అంబులెన్స్ ను ఢీకొన్న డీసీఎం: ఇద్దరు మృతి | two killed in road accident | Sakshi
Sakshi News home page

అంబులెన్స్ ను ఢీకొన్న డీసీఎం: ఇద్దరు మృతి

Feb 22 2015 4:52 PM | Updated on Aug 30 2018 3:56 PM

ప్రాణాపాయంలో ఉన్న వ్యక్తిని తరలిస్తున్న అంబులెన్స్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది.

రంగారెడ్డి(మొయినాబాద్): ప్రాణాపాయంలో ఉన్న వ్యక్తిని తరలిస్తున్న అంబులెన్స్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో అంబులెన్స్ డ్రైవర్ సహా చికిత్స కోసం తరలిస్తున్న మహిళ మృతిచెందింది. అంబులెన్స్‌లో ఉన్న మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని కనకమామిడి గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం బిస్మిల్లా బీ(25) అనే మహిళకు పాము కాటు వేయడంతో వికారాబాద్ ఆస్పత్రికి తరలించారు.

 

ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడినుంచి హైదరాబాద్ ఉస్మానియ ఆస్పత్రికి తరలిస్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి చేవెళ్ల వైపు వేగంగా వస్తున్న డీసీఎం ఎదురుగా వ స్తున్న అంబులెన్స్‌ను ఢికొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్ డ్రై వర్ సోహెల్(22) అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement