ఫాంహౌస్‌కు సీఎం కేసీఆర్ | telangana went to farmhouse | Sakshi
Sakshi News home page

ఫాంహౌస్‌కు సీఎం కేసీఆర్

Jan 31 2016 3:57 AM | Updated on Jul 11 2019 7:45 PM

ఫాంహౌస్‌కు సీఎం కేసీఆర్ - Sakshi

ఫాంహౌస్‌కు సీఎం కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం రాత్రి 10 గంటల సమయంలో మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లి గ్రామ సమీపంలో గల తన వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు.

జగదేవ్‌పూర్: ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం రాత్రి 10 గంటల సమయంలో మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లి గ్రామ సమీపంలో గల తన వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన అక్కడి నుంచి ఫాంహౌస్‌కు వచ్చారు.

సోమవారం వరకు ఫాంహౌస్‌లోనే ఉంటారని సమాచారం. కాగా, సీఎం వస్తున్నారనే సమాచారంతో జిల్లా ఎస్పీ సుమతి ఆధ్వర్యంలో సాయంత్రం నుంచే రోడ్డు మార్గాన బందోబస్తు ఏర్పాటు చేశారు. గౌరారం, పాములపర్తి, శివారు వెంకటాపూర్ మీదుగా సీఎం కేసీఆర్ కాన్వాయ్ వ్యవసాయ క్షేత్రానికి చేరుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement