
టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల బాహాబాహీ
టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు బాహాబాహీకి దిగారు. పరస్పరం కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జి.చిన్నారెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి
స్వల్పంగా గాయపడిన ఎమ్మెల్యే చిన్నారెడ్డి
నేడు వనపర్తి బంద్
వనపర్తి: టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు బాహాబాహీకి దిగారు. పరస్పరం కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జి.చిన్నారెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. మహబూబ్నగర్ జిల్లా ఖిల్లా ఘనపురం మండలంలో పాత బీటీ రోడ్లకు మరమ్మతు చేసేందుకు నిధులు మంజూరయ్యాయి. ఇందులో భాగంగా వెంకటాయిపల్లిలో శిలాఫలకం ప్రారంభానికి టీఆర్ఎస్ నేత, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్రెడ్డి వస్తున్నారని, మీరు కూడా రావాలని అధికారులు ఎమ్మెల్యే చిన్నారెడ్డికి సమాచారం అందించారు. దీంతో ఆయన అక్కడకు చేరుకుని కొత్త నిర్మాణాలకు శిలాఫలకాలు వేస్తారు కానీ, పాతవాటికి ఎలా వేస్తారని అధికారులను నిలదీశారు. అనంతరం వెంకటాయిపాలెం సర్పంచ్ తమ గ్రామంలో శిలాఫలకం వేసి తనకు కూడా సమాచారం ఇవ్వకపోవడం ఏమిటని దానిని కూల్చివేశాడు. దీంతో స్థానిక ఎంపీపీ అక్కడకు వెళ్లి సర్పంచ్పై ఘర్షణకు దిగారు. చిన్నారెడ్డి వచ్చి ఎంపీపీ ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో ఎంపీపీ కుమారుడు, అనుచరులు కర్రలతో దాడికి దిగడంతో చిన్నారెడ్డి భుజం, కాళ్లపై స్వల్ప గాయాలయ్యాయి.
‘స్పీకర్కు ఫిర్యాదు చేస్తా’
అధికారులు ప్రొటోకాల్ పాటిం చడంలేదని ఎమ్మెల్యే అయిన తనకు కూడా సమాచారం ఇవ్వడంలేదని ఎమ్మెల్యే చిన్నారెడ్డి ఆరోపించారు. ఈ విషయంపై మంగళవారం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డితో కలసి స్పీకర్కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు.
నేడు వనపర్తి బంద్
ఎమ్మెల్యే చిన్నారెడ్డిపై దాడికి నిరసనగా మంగళవారం కాంగ్రెస్ పార్టీ వనపర్తి బంద్కు పిలుపునిచ్చింది. బంద్ను అందరూ విజయవం తం చేయాలని కోరింది.