సఫారీ వాహనాన్ని వదిలివెళ్లిన దుండగులు | Sakshi
Sakshi News home page

సఫారీ వాహనాన్ని వదిలివెళ్లిన దుండగులు

Published Thu, Jul 13 2017 12:16 PM

సఫారీ వాహనాన్ని వదిలివెళ్లిన దుండగులు - Sakshi

వికారాబాద్‌: జిల్లాలోని దరూర్‌ మండలం నాగసందర్‌ గ్రామ శివారులో గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం రాత్రి టాటా సఫారీ వాహనాన్ని వదిలేసి వెళ్లారు. రోడ్డు పక్కన వాహనం ఆగి ఉండటం గుర్తించిన స్థానికులు అక్కడ ఎవరూ లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వాహనాన్ని సీజ్‌ చేసి వేలిముద్రలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. వాహనం మధ్యప్రదేశ్‌ రిజిస్ట్రేషన్‌తో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ వాహనం సమీపంలోనే ఖాళీ మద్యం సీసాలతో పాటు కొన్నిదుస్తువులు చిందర వందరగా పడేసి ఉండటం అనుమానులకు తావిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement