వరంగల్ క్రైం : వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో తాళం వేసిన ఇళ్లే టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడే దొంగ పోలీసులకు చిక్కినట్లు వరంగల్ క్రైం అడిషనల్ డీసీపీ బిల్లా అశోక్కుమార్ తెలిపారు. గురువారం సీసీఎస్ పోలీసుస్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లా, కంబాలపల్లికి చెందిన బెల్లంకొండ యాకయ్య గత పది సంవత్సరాల క్రితం కూలీ పనులు చేసుకుంటూ జీవించేవాడు. మద్యంకు బానిసై కూలీ పనులతో వచ్చే డబ్బులు సరిపోకా సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనలతో మహబూబాబాద్, కేసముద్రం, నర్సంపేట, నెల్లికుదురు పోలీస్స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడి అరెస్ట్ అయి జైలు జీవితం గడిపినట్లు డీసీపీ తెలిపారు. గత ఐదు నెలల నుంచి వరంగల్ పోలీస్కమిషనరేట్ పరిధిలో రూ.7.20 లక్షల విలువగల 232 గ్రాముల బంగారం, 500 గ్రాముల వెండి ఆభరణాలు దొంగిలించినట్లు చెప్పారు. సుబేదారి పోలీస్స్టేషన్ పరిధిలో 3 చోరీలు, కేయూసీ, నర్సంపేట, చెన్నారావుపేట, ఖానాపూర్, పోలీస్స్టేషన్ల పరిధిలో ఒకటి చొప్పున చోరీలకు పాల్పడినట్లు ఆయన వివరించారు.
వరంగల్కు వచ్చి..పోలీసులకు చిక్కి...
దొంగలించిన బంగారు, వెండి ఆభరణాలను అమ్మి వచ్చిన డబ్బులతో ఇళ్లు కట్టుకోవాలనే ఆలోచనతో యాకయ్య దొంగిలించిన సొమ్మును ఇంట్లో భద్రపరచుకున్నాడు. మహబూబాబాద్లో అమ్మితే అనుమానం వస్తుందని భావించిన అట్టి సొమ్ములను వరంగల్ బులియన్ మార్కెట్లో అమ్మేందుకు వచ్చిన సమాచారంతో సీసీఎస్ ఇన్స్పెక్టర్ డెవిడ్రాజ్ సిబ్బందితో వెళ్లి నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారించగా చోరీలకు పాల్పడిన విషయం ఒపుకున్నట్లు ఆయన చెప్పారు. కాగా సకాలంలో నిందితుడిని గుర్తించి సొమ్ము స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబరిచిన క్రైం అదనపు డీసీపీ బిల్లా అశోక్కుమార్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ డేవిడ్ రాజు, ఎస్సై సంపత్, ఏఎస్సై వీరస్వామి, హెడ్కానిస్టేబుల్ శివకుమార్, సుధీర్, ఉమామహేశ్వర్, జంపయ్యలను వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ విశ్వనాథ్ రవీందర్ అభినందించారు.
తాళం వేసిన ఇళ్లే టార్గెట్
Published Fri, Mar 30 2018 10:51 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 World Cup 2024: చరిత్ర సృష్టించనున్న రోహిత్ శర్మ
మరికొన్ని గంటల్లో యాపిల్ ‘లెట్ లూస్ ఈవెంట్’
ముస్లిం సమాజం మారాలి: ప్రధాని మోదీ విజ్ఞప్తి
వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్తలపై బోండా ఉమా కొడుకు దాడి
కేజ్రీవాల్కు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రేమ లేఖ!
ధోని గురించి నిజాలు ఇవే! మాజీ క్రికెటర్లకు కౌంటర్
వ్యవస్థలను మేనేజ్ చేసేది చంద్రబాబే: ఎమ్మెల్సీ లేళ్ల
దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
తప్పక చదవండి
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement