
టీడీపీ నేత ఇంటిపై పోలీసులు దాడి
ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో ఓటర్లును ప్రలోభ పెట్టేందుకు టీడీపీ నాయకుడు, మాజీ సర్పంచ్ ఆకుల శ్రీనివాస్ రంగంలోకి దిగారు.
ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో ఓటర్లును ప్రలోభ పెట్టేందుకు టీడీపీ నాయకుడు, మాజీ సర్పంచ్ ఆకుల శ్రీనివాస్ రంగంలోకి దిగారు. ఓటర్లకు విచ్చలవిడిగా నగదు, మద్యం పంపిణీ చేస్తుండటంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఆకుల శ్రీనివాస్ నివాసంపై పోలీసులు మంగళవారం దాడి చేశారు. ఆ క్రమంలో రూ. లక్ష నగదు, భారీగా మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆకుల శ్రీనివాస్పై పోలీసులు కేసు నమోదు చేశారు.