర్రెడ్డి మీడియాతో మాట్లాడారు. మహానేత వైఎస్సార్ను కాంగ్రెస్ పార్టీ దోషిగా చిత్రీకరించే కుట్రలను అడ్డుకునేందుకు తాను న్యాయపరంగా పోరాటం చేశానన్నారు. కానీ, షర్మిల మాత్రం వైఎస్సార్ మరణానంతరం ఆ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేసిన కాంగ్రెస్ పంచన చేరి తనపై దు్రష్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా గతంలో కాంగ్రెస్ పార్టీకి మహానేత వైఎస్సార్ పేరును ఉచ్ఛరించే అర్హత లేదన్న షర్మిల వ్యాఖ్యలను వీడియోలను ప్రదర్శించి పొన్నవోలు వినిపించారు. వైఎస్సార్పై కేసులు పెట్టింది కాంగ్రెస్ అన్న షర్మిల.. ఇప్పుడు మాట మారుస్తున్నారని మండిపడ్డారు. నాతో ఎవరూ కేసులు వేయించలేదు.. కాంగ్రెస్ నేత శంకర్రావు వైఎస్సార్ పేరును అత్యంత దారుణంగా చిత్రీకరిస్తూ కోర్టుకు లేఖలు రాశారని పొన్నవోలు సుధాకర్ రెడ్డి గుర్తు చేశారు. వ్యక్తిగత రాజకీయ స్వార్థం కోసం తాను మాటలు మార్చట్లేదన్నారు. ‘వైఎస్సార్ పేరును కేసుల్లో ఇరికిస్తుంటే అన్యాయమని స్పందించాను. అంతేగానీ నాతో ఎవరూ కేసులు వేయించలేదు. ఆ సంగతి తెలుసుకొని షర్మిల మాట్లాడాలి. 2011 డిసెంబర్లో నేను కేసు వేసే నాటికి కనీసం వైఎస్ జగన్ను చూడలేదు.. నాకు ఆయనతో పరిచయం లేదు. ఆనాడు వైఎస్సార్పై చంద్రబాబు, టీడీపీ నేతలు రాష్ట్రపతికి లేఖ రాసిన మాట వాస్తవం కాదా? ఇలాంటి కేసుల్లో సంతకాలు చేసిన మంత్రులు, సంబంధిత అధికారులు బాధ్యులు అవుతారు. కానీ వైఎస్సార్, వైఎస్ జగన్ ఎలా బాధ్యులు అవుతారు. ఈ వాస్తవం కోర్టుకు వివరించే ప్రయత్నం చేశాను’ అని పొన్నవోలు వివరించారు. రాజధానిలో చంద్రబాబు భూదోపిడీ, వందల కోట్ల విలువైన సదావర్తి భూముల దోపిడీ, తెలంగాణలో ఓటుకు కోట్లు, స్కిల్ డెవలప్మెంట్ కేసుల్లోనూ తాను పోరాటం చేశానన్నారు. బాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను చేసిన పోరాటం చూసి సీఎం జగన్ ఏఏజీగా అవకాశం కల్పించారన్నారు. క్విడ్ ప్రోకో అంటే వైఎస్సార్పై ఫిర్యాదు ఇచ్చిన శంకర్ రావుకు మంత్రి పదవి ఇవ్వడం కాదా అని నిలదీశారు. తన ఊపిరి ఉన్నంత వరకు చంద్రబాబు అక్రమాలపై పోరాటం చేస్తానన్నారు. షర్మిల చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి తనపై, సీఎం జగన్పై ఆరోపణలు చేయడం తగదని హితవు పలికారు. కొంత మంది పకోడిగాళ్లు షర్మిల భుజం మీద తుపాకీ పెట్టి తనను కాలుస్తున్నారని మండిపడ్డారు. అలాగే తన భుజం మీద తుపాకీ పెట్టి సీఎం జగన్ను కాల్చాలని చూస్తున్నారని.. ఈ విషయం షర్మిల తెలుసుకోవాలన్నారు.
Advertisement
Photos
View allVideo
View allమారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఐవోసీ లాభం సగానికి డౌన్
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
ధర పెరిగినా బంగారమే
బాంబీ బకెట్ అంటే ఏమిటి? కార్చిచ్చును ఎలా నియంత్రిస్తుంది?
కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
తప్పక చదవండి
- నిట్టనిలువునా చీలిపోతున్న 127 ఏళ్ల కంపెనీ
- ఊసరవెల్లి సిగ్గుపడుతోంది!
- శభాష్ సుమతి.. ప్రయాణికుడి ప్రాణం కాపాడిన పోలీస్
- నేను లేక.. మీరుండలేరు..!
- ‘ఆయన’గెలిచారు..ఆమెకు తెలియదు
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
Advertisement