నిజామాబాద్నాగారం : ‘‘ప్రత్యేక రాష్ట్రం వచ్చింది.. కొత్త ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు పెంచింది. మంచి వేతనాలనే ఇస్తోంది. అత్యాశకు పోయి లంచాలు తీసుకుంటే మీకే నష్టం. పైసలకు కక్కుర్తి పడితే పరిస్థితి దారుణంగా ఉంటుంది.. ఇకనైనా మారండి. తీసుకుంటున్న జీతానికి తగ్గట్టు పనిచేయండి’’ అని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ ప్రభాకర్ సిబ్బందికి హితవు పలికారు. విద్యుత్ శాఖలో ‘లంచావతారులు’ శీర్షికన సోమవారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు.
బుధవారం సాయంత్రం నుంచి రాత్రి 9 గంటల వరకు జిల్లా కేంద్రంలోని పవర్హౌజ్లో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఇటీవలి కాలంలో విద్యుత్ శాఖ పెరిగిపోతున్న అవినీతికి అడ్డుకట్ట వేయూలని నిర్ణయించినట్లు తెలిసింది. జిల్లాలోని డీఈఈలు, ఏడీఈలు, ఏఈలతో చర్చించారని సమాచారం. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ‘‘మన శాఖపై రైతులు, ప్రజల్లో చెడు అభిప్రాయం ఏర్పడింది. విద్యుత్శాఖ అధికారులు ప్రతి పనికి కక్కుర్తి పడడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చింది.
మీరు తీసుకుంటున్న జీతాలతో కుటుంబాలను సంతోషంగా పోషించుకుంటూ పిల్లలకు మంచి విద్యను అందించవచ్చు. అయినా వినియోగదారుడు, రైతు ఏదైనా పనుల నిమిత్తం మన కార్యాలయానికి వస్తే సంబంధిత ఏఈ, ఏడీఈ, డీఈఈలు డబ్బులు డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలున్నారుు. ఆయూ కారణాలతో ఏసీబీ వలకు చిక్కుతున్నారు.
ప్రజల కోసం పనిచేయాల్సింది పోయి అక్రమంగా డబ్బులు సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకోవడం సరికాదు. అవినీతి విషయంలో సీఎండీ, డెరైక్టర్లు సీరియస్గా ఉన్నారు. సిబ్బంది అవినీతికి పాల్పడినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇకనైనా మారండి. నిజారుుతీగా పనిచేయండి. శాఖకు మంచి పేరు తీసుకురండి’’ అని సిబ్బందికి సూచించారు.
బంగారు తెలంగాణ కోసం..
విద్యుత్శాఖ ఉద్యోగులు అందరు బంగారు తెలంగాణ కోసం పాటుపడాలని విజిలెన్స్ డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. లంచాలు తీసుకోవడం మంచిది కాదన్నారు. మనకు వస్తున్న జీతాలతో హాయిగా బతకవచ్చన్నారు. మంచిగా పనిచేస్తే వినియోగదారులు దేవుడిగా కొలుస్తారన్నారు. అనంతరం అవినీతి, అక్రమాలకు దూరంగా, మంచి మార్పుతో పనిచేస్తామని ప్రతిజ్ఞ చేయించారు.
మారండి.. మంచి పేరు తెండి
Published Thu, Apr 23 2015 2:17 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
తప్పక చదవండి
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement