- వికారాబాద్ను జిల్లా కేంద్రం చేస్తాం
- జిల్లాలో పారిశ్రామిక, ఐటీ రంగాల అభివృద్ధి
- 500 జనాభా ఉన్న తండాలను జీపీలుగా మారుస్తాం
- కూరగాయల జోన్ ఏర్పాటుకు కృషి
- 111 జీఓ ఎత్తివేతకు ప్రయత్నిస్తాం
- రవాణా శాఖ మంత్రి మహేందర్రెడ్డి
- చేవెళ్లలో ఘనంగా సన్మానం
చేవెళ్ల: ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణాలను మాఫీచేసి తీరుతామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్రెడ్డి స్పష్టం చేశారు. చేవెళ్లలోని ఓ ఫంక్షన్ హాల్లో బుధవారం మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు సామ మాణిక్రెడ్డి ఆధ్వర్యంలో మంత్రిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మహేందర్రెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన ప్రతి హామీని టీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో 84 గ్రామాల ప్రజలకు గుదిబండగా మారిన జీఓ 111ను ఎత్తివేసేందుకు ప్రయత్నం చేస్తామన్నారు.
ఈ కేసు సుప్రీంకోర్టులో ఉన్నదని, దీనిపై ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదని వెల్లడించారు. కేసీఆర్ చెప్పినట్లుగా వికారాబాద్ను జిల్లా కేంద్రం చేస్తామని, జిల్లాలు, నియోజకవర్గాల పునర్విభజన త్వరలో జరుగుతుందని చెప్పారు. హైదరాబాద్కు ఆనుకుని ఉన్న రంగారెడ్డి జిల్లా మున్ముందు ఐటీ, ప్రారిశ్రామిక రంగాల్లో గణనీయ పురోగతి సాధిస్తుందన్నారు.
ఉద్యానశాఖ ఆధ్వర్యంలో కూరగాయల సాగును ప్రోత్సహిస్తామని, రైతుకు సబ్సిడీపై డ్రిప్ పరికరాలు, విత్తనాలు అందేలా చూస్తామని చెప్పారు. 500 పైబడి జనాభాఉన్న గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా మారుస్తామన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 30నుంచి 50 డిపోల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని, చేవెళ్లలోనూ బస్డిపో ఏర్పాటు చేస్తామని అన్నారు.
ప్రతి గ్రామానికీ బస్సు నడిపిస్తామని, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ అధికారులతో మాట్లాడి రోడ్లకు మరమ్మతులు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ పట్నం నరేందర్రెడ్డి మాట్లాడుతూ పాలమూరు- ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్గౌడ్, జిల్లా నాయకులు సత్యనారాయణరెడ్డి, స్వప్న, ఎస్.వసంతం, కే.మహేందర్రెడ్డి, సామ మాణిక్రెడ్డి, పురుషోత్తం, ఆర్టీసీ టీఎంయూ జిల్లా కార్యదర్శి ఎం.భుజంగరెడ్డి తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు వై.శ్రీరాంరెడ్డి, ఎం.మాణిక్రెడ్డి, సామ రవీందర్రెడ్డి, కొలన్ ప్రభాకర్రెడ్డి, కే.సుధాకర్రెడ్డి, శంభారెడ్డి, జడల రాజేందర్గౌడ్, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
రుణమాఫీ చేసి తీరుతాం
Published Thu, Jun 26 2014 12:40 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐపీఎల్లో నేడు (మే 6) మరో బిగ్ మ్యాచ్
డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ఏం చెప్పినా చేస్తా: యువ నటుడు
జగనన్న కోసం సింగపూర్ నుంచి వచ్చి ఎన్నారైల ప్రచారం
పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
ఏ వయసు వారికైనా.. ఆరోగ్య బీమా! 65 ఏళ్ల పరిమితి లేదిక..
మైనార్టీలకు అండగా సీఎం వైఎస్ జగన్
No Headline
రైల్వే ఉద్యోగి ఆత్మహత్య
శ్రమజీవుల కేంద్రం.. రాయదుర్గం
నాటు పడవ బోల్తా
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement