రూ.22 లక్షలకు ఐపీ దాఖలు చేసిన మహిళ | Rs. 22.26 lakhs fraud and IP applies | Sakshi
Sakshi News home page

రూ.22 లక్షలకు ఐపీ దాఖలు చేసిన మహిళ

Apr 22 2015 8:45 AM | Updated on Sep 3 2017 12:41 AM

ఖమ్మం జిల్లా కొత్తగూడేనికి చెందిన ఒక మహిళ వ్యాపారంలో నష్టం వచ్చిందంటూ రూ.22 లక్షలకు కోర్టులో దివాళా పిటిషన్ వేసింది.

ఖమ్మం: ఖమ్మం జిల్లా కొత్తగూడేనికి చెందిన ఒక మహిళ వ్యాపారంలో నష్టం వచ్చిందంటూ రూ.22 లక్షలకు కోర్టులో దివాళా పిటిషన్ వేసింది. వివరాలు.. కొత్తగూడెం పట్టణం కొత్తబజార్‌కు చెందిన కుర్మా కల్యాణికి భర్త లేడు. దీంతో పిల్లల పోషణార్ధం అనేక వ్యాపారాలు చేపట్టింది. మొదట పాల వ్యాపారం చేసింది. ఇందుకోసం కొన్ని పశువులను ఎక్కువ ధరకు కొనుగోలు చేయటంతో నష్టం వచ్చింది. తర్వాత వస్త్రాలు, బియ్యం విక్రయాలు చేపట్టింది.


కిరాణా దుకాణంతో పాటు చిట్టీల వ్యాపారం చేసింది. వ్యాపారాభివృద్ధి కోసం ప్రతివాదులైన 36 మంది వద్ద అధిక వడ్డీలకు రూ.22.26 లక్షల మేర అప్పు తెచ్చింది. వ్యాపారాల్లో నష్టాలు రావటంతో తీర్చలేకపోయింది. దీంతో తనను దివాళా తీసినట్లుగా ప్రకటించాలని మంగళవారం కోర్టును ఆశ్రయించింది.

Advertisement

పోల్

Advertisement