గుర్తుతెలియని యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.
నల్గొండ: గుర్తుతెలియని యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలం లక్కవరం గ్రామ శివారులోని అటవీ భూమిలో గుర్తుతెలియని యువకుని మృతదేహాన్ని గురువారం స్థానికులు కనుకొన్నారు. 30 సంవత్సరాల వయసున్న యువకున్ని ఎక్కడో హత్యచేసి తమ గ్రామశివారుకు తీసుకువచ్చి పెట్రోల్ పోసి కాల్చివేశారని గ్రామస్థులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న చౌటుప్పల్ పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.