తెలంగాణకు ప్రత్యేక హోదా రావాలి
సభలో తీర్మానం చేద్దాం ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ
హైదరాబాద్: కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన నీతి ఆయోగ్కు రాష్ట్రం మద్దతు ప్రకటిస్తే కేంద్రం మాత్రం తాజా బడ్జెట్లో తెలంగాణకు మొండిచేయి చూపిందని ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్లోనే కాకుండా 14వ ఆర్థిక సంఘం కూడా తెలంగాణను చిన్నచూపు చూసిందన్నారు. తెలంగాణ నుంచి పన్నుల రూపంలో రూ.40వేల కోట్లు వసూలు చేసుకుం టుండగా గ్రాంట్ల రూపంలో కేవలం రూ.12,823 కోట్లు కేటాయించటం దారుణమన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఒవైసీ మంగళవారం సభలో మాట్లాడారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ విషయంలో కేంద్రం నిర్లక్ష్యాన్ని ఇతర పక్షాల సభ్యులెవరూ లేవనెత్తలేదని, ఇప్పటికైనా ఇటు ప్రభుత్వం, అటు ఇతర పక్షాలు దీన్ని తీవ్రంగా పరిగణించాలని అన్నారు. గ్రాంట్లు పెంచడంతోపాటు తెలంగాణకు ప్రత్యేక హోదాను ప్రకటించాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు సభలో తీర్మానం చేయాలని సూచించారు. మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న విషయంలో తనకు అనుమానం లేదన్నారు. గత బడ్జెట్లో రూ.వేయి కోట్లను కేటాయిస్తే కేవలం రూ.450 కోట్లను కూడా ఖర్చు చేయలేదన్నారు. ఇతర సంక్షేమ శాఖల్లో వేల సంఖ్యలో ఉద్యోగులుంటే, మైనారిటీ సంక్షేమ శాఖలో కేవలం వందమంది మాత్రమే ఉండడం నిర్లక్ష్యం కాదా? అని ప్రశ్నించారు.
ఆంధ్రాప్రాంతం వారి నివాసాల వద్దకే పాలనా కేంద్రం
ఎర్రగడ్డలో కొత్త సచివాలయ నిర్మాణాన్ని తాను స్వాగతిస్తున్నానని అక్బరుద్దీన్ పేర్కొన్నారు. ‘కూకట్పల్లి ప్రాంతంలో ఆంధ్రాప్రాం తం వారు అధికంగా ఉంటారు. వారికి చేరువ లో సచివాలయం నిర్మించడమంటే ఆంధ్రాప్రాంతం వారికి పాలనాకేంద్రాన్ని చేరువ చేయడమే’ అని పేర్కొన్నారు. పాతబస్తీని ఇస్తాంబుల్గా మారుస్తానన్న సీఎం హామీ కార్యరూపందాల్చే సమయం కోసం ఎదురుచూస్తున్నామన్నారు. చార్మినార్ నడకదారి ప్రాజెక్టు పేరుతో చిరువ్యాపారుల పొట్టకొట్టొద్దని కోరారు.
కేంద్ర గ్రాంట్లలో అన్యాయం
Published Wed, Mar 11 2015 2:47 AM
Advertisement
Advertisement
T20 World Cup 2024: భారత్ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ ప్లేయర్
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
సెన్సేషన్ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్
ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్ జగన్
యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా?
భూకంపాన్ని తట్టుకునే ఇల్లు.. ఇది కదా అసలైన టెక్నాలజీ అంటే!
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
లైఫ్లో మర్చిపోలేని వంటింటి చిట్కాలివిగో!
‘ప్రభుత్వ ఆస్తుల్ని జగన్కు ఎలా అంటగడతారు?’
హైదరాబాద్లో భారీ వర్షం
స్టార్ హీరో పాదాలకు నమస్కరించిన టాలీవుడ్ డైరక్టర్!
ఈ సౌత్ ఇండియన్ భామలపై ఓ లుక్కేసుకోండి! (ఫొటోలు)
ఎయిరిండియా భోజనంలో మెటల్ బ్లేడ్..!
ప్రియురాలితో సింపుల్గా నటుడి ఎంగేజ్మెంట్
ఢిల్లీ ఎయిర్పోర్టులో పవర్ కట్స్
T20 World Cup 2024: చరిత్ర సృష్టించిన నేపాల్ బౌలర్.. రషీద్ ఖాన్ తర్వాత..!
నీట్ పై దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న రచ్చ
తప్పక చదవండి
- స్టార్ హీరోయిన్ కోసం చెరువులో దూకిన అభిమాని.. ఆ తర్వాత!
- అనంత్ అంబానీ - రాధిక ప్రీ వెడ్డింగ్ : అనంత్ లవ్ లెటర్ను గమనించారా?
- ఏడవటం ఆరోగ్యానికి మంచిదా..? నిపుణులు ఏమంటున్నారంటే..
- ఐటీఆర్ దాఖలు చేస్తున్నారా.. ఏ ఫారం ఎవరికంటే..
- T20 వరల్డ్కప్లో సూపర్-8 బెర్త్లు ఖారారు.. షెడ్యూల్ ఇదే
- ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్.. ఆ రెండు స్పెషల్!
- అనంతపురం మేయర్కు అరుదైన గౌరవం
- ఢిల్లీలో రెడ్ అలర్ట్..‘బయటికెళ్లొద్దు.. మంచినీరు తాగండి’
- సిక్ప్యాక్! లుక్ కోసమైతే ఫసక్కే
- తల్లి కాటికి.. తండ్రి కటకటాలకు...!
Advertisement